Political News

ప్రపంచం కాపాడలేదా- అక్కడ ఆకలితో పిల్లలు చనిపోతున్నారా ?

తాలిబన్ల అధికారంలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్ లో ఆకలి చావులు పెరిగిపోతున్నాయా ? వరల్డ్ ఫుడ్ కౌన్సిల్ తాజా నివేదిక ప్రకారం అవుననే అర్ధమవుతోంది. దేశంలోని 3.9 కోట్ల మంది జనాభాలో సుమారు 2.3 కోట్లమంది రోజుకు ఒక పూట కూడా భోజనం చేయలేకపోతున్నారు. వీరిలో అత్యధికులు పేదలు, వారి పిల్లలే ఉన్నట్లు సమాచారం. మూడు వారాల క్రితం పశ్చిమ కాబూల్ లోని ఓ ఇంట్లో రోజుల వ్యవధిలో 8 మంది పిల్లలు ఆకలిని తట్టుకోలేక చనిపోయిన విషయం బయటపడింది.

8 మంది పిల్లలు ఆకలితో చనిపోయిన ఘటన ప్రపంచాన్ని కుదిపేస్తోంది. స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం 8 మంది పిల్లలు ఆకలితో చనిపోయిన విషయం వెలుగు చూసింది. మరి వెలుగు చూడని ఘటనలు ఎన్ని ఉన్నాయో అని ఐక్య రాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకున్నాక విదేశాల నుంచి ఆహార పదార్థాలు, నిత్యావసరాల దిగుమతులు ఆగిపోయాయి. ఇదే సమయంలో దేశం నుంచి ఎగుమతులు కూడా తగ్గిపోయాయి. గమనించాల్సిందేమంటే దేశంలోకి దిగుమతులే ఎగుమతులు దాదాపు ఉండవనే చెప్పాలి.

తాలిబన్లను ప్రపంచం గుర్తించని కారణంగా చాలా దేశాలు తమ వ్యాపారాలు నిలిపేశాయి. దీంతో దేశంలోకి ఆహార పదార్థాల దిగుమతులు ఆగిపోవటంతో కొరత పెరిగిపోయింది. దీని ప్రభావం ఎక్కువగా ఎగువ మధ్య తరగతి, మధ్య తరగతి, పేదల మీద పడింది. ఆహారం కోసం అవకాశం ఉన్నవారు తమ ఆస్తులను అమ్మేసుకుంటున్నారు. అలాగే ఇంట్లోని రిఫ్రిజిరేటర్లు, టీవీలు, సోఫాలు, మంచాల్లాంటి విలువైన ఫర్నీచర్ ను కూడా అమ్మేసుకుంటున్నారు.

కంటి ముందు ఆహారం, పండ్లు కనబడుతున్నా చాలామంది కొనలేకపోతున్నారు. కారణం ఏమిటంటే కొనే స్తోమత లేకపోవటమే. కిలో బంగాళదుంప దాదాపు వెయ్యి రూపాయలట. ఒక బ్రెడ్డు ధర 400 రూపాయలట. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పోయిన నేపథ్యంలో చాలా మందికి సంపాదన నిలిచిపోయింది. దీంతో ఆహారాన్ని కొనలేకపోతున్నారు. ఫలితంగా ఆకలి చావులు పెరిగిపోతున్నాయి. మధ్య తరగతి కుటుంబాలే రోజుకు మూడు పూట్లా భోజనం చేసి రోజులవుతున్న నేపథ్యంలో ఇక పేదల పరిస్థితి ఆలోచించాల్సిన అవసరమే లేదు.

నూనెలు, గోధుమలు, బియ్యం లాంటి నిత్యావసరాల ధరలు 55 శాతం పెరిగాయట. తాలిబన్లు అధికారాన్ని కబ్జా చేయడానికి ముందు కూడా దేశంలో సుమారు 1.4 కోట్ల మంది ఆహార సంక్షోభంలోనే ఉన్నారని ప్రపంచ ఆహార కార్యక్రమం ప్రకటించింది. ఇపుడీ సంఖ్య 2.3 కోట్లకు పెరిగిందని ఆందోళన వ్యక్తం చేసింది. ముందు ముందు ఈ సంఖ్య గనుక మరింత పెరిగితే అది చాలా ప్రమాదమని కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఆహార సంక్షోభాన్ని అధిగమించేందుకు దేశంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఐక్య రాజ్య సమితికి అర్థం కావట్లేదు. బహుశా తాలిబన్లు అధికారంలో ఉన్నంత కాలం పరిస్థితి ఇలాగే ఉంటాయోమో అనిపిస్తోంది.

This post was last modified on October 26, 2021 12:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 minutes ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

32 minutes ago

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

2 hours ago

ఈ తరంలో చిరుకు నచ్చిన యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…

5 hours ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

10 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

13 hours ago