Political News

డ్రాగన్ సైన్యంపై త్రిశూలం

చైనా-భారత్ సరిహద్దుల్లో డ్రాగన్ సైన్యం చేస్తున్న కంపు అంతా ఇంతా కాదు. ప్రతిరోజు ఏదో కారణంగా మన భూభాగంలోకి చొచ్చుకు రావడం మన సైన్యం తో గొడవ పడటం మామూలైపోయింది. కొన్నిసార్లు ఈ గొడవలు శృతిమించి ముష్టిఘాతాలు, ముళ్ళ కర్రలతో కొట్టుకోవడం వరకు వెళిపోతోంది. ఆమధ్య గాల్వాన్ లోయలో జరిగిన ఇలాంటి ఘటనలోనే రెండువైపుల సైనికులు చనిపోయిన విషయం మనదేశంలో సంచలనంగా మారింది.

గాల్వాన్ లోయలోకి చైనా సైనికులు కావాలనే మన భూభాగంలోకి చొచ్చుకుని వచ్చి మన సైన్యం తో గొడవలు పెట్టుకున్నారు. మన సైన్యం ఊహించని విధంగా ముళ్ళ కర్రలతో మన వాళ్ళపై డ్రాగన్ సైన్యం విరుచుకుపడింది. ముందు షాక్ కు గురైనా వెంటనే మన వాళ్ళు తేరుకుని ఎదురు దాడులు చేశారు. ఆ సమయంలో రెండువైపులా జరిగిన గొడవలో మన సైనికులు సుమారు 20 మంది చనిపోయారు. అలాగే చైనా సైనికులు కూడా 45 మంది చనిపోయినట్లు ప్రచారం జరిగింది.

సో, అప్పుడు జరిగిన గొడవలు తదనంతర పరిణామాలను దృష్టిలో పెట్టుకునే మన రక్షణరంగ శాస్త్రవేత్తలు శత్రువులపై ప్రయోగించేందుకు వీలుగా సరికొత్త తేలికరకమైన ఆయుధాలను తయారు చేశారు. మొత్తం ఐదు రకాల ఆయుధాలను సరిహద్దుల్లో కాపలా కాసే సైన్యానికి అందించారు. వీటిలో త్రిశూల్, వజ్ర, శాపర్ పంచ్, దండ్, భద్ర ఉన్నాయి. వీటిలో త్రిశూల్ తో పాటు మిగిలిన నాలుగు కూడా కరెంటుతో పనిచేస్తాయి.

శతృవులను వీటిని తాకించగానే కరెంటు షాక్ కొడుతుంది. దాంతో శతృవులు ఒక్కసారిగా షాక్ కు గురై కొద్దిసేపు స్పృహతప్పి పడిపోతారు. కొత్తగా తయారు చేసిన ఆయుధాల్లో దండ్ అనే గ్లోవ్ లాంటిది కూడా ఉంది. ఈ గ్లోవ్ తో ప్రత్యర్ధులను ఒక్కటిచ్చుకుంటే కరెంటు షాకుతో పడిపోతారు. మళ్ళీ వాళ్ళకు స్పృహ వచ్చేలోగా మన సైన్యం తమ పని కానిచ్చేసుకోవచ్చు. అలాగే భద్ర అనే కవచాన్ని కూడా తయారుచేశారు. ఇది శత్రువులపై కరెంటు కాంతిని ప్రసరిస్తుంది. దీంతో శతృవుల కళ్ళు కొద్దిసేపు కనబడటం మానేస్తాయి.

పై ఆయుధాలన్నీ కూడా కేవలం బ్యాటరీ సాయంతో పనిచేస్తాయి. ఒకసారి బ్యాటరీని ఫుల్ గా చార్జ్ చేస్తే 8 గంటలు పని చేస్తాయి. సరిహద్దుల్లోని మైనస్ డిగ్రీల చలిలో కాపలా కాస్తున్న సైన్యానికి బ్యాటరీతో పనిచేసే ఆయుధాలు చాలా ఉపయోగంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాకపోతే రోజుల తరబడి సరిహద్దుల్లో కాపలాకాసే సైన్యానికి నిరంతరంగా బ్యాటరీ చార్జింగ్ చేసే అవకాశాలుండాలి. అంతా బాగానే ఉంది కానీ మన దగ్గర ఎలాంటి ఆయుధాలున్నాయో శతృవులకు తెలిసిపోయినపుడు దానికి తగ్గట్లుగా వాళ్ళు కూడా రెడీ అవ్వరా ? అన్నదే అసలైన సందేహం.

This post was last modified on October 20, 2021 11:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సాయిపల్లవి బరిలో ఉంటే అవార్డ్ ఇవ్వాల్సిందే

హీరోల కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. హీరోయిన్ల గ్లామర్ కోసం కూడా కొంతమంది సినిమాలకు వస్తారు. కానీ…

34 minutes ago

‘పవన్ హఠావో’ రచయిత మృతి కేసు మిస్టరీ వీడింది

“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…

58 minutes ago

విన్యాసం మీదే బాక్సాఫీస్ ఆశలు

గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…

59 minutes ago

ఇటు వివాదం… అటు ముహూర్తం

జై హనుమాన్.. ఈ సినిమా కోసం రెండేళ్ల కిందట్నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి…

1 hour ago

కమల్ హీరో… రజినీ విలన్?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్‌ల కలయికలో 46 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడం వాళ్లిద్దరి అభిమానులనే…

2 hours ago

ప్రేమ పెళ్ళి.. తల్లిదండ్రులకు సమాచారం తప్పనిసరి

వివాహ నమోదు నిబంధనల్లో మార్పులు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. పెళ్లి నమోదు చేసుకునే జంటలు…

3 hours ago