Political News

స‌ర్వే ఫ‌లితం.. ఊహించిందేనా? వైసీపీలో గుస‌గుస‌!

ఇండో ఏషియ‌న్ న్యూస్ స‌ర్వీస్‌(ఐఏఎన్ ఎస్‌) సీ-ఓట‌ర్ స‌ర్వే తాజాగా వెలువ‌రించిన నివేదిక‌పై వైసీపీలో చ‌ర్చ జోరుగా సాగుతోంది. నిజానికి ఈ ఫ‌లితాన్ని కొన్నాళ్లుగా అంద‌రూ ఊహించిందే కావ‌డం గ‌మ‌నార్హం. ఎందుకంటే.. రాష్ట్రంలో ఎమ్మెల్యేల ప‌నితీరు స‌రిగాలేద‌ని..వారు ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండ‌డం లేద‌ని వాద‌న వినిపిస్తోంది. అయితే.. త‌మ‌కు అస‌లు చేసేందుకు ఏమీ లేద‌ని..ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలోనే తాజాగా సీ ఓట‌రు స‌ర్వే ఫ‌లితాలు రావ‌డం.. వైసీపీలో చ‌ర్చ‌కు దారితీసింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఎమ్మెల్యేల‌పై ప్ర‌జ‌లు ఎక్కువ ఆగ్ర‌హంతో ఉన్న రాష్ట్రం ఏపీనేన‌ని.. స‌ర్వే స్ప‌ష్టం చేసింది.

నిజానికి ఏపీలో ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. ప్ర‌జ‌లకు-ఎమ్మెల్యేల‌కు మ‌ధ్య ఉండాల్సిన సున్నిత బంధం క‌నిపించడం లేద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఒక‌ప్పుడు ప్ర‌జ‌లు త‌మ‌కు ఏదైనా ప‌నికావాలంటే.. నేరుగా ఎమ్మెల్యే ఇంటివి వ‌చ్చేవారు. త‌మ‌స‌మ‌స్య‌లు చెప్పుకొనేవారు. అదేస‌మ‌యంలో ఎమ్మెల్యే కూడా.. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండేవారు. ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల ఓట్ల కోసం పాకులాడేవారు. అయితే.. రాను రాను .. పార్టీ అదినేత‌ను చూసి ఓట్లు అడిగే ప‌రిస్థితి రావ‌డం ప్రారంభ‌మైంది. 2019 ఎన్నిక‌ల‌ను తీసుకుంటే.. అటు వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ఇటు టీడీపీ అధినేత‌, అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు కూడా త‌మ‌ను చూసి ఓట్లేయాలంటూ.. ప్ర‌జ‌ల‌ను అభ్య‌ర్థించిన ప‌రిస్థితి క‌నిపించింది.

దీంతో అప్ప‌టి నుంచే.. ప్ర‌జ‌ల‌కు ఎమ్మెల్యేల‌కు మ‌ధ్య ఉండాల్సిన క‌నీస బంధం కాల‌గ‌ర్భంలో క‌లిసిపోతోంద‌నే వాద‌న వినిపించ‌డం ప్రారంభ‌మైంది. ఇక‌, రాష్ట్రంలో వ‌చ్చిన వ‌లంటీర్ వ్య‌వ‌స్థ వ‌చ్చిన త‌ర్వాత‌.. ఎమ్మెల్యేల‌తో దాదాపు ప్ర‌జ‌ల‌కు సంబంధాలు క‌ట్ అయ్యాయి. ఏం కావాల‌న్నా.. వ‌లంటీర్‌కు పోన్ చేయ‌డం.. ప‌రిపాటిగా మారింది. అదేస‌మ‌యంలో ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌కు ల‌బ్ధి దారుల ఎంపిక కూడా వ‌లంటీర్ల చేతుల మీదుగానే సాగుతోంది. ఈ క్ర‌మంలో ఎమ్మెల్యే ప్ర‌మేయం ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. దీంతో స‌హ‌జంగానే ఎమ్మెల్యేకు.. ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య సంబంధాలు క‌నిపించ‌డం లేద‌నే వాద‌న కొన్నాళ్లుగా క‌నిపిస్తోంది.

ఇక‌, ఇదే అవ‌కాశం అనుకున్నారో.. లేక మ‌రేమో.. తెలియ‌దు కానీ.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. సొంత ప‌నుల్లో పూర్తిగా మునిగిపోయారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్నా.. ప్ర‌జ‌ల‌కు అందుబాటులో లేక పోవ‌డం.. కొంద‌రి వంతుగా ఉంటే.. అస‌లు నియోజ‌క‌వ‌ర్గంలోనే లేని ఎమ్మెల్యేలు..కూడా ప‌దుల సంఖ్య‌లో క‌నిపిస్తోంది. త‌మ వ్యాపారాలు, వ్య‌వ‌హారాల కోసం.. ఎమ్మెల్యేలు.. పొరుగు రాష్ట్రాల్లో తిష్ట వేసిన ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. దీంతో నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి అనే మాటే ఎత్త‌నివారు క‌నిపిస్తున్నారు. ఇవే విష‌యాల‌పై కొన్నాళ్లు గా సోష‌ల్ మీడియాలోనూ విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ.. ఎమ్మెల్యేలు లైట్ తీసుకున్నారు. తాజాగా వ‌చ్చిన సీ ఓట‌ర్ సర్వే.. వారిలో ఇప్పుడు అల‌జ‌డి రేపుతోంది. మ‌రి ఇప్ప‌టికైనా.. త‌మ పంథా మార్చుకుని.. ప్ర‌జ‌ల్లోకి వ‌స్తారో.. లేదో చూడాలి.

This post was last modified on October 20, 2021 11:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అంబటి రాంబాబు కాపు టైగర్ – జగన్

అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్‌లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్‌సీపీ…

22 minutes ago

SRH: కమిన్స్ లేకుంటే కెప్టెన్ ఎవరు మరీ?

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కు ఇప్పుడు ఒక కొత్త టెన్షన్ మొదలైంది. ఆరెంజ్ ఆర్మీని గతేడాది ఫైనల్ వరకు తీసుకెళ్లిన ప్యాట్…

1 hour ago

నెల రోజుల గ్యాపులో బాబాయ్ అబ్బాయ్

రెండు పెద్ద సినిమాల విడుదల తేదీ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ముందు నుంచి ప్రచారం జరిగినట్టు పెద్ది వదిలేసుకున్న మార్చి…

3 hours ago

లెజెండ్ పోయాడు… లీడర్ వస్తున్నాడు

నాలుగేళ్ల క్రితం తమిళ హీరోగా మనకూ పరిచయమైన శరవణన్ 'ది లెజెండ్'తో డెబ్యూ చేసి తెరంగేట్రంతోనే ట్రోలింగ్ చవి చూడాల్సి…

3 hours ago

గేమ్ కోసం ఫోన్ ఇవ్వలేదని ముగ్గురు అక్కాచెల్లెళ్ళు…

​ఘజియాబాద్‌లోని భారత్ సిటీ సొసైటీలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు…

5 hours ago

అల్లరోడి ఆల్కహాల్ అడ్రస్ ఎక్కడ

అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి…

6 hours ago