Political News

బీజేపీ మేనిఫెస్టో విడుదల.. హుజురాబాద్ ప్రజలకు ఆఫర్లు

హుజురాబాద్ ఉప ఎన్నిక మేనిఫెస్టోను బీజేపీ విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోలో సంక్షేమానికి పెద్ద పీఠ వేశారు. రైతులు, విద్యార్థులు, బాలికలు మహిళల సంక్షేమమే ధ్యేయంగా మెనిఫెస్టో రూపొందించారు. అన్ని రంగాలకు సుముచిత స్థానం కల్పించిన ఈ మోనిఫెస్టోను ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ తరుణ్‌చుగ్ మ్యానిఫెస్టో విడుదల చేశారు. ఇందులో నియోజకవర్గ ఓటర్లను ఆకర్షించేందుకు భారీ ఆఫర్లు ప్రకటించారు. హుజురాబాద్‌లో బీజేపీ గెలిస్తే కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కచ్చితంగా అమలు చేస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు.

హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో 60ఏళ్ల పైబడిన రైతులకు రూ.3వేల పెన్షన్ అందజేస్తామని తెలిపారు. అర్హులైన విద్యార్థులు విదేశాలకు వెళ్లడానికి విద్యాలక్ష్మి పథకం ద్వారా సహాయం అందజేస్తామని మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు.

అలాగే హుజురాబాద్‌ నియోజకవర్గంలోని అన్ని రైల్వే స్టేషన్స్‌ను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అవసరమున్నచోట ఆర్వోబీల నిర్మాణం చేపడుతామని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా బేటీ బచావో, బేటీ పడావో, ఆయుష్మాన్ భారత్ పటిష్ట అమలుకు చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. నియోజకవర్గ పరిధిలోని గ్రామాలకు రక్షిత మంచి నీరు అందిస్తామని బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో వెల్లడించారు. నియోజకవర్గ పరిధిలోని గ్రామాలకు రక్షిత మంచి నీరు అందిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.

వాస్తావానికి బీజేపీ హుజురాబాద్ మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలన్నీ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించనవి. ఈ పనులన్నీ అమలు చేయాలంటే కేంద్రప్రభుత్వం సంకల్పిస్తే సాధ్యమవుతుంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి తాము తప్పకుండా అమలు చేస్తామని ఆ పార్టీ నేతలు హామీ పడుతున్నారు. మేనిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కాషాయ పార్టీ నిర్ణయం తీసుకుంది.

హుజురాబాద్‌లో ప్రచారం చివరి దశకు చేరుకుంది. 30వ తేదీన పోలింగ్ జరగనుంది. తొలి సారిగా 72 గంటల ముందే ప్రచారాన్ని ముగించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. రేపు అన్ని పార్టీల మైక్‌లు మూగబోనున్నాయి. రేపే చివరి రోజు కావడంతో మరే పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం లేదు. ముందుగానే జాగ్రత్త పడిన బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసి ఓటర్లను ఆకట్టుకునేందుకు వ్యూహం పన్నింది.

This post was last modified on October 26, 2021 10:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

2 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

2 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

5 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

7 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

7 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

7 hours ago