Political News

ప్రపంచం కాపాడలేదా- అక్కడ ఆకలితో పిల్లలు చనిపోతున్నారా ?

తాలిబన్ల అధికారంలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్ లో ఆకలి చావులు పెరిగిపోతున్నాయా ? వరల్డ్ ఫుడ్ కౌన్సిల్ తాజా నివేదిక ప్రకారం అవుననే అర్ధమవుతోంది. దేశంలోని 3.9 కోట్ల మంది జనాభాలో సుమారు 2.3 కోట్లమంది రోజుకు ఒక పూట కూడా భోజనం చేయలేకపోతున్నారు. వీరిలో అత్యధికులు పేదలు, వారి పిల్లలే ఉన్నట్లు సమాచారం. మూడు వారాల క్రితం పశ్చిమ కాబూల్ లోని ఓ ఇంట్లో రోజుల వ్యవధిలో 8 మంది పిల్లలు ఆకలిని తట్టుకోలేక చనిపోయిన విషయం బయటపడింది.

8 మంది పిల్లలు ఆకలితో చనిపోయిన ఘటన ప్రపంచాన్ని కుదిపేస్తోంది. స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం 8 మంది పిల్లలు ఆకలితో చనిపోయిన విషయం వెలుగు చూసింది. మరి వెలుగు చూడని ఘటనలు ఎన్ని ఉన్నాయో అని ఐక్య రాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకున్నాక విదేశాల నుంచి ఆహార పదార్థాలు, నిత్యావసరాల దిగుమతులు ఆగిపోయాయి. ఇదే సమయంలో దేశం నుంచి ఎగుమతులు కూడా తగ్గిపోయాయి. గమనించాల్సిందేమంటే దేశంలోకి దిగుమతులే ఎగుమతులు దాదాపు ఉండవనే చెప్పాలి.

తాలిబన్లను ప్రపంచం గుర్తించని కారణంగా చాలా దేశాలు తమ వ్యాపారాలు నిలిపేశాయి. దీంతో దేశంలోకి ఆహార పదార్థాల దిగుమతులు ఆగిపోవటంతో కొరత పెరిగిపోయింది. దీని ప్రభావం ఎక్కువగా ఎగువ మధ్య తరగతి, మధ్య తరగతి, పేదల మీద పడింది. ఆహారం కోసం అవకాశం ఉన్నవారు తమ ఆస్తులను అమ్మేసుకుంటున్నారు. అలాగే ఇంట్లోని రిఫ్రిజిరేటర్లు, టీవీలు, సోఫాలు, మంచాల్లాంటి విలువైన ఫర్నీచర్ ను కూడా అమ్మేసుకుంటున్నారు.

కంటి ముందు ఆహారం, పండ్లు కనబడుతున్నా చాలామంది కొనలేకపోతున్నారు. కారణం ఏమిటంటే కొనే స్తోమత లేకపోవటమే. కిలో బంగాళదుంప దాదాపు వెయ్యి రూపాయలట. ఒక బ్రెడ్డు ధర 400 రూపాయలట. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పోయిన నేపథ్యంలో చాలా మందికి సంపాదన నిలిచిపోయింది. దీంతో ఆహారాన్ని కొనలేకపోతున్నారు. ఫలితంగా ఆకలి చావులు పెరిగిపోతున్నాయి. మధ్య తరగతి కుటుంబాలే రోజుకు మూడు పూట్లా భోజనం చేసి రోజులవుతున్న నేపథ్యంలో ఇక పేదల పరిస్థితి ఆలోచించాల్సిన అవసరమే లేదు.

నూనెలు, గోధుమలు, బియ్యం లాంటి నిత్యావసరాల ధరలు 55 శాతం పెరిగాయట. తాలిబన్లు అధికారాన్ని కబ్జా చేయడానికి ముందు కూడా దేశంలో సుమారు 1.4 కోట్ల మంది ఆహార సంక్షోభంలోనే ఉన్నారని ప్రపంచ ఆహార కార్యక్రమం ప్రకటించింది. ఇపుడీ సంఖ్య 2.3 కోట్లకు పెరిగిందని ఆందోళన వ్యక్తం చేసింది. ముందు ముందు ఈ సంఖ్య గనుక మరింత పెరిగితే అది చాలా ప్రమాదమని కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఆహార సంక్షోభాన్ని అధిగమించేందుకు దేశంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఐక్య రాజ్య సమితికి అర్థం కావట్లేదు. బహుశా తాలిబన్లు అధికారంలో ఉన్నంత కాలం పరిస్థితి ఇలాగే ఉంటాయోమో అనిపిస్తోంది.

This post was last modified on October 26, 2021 12:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

2 hours ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

3 hours ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

4 hours ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

4 hours ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

4 hours ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

4 hours ago