రాష్ట్రాన్ని ప్రస్తుతం కుదిపేస్తున్న అంశం ఏదైనా ఉంటే.. అది గంజాయే! తాజాగా తూర్పుగోదావరి సహా.. అనంతపురంలోనూ గంజాయిని పోలీసులు పెద్ద మొత్తంలో పట్టుకున్నారు. అదేసమయంలో పెళ్లి సహా వివిధ శుభకార్యాలకు పిలిచే ఆహ్వాన పత్రికలమాటున కూడా పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలను తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. ఇవన్నీ..ఏపీ కేంద్రంగానే జరుగుతున్నట్టు ఇతర రాష్ట్రాల పోలీసులు మరోసారి కూడా చెప్పారు. అయితే.. ఇంత కీలక విషయంపై కేబినెట్ చర్చిస్తుందని.. అందరూ అనుకున్నారు. ఈ రోజు ఉదయం ప్రారంభమైన కేబినెట్లో ఈ విషయం తప్పకుండా ఉంటుందని అనుకున్నారు.
కానీ, కేబినెట్ అజెండాలో మాత్రం ఈ అంశానికి చోటు లేకపోవడం గమనార్హం. ఏపీ సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో సినిమా టిక్కెట్లను ఆన్లైన్లో ప్రభుత్వం విక్రయించడంపై చర్చిస్తున్నారు. అదేసమయంలో సినిమాటోగ్రఫీ చట్టసవరణపై చర్చించనున్నారు. ఇక, కీలకమైన ఆలయాల్లో భద్రతకు సీసీ కెమెరాలు, ఇతర చర్యలకు ప్రత్యేకంగా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం, ‘ఈడబ్ల్యూఎస్’ కేటగిరిలోని వారి సంక్షేమ కార్యకలాపాలకు ప్రత్యేకంగా ఓ శాఖ ఏర్పాటుపై కేబినెట్లో చర్చించనున్నారు. ఇలా దాదాపు 20 నుంచి 25 అంశాలపై మంత్రివర్గం చర్చించి ఆమోదముద్ర వేయనుంది.
కానీ, అత్యంత ముఖ్యమైన.. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల మధ్య దాడులకు, వ్యాఖ్యలకు కేంద్రమైన గంజాయి సహా.. డ్రగ్స్పై మాత్రం కేబినెట్ దృష్టి పెట్టకపోవడం గమనార్హం. కానీ, ఇదే రోజు.. మహారాష్ట్రలో.. కేబినెట్ ప్రత్యేకంగా భేటీ అవుతోంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు జరిగే భేటీలో డ్రగ్స్పైనే చర్చించనున్నట్టు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. కానీ, రాష్ట్రంలో అనేక వివాదాలకు.. కారణంగా ఉన్న అంశంపై ఏపీ ప్రభుత్వం మాత్రం చర్చించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అంటే.. ఇప్పటకే చర్యలు తీసుకున్నామనే సంకేతాలు పంపేస్తున్నారా? లేక.. గంజాయి వంటివాటిపైచర్చిస్తే.. ప్రతిపక్షాలకుమైలేజీ వస్తుందని అనుకున్నారా? అనే ప్రశ్నలు తెరమీదకి వస్తున్నాయి. ఏదేమైనా.. ప్రభుత్వ వైఖరిపై మాత్రం విమర్శలు వస్తున్నాయి. అదేసమయంలో ఎయిడెడ్ స్కూళ్లపై రాష్ట్ర వ్యాప్తంగా విదద్యార్థుల తల్లిదండ్రులు ఆందోలనలు చేస్తుంటే.. ఆ అంశంపైనా.. ప్రభుత్వం చర్చించకపోవడం గమనార్హం.
This post was last modified on October 28, 2021 10:15 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…