పంజాబ్ రాజకీయాలలో కొద్ది రోజులుగా నాటకీయ పరిణామాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, పీపీసీసీ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూల మధ్య పచ్చగడ్డి వేయకపోయినా భగ్గుమంటుండడంతో కాంగ్రెస్ అధిష్టానం తలలు పట్టుకుంటోంది. ఈ క్రమంలోనే అనూహ్యంగా కెప్టెన్ రాజీనామా చేయడం, ఆ తర్వాత సిద్ధూ కూడా తన పదవికి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ లో లుకలుకలు బజారునపడ్డాయి.
ఈ ఇద్దరికి కాకుండా మధ్యేమార్గంగా చరణ్ జిత్ సింగ్ చన్నీకి సీఎం పగ్గాలు అప్పగించిన కాంగ్రెస్ హైకమాండ్…పరిస్థితులు మెల్లగా చక్కబడతాయిలే అనుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ అధిష్టానానికి పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ మరో షాకిచ్చారు. కొంతకాలంగా వస్తున్న ఊహాగానాలకు తగ్గట్లుగానే తాను కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు అమరిందర్ సింగ్ అధికారికంగా ప్రకటించారు. ఎన్నికల సంఘం అనుమతులు వచ్చిన వెంటనే పార్టీ పేరు, గుర్తును ప్రకటిస్తానని కెప్టెన్ చెప్పడంతో కాంగ్రెస్ శ్రేణులకు షాక్ తగిలినట్లయింది.
అంతేకాదు, అన్నీ అనుకున్నట్లు జరిగితే, కాలం కలిసివస్తే త్వరలో జరగబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 117 సీట్లలో తమ పార్టీ సొంతంగా పోటీ చేస్తుందని కెప్టెన్ వెల్లడించారు. ఒకవేళ, పరిస్థితులను బట్టి బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు కూడా వెనకాడబోమని కెప్టెన్ క్లారిటీ ఇచ్చారు. అవసరమనుకుంటే బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని, అందుకు తగ్గట్లుగా సీట్ల సర్దుబాటు చేసుకుంటామని తెలిపారు. పంజాబ్లో శాంతిని నెలకొల్పడమే తమ పార్టీ ముఖ్య ఉద్దేశమని కెప్టెన్ చెప్పారు.
అయితే, కాంగ్రెస్ హై కమాండ్ పై అసంతృప్తితో ఉన్న కెప్టెన్…బీజేపీలో చేరతారని జోరుగా ప్రచారం జరిగింది. కెప్టెన్ ను పార్టీలో చేర్చుకోవడానికి అమిత్ షా సుముఖంగా ఉన్నారని, పంజాబ్ ను కైవసం చేసుకునేందుకు బీజేపీ పెద్దలు కెప్టెన్ ను తమ వైపునకు తిప్పుకున్నారని టాక్ వచ్చింది. కానీ, తాజాగా కెప్టెన్ ప్రకటనతో బీజేపీలో ఆయన చేరడం లేదని క్లారిటీ వచ్చింది. అయితే, బీజేపీతో పొత్తుకు మాత్రం కెప్టెన్ సుముఖంగా ఉండడంతో ఎన్నికల తర్వాతైన బీజేపీలో పార్టీని విలీనం చేసే చాన్స్ ఉందని టాక్ వస్తోంది. మరోవైపు, తాను కాంగ్రెస్లోనే కొనసాగుతానని సిద్ధూ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
This post was last modified on October 27, 2021 6:52 pm
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…
నటుడు శ్రీకాంత్ వారసుడిగా పెళ్లి సందడితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ మేక తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో…
స్టార్ హీరోలు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేయాలని.. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుందనే అభిప్రాయం ఎప్పట్నుంచో ఉన్నదే. పెద్ద స్టార్లు మాత్రమే…