రాజకీయ నాయకులు ఏం మాట్లాడినా దాని వెనక ఓ పరమార్థం ఉంటుందని అంటారు. తమ రాజకీయ ప్రయోజనాల కోణంలోనే ప్రతి విషయాన్ని పరిగణలోకి తీసుకుని అందుకు అనుగుణంగానే మాట్లాడుతారు. అందుకే ఏవరైనా నాయకుడు ఏదైనా మాట్లాడితే దాని వెనక ఇంకేం అర్థం ఉందో అనే వెతకాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఇక రాజకీయ చాణక్యుడిగా పేరు తెచ్చుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ అంతటి వ్యక్తి ఏవైనా వ్యాఖ్యలు చేశారంటే వాటి వెనక కచ్చితంగా వేరే అర్థాలు ఉంటాయనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పుడు టీఆర్ఎస్ ప్లీనరీలో ఆయన చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఆంధ్రప్రదేశ్లో టీఆర్ఎస్ పార్టీని పెట్టాలని తనపై వత్తిడి వస్తుందని ఏపీలో ఉన్న తన అభిమానులు అలా కోరుతున్నారని కేసీఆర్ వెల్లడించారు. దళిత బంధు పథకాన్ని తమ రాష్ట్రంలోనూ అమలు చేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారని అందుకే టీఆర్ఎస్ అక్కడ ఎన్నికల్లో బరిలో దిగితే గెలిపించుకుంటామని చెప్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడీ వ్యాఖ్యల వెనక నిజానిజాలపై జోరుగా చర్చగా సాగుతోంది. కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణమేంటని జనాలు ఆలోచిస్తున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీతో కేసీఆర్ సఖ్యతగానే ఉంటున్నారు. ఇటీవల జల వివాదం సంగతి పక్కనపెడితే అంతకు ముందు వరకూ బాగానే ఉన్నారు. జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి కేసీఆర్ హాజరయ్యారు. జగన్ను తన ఇంటికి ఆహ్వానించారు.
ఇక ఏపీలో గత ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావడానికి కేసీఆర్ పరోక్షంగా సాయం చేశారనే టీడీపీ నేతలు ఇప్పటికీ ఆరోపిస్తూనే ఉన్నారు. జగన్ మీద కేసీఆర్కు మంచి అభిప్రాయమే ఉంది. అదే బాబు అయితే తెలంగాణతో వేలు పెడతారని ఆయన మీద కేసీఆర్కు ఆగ్రహం ఉంది. అందుకే జగన్ను కేసీఆర్ ఎప్పుడూ బహిరంగంగా విమర్శించలేదు. జగన్ కూడా తెలంగాణలో తన దుకాణం మూసేశారు. ఈ నేపథ్యంలో తాజాగా కేసీఆర్ వ్యాఖ్యలను ఎలా చూడాలన్నది వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అయితే మరో వర్గం మాత్రం కేసీఆర్ దళిత బంధు పేరు చెప్పి దాన్ని జగన్ మెడకు చుట్టాలనే ఆలోచన చేశారని అభిప్రాయపడుతోంది. అలాంటిదేమీ లేదు ప్రస్తుతం జగన్ చుట్టూ ఉన్న సమస్యల నుంచి డైవర్ట్ చేసేందుకే కేసీఆర్ ఆ వ్యాఖ్యలు చేశారని మరో వర్గం చెబుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కేసీఆర్.. జగన్ను దూరం చేసుకుని బాబును మాత్రం దగ్గరికి తీసుకోరు. ఈ నేపథ్యంలో జగన్కు మేలు చేసే విధంగానే కేసీఆర్ వ్యవహరిస్తారనే టాక్ ఉంది.
This post was last modified on October 26, 2021 1:04 pm
తెలంగాణలో అధికార పార్టీగా కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీలో తరచూ అంతర్గత విభేదాలు రాజుకుంటున్నాయి. ఎనుముల రేవంత్ రెడ్డి సీఎంగా పదవీ ప్రమాణం…
ఒక హీరోతో చేయాల్సిన కథ ఇంకో హీరో చేతికి వెళ్లిపోవడం ఇండస్ట్రీలో కొత్తేమీ కాదు. ఐతే పెద్ద ఫ్యామిలీకి చెందిన…
మనం ఎంత పెద్ద ప్యాన్ ఇండియా సినిమా చేస్తున్నామన్నది ముఖ్యం కాదు. షూటింగ్ జరుగుతున్న సమయంలోనూ జనం నిత్యం మాట్లాడుకునేలా,…
వైసీపీ అధినేత జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకా నందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి ఆయన కుమార్తె, డాక్టర్ నర్రెడ్డి…
కెరీర్ లో పైకి వస్తున్న టైంలో యూత్ హీరోలు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. తమ పాత్రల గురించి రకరకాల లెక్కలు…
పాలమ్మీ, పూలమ్మీ ఎదిగానంటూ తనదైన శైలి వ్యాఖ్యలతో అందరినీ ఆకట్టుకున్న తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి…