తాలిబన్ల అధికారంలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్ లో ఆకలి చావులు పెరిగిపోతున్నాయా ? వరల్డ్ ఫుడ్ కౌన్సిల్ తాజా నివేదిక ప్రకారం అవుననే అర్ధమవుతోంది. దేశంలోని 3.9 కోట్ల మంది జనాభాలో సుమారు 2.3 కోట్లమంది రోజుకు ఒక పూట కూడా భోజనం చేయలేకపోతున్నారు. వీరిలో అత్యధికులు పేదలు, వారి పిల్లలే ఉన్నట్లు సమాచారం. మూడు వారాల క్రితం పశ్చిమ కాబూల్ లోని ఓ ఇంట్లో రోజుల వ్యవధిలో 8 మంది పిల్లలు ఆకలిని తట్టుకోలేక చనిపోయిన విషయం బయటపడింది.
8 మంది పిల్లలు ఆకలితో చనిపోయిన ఘటన ప్రపంచాన్ని కుదిపేస్తోంది. స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం 8 మంది పిల్లలు ఆకలితో చనిపోయిన విషయం వెలుగు చూసింది. మరి వెలుగు చూడని ఘటనలు ఎన్ని ఉన్నాయో అని ఐక్య రాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకున్నాక విదేశాల నుంచి ఆహార పదార్థాలు, నిత్యావసరాల దిగుమతులు ఆగిపోయాయి. ఇదే సమయంలో దేశం నుంచి ఎగుమతులు కూడా తగ్గిపోయాయి. గమనించాల్సిందేమంటే దేశంలోకి దిగుమతులే ఎగుమతులు దాదాపు ఉండవనే చెప్పాలి.
తాలిబన్లను ప్రపంచం గుర్తించని కారణంగా చాలా దేశాలు తమ వ్యాపారాలు నిలిపేశాయి. దీంతో దేశంలోకి ఆహార పదార్థాల దిగుమతులు ఆగిపోవటంతో కొరత పెరిగిపోయింది. దీని ప్రభావం ఎక్కువగా ఎగువ మధ్య తరగతి, మధ్య తరగతి, పేదల మీద పడింది. ఆహారం కోసం అవకాశం ఉన్నవారు తమ ఆస్తులను అమ్మేసుకుంటున్నారు. అలాగే ఇంట్లోని రిఫ్రిజిరేటర్లు, టీవీలు, సోఫాలు, మంచాల్లాంటి విలువైన ఫర్నీచర్ ను కూడా అమ్మేసుకుంటున్నారు.
కంటి ముందు ఆహారం, పండ్లు కనబడుతున్నా చాలామంది కొనలేకపోతున్నారు. కారణం ఏమిటంటే కొనే స్తోమత లేకపోవటమే. కిలో బంగాళదుంప దాదాపు వెయ్యి రూపాయలట. ఒక బ్రెడ్డు ధర 400 రూపాయలట. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పోయిన నేపథ్యంలో చాలా మందికి సంపాదన నిలిచిపోయింది. దీంతో ఆహారాన్ని కొనలేకపోతున్నారు. ఫలితంగా ఆకలి చావులు పెరిగిపోతున్నాయి. మధ్య తరగతి కుటుంబాలే రోజుకు మూడు పూట్లా భోజనం చేసి రోజులవుతున్న నేపథ్యంలో ఇక పేదల పరిస్థితి ఆలోచించాల్సిన అవసరమే లేదు.
నూనెలు, గోధుమలు, బియ్యం లాంటి నిత్యావసరాల ధరలు 55 శాతం పెరిగాయట. తాలిబన్లు అధికారాన్ని కబ్జా చేయడానికి ముందు కూడా దేశంలో సుమారు 1.4 కోట్ల మంది ఆహార సంక్షోభంలోనే ఉన్నారని ప్రపంచ ఆహార కార్యక్రమం ప్రకటించింది. ఇపుడీ సంఖ్య 2.3 కోట్లకు పెరిగిందని ఆందోళన వ్యక్తం చేసింది. ముందు ముందు ఈ సంఖ్య గనుక మరింత పెరిగితే అది చాలా ప్రమాదమని కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఆహార సంక్షోభాన్ని అధిగమించేందుకు దేశంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఐక్య రాజ్య సమితికి అర్థం కావట్లేదు. బహుశా తాలిబన్లు అధికారంలో ఉన్నంత కాలం పరిస్థితి ఇలాగే ఉంటాయోమో అనిపిస్తోంది.
This post was last modified on October 26, 2021 12:03 pm
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…