Political News

ప్రపంచం కాపాడలేదా- అక్కడ ఆకలితో పిల్లలు చనిపోతున్నారా ?

తాలిబన్ల అధికారంలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్ లో ఆకలి చావులు పెరిగిపోతున్నాయా ? వరల్డ్ ఫుడ్ కౌన్సిల్ తాజా నివేదిక ప్రకారం అవుననే అర్ధమవుతోంది. దేశంలోని 3.9 కోట్ల మంది జనాభాలో సుమారు 2.3 కోట్లమంది రోజుకు ఒక పూట కూడా భోజనం చేయలేకపోతున్నారు. వీరిలో అత్యధికులు పేదలు, వారి పిల్లలే ఉన్నట్లు సమాచారం. మూడు వారాల క్రితం పశ్చిమ కాబూల్ లోని ఓ ఇంట్లో రోజుల వ్యవధిలో 8 మంది పిల్లలు ఆకలిని తట్టుకోలేక చనిపోయిన విషయం బయటపడింది.

8 మంది పిల్లలు ఆకలితో చనిపోయిన ఘటన ప్రపంచాన్ని కుదిపేస్తోంది. స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం 8 మంది పిల్లలు ఆకలితో చనిపోయిన విషయం వెలుగు చూసింది. మరి వెలుగు చూడని ఘటనలు ఎన్ని ఉన్నాయో అని ఐక్య రాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకున్నాక విదేశాల నుంచి ఆహార పదార్థాలు, నిత్యావసరాల దిగుమతులు ఆగిపోయాయి. ఇదే సమయంలో దేశం నుంచి ఎగుమతులు కూడా తగ్గిపోయాయి. గమనించాల్సిందేమంటే దేశంలోకి దిగుమతులే ఎగుమతులు దాదాపు ఉండవనే చెప్పాలి.

తాలిబన్లను ప్రపంచం గుర్తించని కారణంగా చాలా దేశాలు తమ వ్యాపారాలు నిలిపేశాయి. దీంతో దేశంలోకి ఆహార పదార్థాల దిగుమతులు ఆగిపోవటంతో కొరత పెరిగిపోయింది. దీని ప్రభావం ఎక్కువగా ఎగువ మధ్య తరగతి, మధ్య తరగతి, పేదల మీద పడింది. ఆహారం కోసం అవకాశం ఉన్నవారు తమ ఆస్తులను అమ్మేసుకుంటున్నారు. అలాగే ఇంట్లోని రిఫ్రిజిరేటర్లు, టీవీలు, సోఫాలు, మంచాల్లాంటి విలువైన ఫర్నీచర్ ను కూడా అమ్మేసుకుంటున్నారు.

కంటి ముందు ఆహారం, పండ్లు కనబడుతున్నా చాలామంది కొనలేకపోతున్నారు. కారణం ఏమిటంటే కొనే స్తోమత లేకపోవటమే. కిలో బంగాళదుంప దాదాపు వెయ్యి రూపాయలట. ఒక బ్రెడ్డు ధర 400 రూపాయలట. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పోయిన నేపథ్యంలో చాలా మందికి సంపాదన నిలిచిపోయింది. దీంతో ఆహారాన్ని కొనలేకపోతున్నారు. ఫలితంగా ఆకలి చావులు పెరిగిపోతున్నాయి. మధ్య తరగతి కుటుంబాలే రోజుకు మూడు పూట్లా భోజనం చేసి రోజులవుతున్న నేపథ్యంలో ఇక పేదల పరిస్థితి ఆలోచించాల్సిన అవసరమే లేదు.

నూనెలు, గోధుమలు, బియ్యం లాంటి నిత్యావసరాల ధరలు 55 శాతం పెరిగాయట. తాలిబన్లు అధికారాన్ని కబ్జా చేయడానికి ముందు కూడా దేశంలో సుమారు 1.4 కోట్ల మంది ఆహార సంక్షోభంలోనే ఉన్నారని ప్రపంచ ఆహార కార్యక్రమం ప్రకటించింది. ఇపుడీ సంఖ్య 2.3 కోట్లకు పెరిగిందని ఆందోళన వ్యక్తం చేసింది. ముందు ముందు ఈ సంఖ్య గనుక మరింత పెరిగితే అది చాలా ప్రమాదమని కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఆహార సంక్షోభాన్ని అధిగమించేందుకు దేశంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఐక్య రాజ్య సమితికి అర్థం కావట్లేదు. బహుశా తాలిబన్లు అధికారంలో ఉన్నంత కాలం పరిస్థితి ఇలాగే ఉంటాయోమో అనిపిస్తోంది.

This post was last modified on October 26, 2021 12:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇరాన్ పై యుద్ధం… ట్రంప్ కొంప ముంచుతుందా?

ఇరాన్‌తో యుద్ధం విష‌యంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా?  నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…

2 hours ago

‘కల్కి’పై విమర్శలకు కట్టుబడి ఉన్న లిరిసిస్ట్

ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…

2 hours ago

ఎన్నిక‌ల క‌మిష‌నర్‌ను తొలగించడానికి తీర్మానమా?

దేశంలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప‌లు కీల‌క అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్ర‌ధాని పైనే గ‌త ఐదేళ్ల‌లో…

5 hours ago

చంద్రబాబు 3సీ ఫార్ములా… ఇది కలెక్టర్ల కోసమే

ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…

6 hours ago

థియేటర్ అనుభూతికి ‘సబ్ టైటిల్స్’ దెబ్బ

మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…

7 hours ago

సెలబ్రెటీ పెళ్లిళ్లు.. హడావుడి తగ్గించాలా?

పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…

7 hours ago