Political News

నారా లోకేష్ స‌హా న‌లుగురిపై మ‌ర్డ‌ర్ కేస్‌.. ఏం జ‌రిగింది!

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ స‌హా.. న‌లుగురు కీల‌క నేత‌ల‌పై గుంటూరు జిల్లా పోలీసులు.. హ‌త్యాయ‌త్నం కింద కేసు న‌మోదు చేశారు. అంతేకాదు.. ఏ1గా నారాలోకేష్‌ను, ఏ2గా ఎమ్మెల్సీ ప‌రుచూరు అశోక్‌బాబును, ఏ3గా మాజీ మంత్రి ఆల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్‌ను, ఏ4గా ఎమ్మెల్యే అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్‌ను చేర్చారు. అంతేకాదు.. వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా న‌మోదు చేశారు. అదేంటి.. టీడీపీ కార్యాల‌యంపై వైసీపీ నేత‌లు దాడుల‌కు తెగ‌బ‌డితే.. తిరిగి టీడీపీ నేత‌ల‌పైనే కేసులు ఎందుకు న‌మోదు చేశార‌నే సందేహం స‌ర్వ‌త్రా వినిపిస్తుంది.

దీనిపై పోలీసులు చెబుతున్న‌దేంటంటే.. వైసీపీ నాయ‌కులు.. టీడీపీ ఆఫీస్‌పై దాడులు చేసిన మాట‌వాస్త‌వ మేన‌ని.. అయితే.. ఈ క్ర‌మంలో అక్క‌డ ఏం జ‌రిగింద‌నే విష‌యాల‌ను ప‌రిశీలించేందుకు సీఐ.. నాయ‌క్ అనే వ్య‌క్తి.. టీడీపీ ఆఫీస్‌లో ప‌ర్యవేక్ష‌ణ‌కు వ‌చ్చార‌ని.. అయితే.. ఆయ‌న‌ను టీడీపీ నాయ‌కులు.. నిర్బంధించి.. కొట్టి.. హ‌త్య చేసేందుకు ప్ర‌య‌త్నించార‌ని.. అంటున్నారు. ఈ క్ర‌మంలోనే నారా లోకేష్ స‌హా.. ఇత‌ర నేత‌ల‌పై కేసులు పెట్టారు. అయితే.. వాస్త‌వానికి ఆ స‌మ‌యంలో వ‌చ్చిన నాయ‌క్ అనే వ్య‌క్తి విష‌యం మీడియాలో వ‌చ్చింది. అయితే.. ఆయ‌న పోలీస్ అనే విష‌యం ఎవ‌రికీ తెలియ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఎందుకంటే.. అప్ప‌టికే తీవ్ర అల‌జ‌డితో ఉన్న టీడీపీ ఆఫీస్‌లోకి వ‌చ్చిన నాయ‌క్‌.. ఎవ‌రికీ ఏమీ చెప్ప‌కుండా .. త‌న ఐడెంటిటీని తెలుపకుండానే ఫొటోలు తీయ‌డం.. వీడియోలు తీయ‌డం చేశాడు. దీంతో స‌హ‌జంగానే టీడీపీ నేత‌ల‌కు అనుమానం వ‌చ్చి.. ఆయ‌నను ప‌ట్టుకుని మాజీ మంత్రి న‌క్కా ఆనంద‌బాబు త‌దిత‌రుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ క్ర‌మంలో నాయ‌క్‌ను త‌మ అదుపులో ఉంచుకున్న ఆనంద‌బాబు, అశోక్‌బాబు.. త‌దిత‌రులు.. గుంటూరు రూర‌ల్ పోలీసుల‌కు స‌మాచారం అందించి.. ఆయ‌న‌ను అప్ప‌గించారు. మ‌రి జ‌రిగింది.. ఇదైతే.. నాయ‌క్‌పై హ‌త్యా య‌త్నం జ‌రిగింద‌ని.. నారా లోకేష్ ప్ర‌య‌త్నించార‌ని.. పేర్కొంటూ.. కేసు న‌మోదు చేయడం వంటివి పోలీసుల ద్వంద్వ వైఖ‌రిని చెబుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఇది ఏ త‌ర‌హా వివాదానికి దారితీస్తుందో చూడాలి.

This post was last modified on October 20, 2021 3:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`పీపీపీ`కి కేంద్రం అండ‌… బాబుకు భ‌రోసా… !

ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…

12 minutes ago

మిథున్ రెడ్డి ఆస్తులు ఎలా పెరిగాయ్.. హాట్ టాపిక్..!

వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…

50 minutes ago

లేడీ డైరెక్టర్ వేసిన డేరింగ్ స్టెప్

టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…

4 hours ago

ఎవరెస్ట్ బరువు మోస్తున్న మారుతీ సాబ్

ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…

5 hours ago

రవితేజ వారి ‘మంచు’ పంచ్ చూశారా?

ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు…

5 hours ago

సినిమా వాయిదా… 60 కోట్ల రీఫండ్

అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…

5 hours ago