Political News

జోరుగా ‘సమైక్యం’పై చర్చలు

కేసీయార్ ఏ ముహూర్తంలో ప్రకటించారో కానీ అప్పటి నుంచి సమైక్య రాష్ట్రంపై తెలంగాణ లో జోరుగా చర్చలు మొదలయ్యాయి. మొన్నటి ప్లీనరీ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ ఏపీలో కూడా పార్టీ పెట్టమని తనకు వేలాది విజ్ఞప్తులు వస్తున్నట్లు ప్రకటించారు. తాను కనుక పార్టీ పెడితే దగ్గరుండి గెలిపించుకుంటామని కేసీయార్ గొప్పలకు పోయి ఆర్భాటంగా ప్రకటించారు. మరి కేసీయార్ ప్రకటన వెనక ఆంతర్యం ఏమిటో గానీ అప్పటి నుండి రివర్సు తగులుతోంది.

కేసీయార్ సమైక్య రాష్ట్రం కోసం ప్రయత్నిస్తున్నారా ? అనే చర్చ పెరిగిపోయింది. ఒక్కసారిగా సమైక్య చర్చ ఎందుకు పెరిగిపోయిందంటే మొదటిదేమో కేసీయార్ ప్రకటన అయితే రెండో కారణం ఏమిటంటే ప్లీనరీ ప్రాంగణంలో తెలుగు తల్లి విగ్రహాలు, ఫ్లెక్సీలు వాడటం. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలుగు తల్లి విగ్రహానికి బదులు తెలంగాణా తల్లి విగ్రహాలను ప్రత్యేకంగా చేయించిన విషయం తెలిసిందే. కేసీయార్ ఎప్పుడైతే ఏపీలో పార్టీ అని ప్రకటించారో వెంటనే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తగులుకున్నారు.

తెలంగాణా-ఏపీని కలిపేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నట్లు మండిపడ్డారు. ఇదే సమయంలో ప్రత్యేకంగా పార్టీ ఎందుకు రెండు రాష్ట్రాలను కలిపేద్దామని ఏపీ మంత్రి పేర్నినాని ప్రతిపాదించారు. దాంతో సమైక్యంపై చర్చ మరింత పెరిగిపోయింది. వీటన్నింటికీ అదనంగా కాంగ్రెస్ ఎంఎల్ఏ జగ్గారెడ్డి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రం వాదనను బలంగా వినిపించారు. తాను మొదటి నుండి సమైక్యవాదినే అంటు కుండబద్దలు కొట్టారు. రెండు రాష్ట్రాలు మళ్ళీ కలిసిపోతే నీళ్ళ పంచాయితీలుండవన్నారు. ఇంకా చాలా సమస్యలు పరిష్కారమైపోతాయన్నారు.

సమైక్య రాష్ట్రం విడిపోతుందా ? కరోనా వైరస్ వస్తుందని ఎవరైనా అనుకున్నారా ? అని ప్రశ్నించిన ఎంఎల్ఏ మళ్ళీ రెండు రాష్ట్రాలు కలవకూడదని ఏమన్నా ఉందా అని నిలదీస్తున్నారు. సమైక్య రాష్ట్రానికి కేసీయార్ గనుక ప్రయత్నాలు చేస్తే తాను మద్దతిస్తానంటు జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కలకలం సృష్టిస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన కొంత కాలంలోనే రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే బాగుండేదనే చర్చ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల్లో ఉన్న విషయాన్ని జగ్గారెడ్డి ప్రస్తావించారు.

మొత్తం మీద ఇంతకాలం నిస్త్రాణంగా ఉన్న సమైక్యంపై చర్చలు కేసీయార్ పుణ్యమాని బహిరంగంగా జరుగుతోంది. అది కూడా రాజకీయ పార్టీల్లోనే జరుగుతుండటంతో జనాల్లో కూడా చర్చలు పెరిగిపోతోంది. నిజానికి చాలామంది జనాల్లో రాష్ట్రం విడిపోవటం ఇష్టం లేదు. కాకపోతే తమ మనోగతాన్ని తెలంగాణలో వాళ్ళు బయటపెట్టలేదు. దీనికి కారణం ఏమిటంటే తెలంగాణాలో సుమారు కోటిమందికి పైగా సీమాంధ్ర జనాలుండటమే. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో సీమాంధ్ర జనాలు ఎక్కువగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. మరిపుడు మొదలైన చర్చ చివరకు ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.

This post was last modified on October 31, 2021 11:40 am

Share
Show comments

Recent Posts

ఇరాన్ పై యుద్ధం… ట్రంప్ కొంప ముంచుతుందా?

ఇరాన్‌తో యుద్ధం విష‌యంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా?  నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…

1 hour ago

‘కల్కి’పై విమర్శలకు కట్టుబడి ఉన్న లిరిసిస్ట్

ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…

2 hours ago

ఎన్నిక‌ల క‌మిష‌నర్‌ను తొలగించడానికి తీర్మానమా?

దేశంలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప‌లు కీల‌క అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్ర‌ధాని పైనే గ‌త ఐదేళ్ల‌లో…

4 hours ago

చంద్రబాబు 3సీ ఫార్ములా… ఇది కలెక్టర్ల కోసమే

ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…

6 hours ago

థియేటర్ అనుభూతికి ‘సబ్ టైటిల్స్’ దెబ్బ

మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…

7 hours ago

సెలబ్రెటీ పెళ్లిళ్లు.. హడావుడి తగ్గించాలా?

పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…

7 hours ago