పంజాబ్ రాజకీయాలలో కొద్ది రోజులుగా నాటకీయ పరిణామాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, పీపీసీసీ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూల మధ్య పచ్చగడ్డి వేయకపోయినా భగ్గుమంటుండడంతో కాంగ్రెస్ అధిష్టానం తలలు పట్టుకుంటోంది. ఈ క్రమంలోనే అనూహ్యంగా కెప్టెన్ రాజీనామా చేయడం, ఆ తర్వాత సిద్ధూ కూడా తన పదవికి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ లో లుకలుకలు బజారునపడ్డాయి.
ఈ ఇద్దరికి కాకుండా మధ్యేమార్గంగా చరణ్ జిత్ సింగ్ చన్నీకి సీఎం పగ్గాలు అప్పగించిన కాంగ్రెస్ హైకమాండ్…పరిస్థితులు మెల్లగా చక్కబడతాయిలే అనుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ అధిష్టానానికి పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ మరో షాకిచ్చారు. కొంతకాలంగా వస్తున్న ఊహాగానాలకు తగ్గట్లుగానే తాను కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు అమరిందర్ సింగ్ అధికారికంగా ప్రకటించారు. ఎన్నికల సంఘం అనుమతులు వచ్చిన వెంటనే పార్టీ పేరు, గుర్తును ప్రకటిస్తానని కెప్టెన్ చెప్పడంతో కాంగ్రెస్ శ్రేణులకు షాక్ తగిలినట్లయింది.
అంతేకాదు, అన్నీ అనుకున్నట్లు జరిగితే, కాలం కలిసివస్తే త్వరలో జరగబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 117 సీట్లలో తమ పార్టీ సొంతంగా పోటీ చేస్తుందని కెప్టెన్ వెల్లడించారు. ఒకవేళ, పరిస్థితులను బట్టి బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు కూడా వెనకాడబోమని కెప్టెన్ క్లారిటీ ఇచ్చారు. అవసరమనుకుంటే బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని, అందుకు తగ్గట్లుగా సీట్ల సర్దుబాటు చేసుకుంటామని తెలిపారు. పంజాబ్లో శాంతిని నెలకొల్పడమే తమ పార్టీ ముఖ్య ఉద్దేశమని కెప్టెన్ చెప్పారు.
అయితే, కాంగ్రెస్ హై కమాండ్ పై అసంతృప్తితో ఉన్న కెప్టెన్…బీజేపీలో చేరతారని జోరుగా ప్రచారం జరిగింది. కెప్టెన్ ను పార్టీలో చేర్చుకోవడానికి అమిత్ షా సుముఖంగా ఉన్నారని, పంజాబ్ ను కైవసం చేసుకునేందుకు బీజేపీ పెద్దలు కెప్టెన్ ను తమ వైపునకు తిప్పుకున్నారని టాక్ వచ్చింది. కానీ, తాజాగా కెప్టెన్ ప్రకటనతో బీజేపీలో ఆయన చేరడం లేదని క్లారిటీ వచ్చింది. అయితే, బీజేపీతో పొత్తుకు మాత్రం కెప్టెన్ సుముఖంగా ఉండడంతో ఎన్నికల తర్వాతైన బీజేపీలో పార్టీని విలీనం చేసే చాన్స్ ఉందని టాక్ వస్తోంది. మరోవైపు, తాను కాంగ్రెస్లోనే కొనసాగుతానని సిద్ధూ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
This post was last modified on October 27, 2021 6:52 pm
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…