Political News

వైసీపీ నేతల నుంచి రంగుల ఖర్చు రాబట్టాలి: చంద్రబాబు

ప్రభుత్వ భవనాలకు రంగుల తొలగింపు వ్యవహారంలో ఏపీ సర్కార్ కు సుప్రీం కోర్టులో చుక్కెదురైన సంగతి తెలిసిందే. నాలుగు వారాల్లోపు ప్రభుత్వ భవనాలకు రంగులు తొలగించాలని, లేదంటే కోర్టు ధిక్కరణ కింద పరిగణిస్తామని దేశపు అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ తీర్పుపై ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రభుత్వ కార్యాలయాలకు, ఆస్తులకు వైసీపీ జెండా రంగులు వేయడం సరికాదని, ఈ విషయంలో ప్రభుత్వానికి సుప్రీం కోర్టు మొట్టికాయలు వేయడం సిగ్గుచేటని చంద్రబాబు విమర్శించారు. హైకోర్టు చెప్పిన తర్వాత కూడా సుప్రీం కోర్టుకు ప్రభుత్వం వెళ్లిందని, రాజ్యాంగం అన్నా, కోర్టులన్నా వైసీపీ పాలకులకు ఏ మాత్రం గౌరవం లేదని చంద్రబాబు విమర్శించారు. కొట్టేస్తారని తెలిసి కూడా కొత్త జీవోలు జారీ చేస్తున్నారని దుయ్యబట్టారు. హైకోర్టు , సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించకుండా…కోర్టు ధిక్కరణ ఎదుర్కొనే పరిస్థితిని కొని తెచ్చుకుంటున్నారని విమర్శించారు. హైకోర్టు ఆదేశాలను ధిక్కరించిన వైసీపీ నేతల నుంచే రంగుల ఖర్చును రాబట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

కాగా, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ జెండా రంగులు వేసిన వ్యవహారంపై సుప్రీంకోర్టులోనూ ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. రంగులు తొలగించాల్సిందేనని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు దానిని కొట్టివేసింది. ప్రభుత్వ భవనాలు, కార్యాలయాలకు వేసిన రంగులను నాలుగు వారాల్లో తొలగించాలని జగన్ సర్కార్‌ను ఆదేశించింది. 4 వారాల్లోగా ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు తొలగించకపోతే కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు హెచ్చరించింది. ఓ వైపు ఏపీ మాజీ ఎస్ ఈసీ నిమ్మగడ్డ వ్యవహారంలోనూ ఏపీ హైకోర్టులో జగన్ సర్కార్ కు చుక్కెదురైన సంగతి తెలిసిందే.

This post was last modified on June 3, 2020 9:20 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

1 minute ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

1 hour ago

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

2 hours ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

3 hours ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

3 hours ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

3 hours ago