Political News

జోరుగా ‘సమైక్యం’పై చర్చలు

కేసీయార్ ఏ ముహూర్తంలో ప్రకటించారో కానీ అప్పటి నుంచి సమైక్య రాష్ట్రంపై తెలంగాణ లో జోరుగా చర్చలు మొదలయ్యాయి. మొన్నటి ప్లీనరీ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ ఏపీలో కూడా పార్టీ పెట్టమని తనకు వేలాది విజ్ఞప్తులు వస్తున్నట్లు ప్రకటించారు. తాను కనుక పార్టీ పెడితే దగ్గరుండి గెలిపించుకుంటామని కేసీయార్ గొప్పలకు పోయి ఆర్భాటంగా ప్రకటించారు. మరి కేసీయార్ ప్రకటన వెనక ఆంతర్యం ఏమిటో గానీ అప్పటి నుండి రివర్సు తగులుతోంది.

కేసీయార్ సమైక్య రాష్ట్రం కోసం ప్రయత్నిస్తున్నారా ? అనే చర్చ పెరిగిపోయింది. ఒక్కసారిగా సమైక్య చర్చ ఎందుకు పెరిగిపోయిందంటే మొదటిదేమో కేసీయార్ ప్రకటన అయితే రెండో కారణం ఏమిటంటే ప్లీనరీ ప్రాంగణంలో తెలుగు తల్లి విగ్రహాలు, ఫ్లెక్సీలు వాడటం. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలుగు తల్లి విగ్రహానికి బదులు తెలంగాణా తల్లి విగ్రహాలను ప్రత్యేకంగా చేయించిన విషయం తెలిసిందే. కేసీయార్ ఎప్పుడైతే ఏపీలో పార్టీ అని ప్రకటించారో వెంటనే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తగులుకున్నారు.

తెలంగాణా-ఏపీని కలిపేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నట్లు మండిపడ్డారు. ఇదే సమయంలో ప్రత్యేకంగా పార్టీ ఎందుకు రెండు రాష్ట్రాలను కలిపేద్దామని ఏపీ మంత్రి పేర్నినాని ప్రతిపాదించారు. దాంతో సమైక్యంపై చర్చ మరింత పెరిగిపోయింది. వీటన్నింటికీ అదనంగా కాంగ్రెస్ ఎంఎల్ఏ జగ్గారెడ్డి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రం వాదనను బలంగా వినిపించారు. తాను మొదటి నుండి సమైక్యవాదినే అంటు కుండబద్దలు కొట్టారు. రెండు రాష్ట్రాలు మళ్ళీ కలిసిపోతే నీళ్ళ పంచాయితీలుండవన్నారు. ఇంకా చాలా సమస్యలు పరిష్కారమైపోతాయన్నారు.

సమైక్య రాష్ట్రం విడిపోతుందా ? కరోనా వైరస్ వస్తుందని ఎవరైనా అనుకున్నారా ? అని ప్రశ్నించిన ఎంఎల్ఏ మళ్ళీ రెండు రాష్ట్రాలు కలవకూడదని ఏమన్నా ఉందా అని నిలదీస్తున్నారు. సమైక్య రాష్ట్రానికి కేసీయార్ గనుక ప్రయత్నాలు చేస్తే తాను మద్దతిస్తానంటు జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కలకలం సృష్టిస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన కొంత కాలంలోనే రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే బాగుండేదనే చర్చ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల్లో ఉన్న విషయాన్ని జగ్గారెడ్డి ప్రస్తావించారు.

మొత్తం మీద ఇంతకాలం నిస్త్రాణంగా ఉన్న సమైక్యంపై చర్చలు కేసీయార్ పుణ్యమాని బహిరంగంగా జరుగుతోంది. అది కూడా రాజకీయ పార్టీల్లోనే జరుగుతుండటంతో జనాల్లో కూడా చర్చలు పెరిగిపోతోంది. నిజానికి చాలామంది జనాల్లో రాష్ట్రం విడిపోవటం ఇష్టం లేదు. కాకపోతే తమ మనోగతాన్ని తెలంగాణలో వాళ్ళు బయటపెట్టలేదు. దీనికి కారణం ఏమిటంటే తెలంగాణాలో సుమారు కోటిమందికి పైగా సీమాంధ్ర జనాలుండటమే. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో సీమాంధ్ర జనాలు ఎక్కువగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. మరిపుడు మొదలైన చర్చ చివరకు ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.

This post was last modified on October 31, 2021 11:40 am

Share
Show comments

Recent Posts

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

37 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

1 hour ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

12 hours ago