సినీ హీరో.. అక్కినేని నాగార్జున సహా.. పలువురు ముఖ్య నిర్మాతలు.. నేడు సాయంత్రం 3-5 గంటల మధ్య ముఖ్యమంత్రి జగన్తో భేటీ కానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాదు నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి ఈ బృందం చేరుకుంది. హీరో అక్కినేని నాగార్జునతోపాటు.. ముఖ్య నిర్మాతలు ప్రీతం రెడ్డి, నిరంజన్ రెడ్డి. కూడా రావడం చర్చనీయాంశంగా మారింది. గన్నవరం విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన విజయవాడ బయల్దేరిన అక్కినేని నాగార్జున బృందం సాయంత్రం వరకు విజయవాడలోనే బస చేయనున్నట్టు సమాచారం.
మధ్యాహ్న భోజనం విజయవాడలోనే ముగించుకుని.,. మూడు గంటలకు తాడేపల్లి వెళ్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ కేబినెట్ భేటీలో ఉన్నారు. సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశం మధ్యాహ్నం మూడు లేదా నాలుగు గంటల వరకు జరగనుంది. అనంతరం.. ఆయన తాడేపల్లికి చేరుకుం టారు.
ఈ క్రమంలోనే నాగార్జున బృందం సీఎంతో భేటీ అవుతుందని తెలుస్తోంది. ఇక, ఇటీవలే దిల్ రాజు సహా.. పలువురు నిర్మాతలు.. కొన్ని రోజుల కిందట.. మంత్రి పేర్నినానితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఆన్ లైన్ టికెట్ల విక్రయాలపై వారు చర్చించారు. అదేసమయంలో పవన్ కళ్యాణ్.. హైదరాబాద్లో చేసిన వ్యాఖ్యలపైనా చర్చించారు.
ఇప్పుడు ఇదే పనిపై నాగార్జున కూడా వచ్చినట్టు తెలుస్తోంది. తాజాగా జరుగుతున్న కేబినెట్ భేటీలో ఆన్ లైన్ సినిమా టికెట్ల విక్రయానికి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ క్రమంలో దీనిపైనే చర్చించడానికి నాగార్జున వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
అదే సమయంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు.. తమకు సహకరిస్తున్నాయని.. నాగార్జున వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇస్తారా? దానికీ ఇండస్ట్రీకి సంబంధం లేదని.. మరోసారి సీఎంకు వివరిస్తారా? అనే అంశాలు కూడా ప్రస్తావనకు వస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో ఏం చర్చిస్తారో.. చూడాలి.
This post was last modified on October 28, 2021 1:31 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…