Political News

జోరుగా ‘సమైక్యం’పై చర్చలు

కేసీయార్ ఏ ముహూర్తంలో ప్రకటించారో కానీ అప్పటి నుంచి సమైక్య రాష్ట్రంపై తెలంగాణ లో జోరుగా చర్చలు మొదలయ్యాయి. మొన్నటి ప్లీనరీ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ ఏపీలో కూడా పార్టీ పెట్టమని తనకు వేలాది విజ్ఞప్తులు వస్తున్నట్లు ప్రకటించారు. తాను కనుక పార్టీ పెడితే దగ్గరుండి గెలిపించుకుంటామని కేసీయార్ గొప్పలకు పోయి ఆర్భాటంగా ప్రకటించారు. మరి కేసీయార్ ప్రకటన వెనక ఆంతర్యం ఏమిటో గానీ అప్పటి నుండి రివర్సు తగులుతోంది.

కేసీయార్ సమైక్య రాష్ట్రం కోసం ప్రయత్నిస్తున్నారా ? అనే చర్చ పెరిగిపోయింది. ఒక్కసారిగా సమైక్య చర్చ ఎందుకు పెరిగిపోయిందంటే మొదటిదేమో కేసీయార్ ప్రకటన అయితే రెండో కారణం ఏమిటంటే ప్లీనరీ ప్రాంగణంలో తెలుగు తల్లి విగ్రహాలు, ఫ్లెక్సీలు వాడటం. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలుగు తల్లి విగ్రహానికి బదులు తెలంగాణా తల్లి విగ్రహాలను ప్రత్యేకంగా చేయించిన విషయం తెలిసిందే. కేసీయార్ ఎప్పుడైతే ఏపీలో పార్టీ అని ప్రకటించారో వెంటనే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తగులుకున్నారు.

తెలంగాణా-ఏపీని కలిపేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నట్లు మండిపడ్డారు. ఇదే సమయంలో ప్రత్యేకంగా పార్టీ ఎందుకు రెండు రాష్ట్రాలను కలిపేద్దామని ఏపీ మంత్రి పేర్నినాని ప్రతిపాదించారు. దాంతో సమైక్యంపై చర్చ మరింత పెరిగిపోయింది. వీటన్నింటికీ అదనంగా కాంగ్రెస్ ఎంఎల్ఏ జగ్గారెడ్డి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రం వాదనను బలంగా వినిపించారు. తాను మొదటి నుండి సమైక్యవాదినే అంటు కుండబద్దలు కొట్టారు. రెండు రాష్ట్రాలు మళ్ళీ కలిసిపోతే నీళ్ళ పంచాయితీలుండవన్నారు. ఇంకా చాలా సమస్యలు పరిష్కారమైపోతాయన్నారు.

సమైక్య రాష్ట్రం విడిపోతుందా ? కరోనా వైరస్ వస్తుందని ఎవరైనా అనుకున్నారా ? అని ప్రశ్నించిన ఎంఎల్ఏ మళ్ళీ రెండు రాష్ట్రాలు కలవకూడదని ఏమన్నా ఉందా అని నిలదీస్తున్నారు. సమైక్య రాష్ట్రానికి కేసీయార్ గనుక ప్రయత్నాలు చేస్తే తాను మద్దతిస్తానంటు జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కలకలం సృష్టిస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన కొంత కాలంలోనే రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే బాగుండేదనే చర్చ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల్లో ఉన్న విషయాన్ని జగ్గారెడ్డి ప్రస్తావించారు.

మొత్తం మీద ఇంతకాలం నిస్త్రాణంగా ఉన్న సమైక్యంపై చర్చలు కేసీయార్ పుణ్యమాని బహిరంగంగా జరుగుతోంది. అది కూడా రాజకీయ పార్టీల్లోనే జరుగుతుండటంతో జనాల్లో కూడా చర్చలు పెరిగిపోతోంది. నిజానికి చాలామంది జనాల్లో రాష్ట్రం విడిపోవటం ఇష్టం లేదు. కాకపోతే తమ మనోగతాన్ని తెలంగాణలో వాళ్ళు బయటపెట్టలేదు. దీనికి కారణం ఏమిటంటే తెలంగాణాలో సుమారు కోటిమందికి పైగా సీమాంధ్ర జనాలుండటమే. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో సీమాంధ్ర జనాలు ఎక్కువగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. మరిపుడు మొదలైన చర్చ చివరకు ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.

This post was last modified on October 31, 2021 11:40 am

Share
Show comments

Recent Posts

మైఖేల్ జాక్సన్ మీద ఇంత ప్రేమ ఉందా

ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…

36 minutes ago

శ్రీలీల డెబ్యూకి మోక్షం ఎప్పుడో

అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…

2 hours ago

పెయిడ్ ట్వీట్లతో ప్రయోజనమేమి?

చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…

3 hours ago

LSG: ఓనర్ గోయెంకా కోపంలో తప్పు లేదు!

ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…

3 hours ago

తెలుగు టైటిల్స్ నిర్లక్ష్యం చేయకండి

ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…

4 hours ago

క‌విత దూకుడు మామూలుగా లేదు

క‌ల్వ‌కుంట్ల క‌విత‌.. మాజీసీఎం కేసీఆర్ త‌న‌య‌గా.. రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్య‌వ‌హ‌రించారు. ఇక‌, ఆ పార్టీతో…

4 hours ago