ఇప్పుడున్న పరిస్థితుల్లో.. ఒక ప్రాంతానికి చెందిన వారు మరో ప్రాంతంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. అనూహ్యంగా విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో.. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్లాలనుకునే వారు.. తప్పనిసరిగా పాసులు తీసుకొని మాత్రమే ప్రయాణం చేయాల్సి వస్తుంది.
ఇదిలా ఉంటే.. ఇటీవల కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అంతర్ రాష్ట్ర రవాణా విషయంలో ఎలాంటి పరిమితులు ఉండవని చెప్పారు. కానీ.. కొన్ని రాష్ట్రాలు తాము ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిని పాసులు లేకుండా అనుమతించమని స్పష్టం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ నుంచి వేర్వేరు రాష్ట్రాలకు వెళ్లే వారు ఎవరైనా సరే.. ఆ రాష్ట్రం నుంచే పాసులు తీసుకోవాలని.. తెలంగాణలో ఇక నుంచి ఎలాంటి పాసులు జారీ చేయమని స్పష్టం చేశారు. హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లాలంటే ఏపీ ప్రభుత్వానికి చెందిన స్పందన వెబ్ సైట్ ద్వారా పాసులు పొందాలని.. అదే సమయంలో తమిళనాడుకు వెళ్లాలంటే ఆ రాష్ట్రం నుంచి అనుమతి తీసుకోవాలన్నారు.
దీంతో.. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారు.. ఆ రాష్ట్ర వెబ్ సైట్ లో పాసుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తాజాగా వచ్చిన ఈ మార్పును గుర్తించకుంటే మాత్రం ప్రయాణంలో తిప్పలు తప్పవు.
This post was last modified on June 3, 2020 1:42 pm
ఏడేళ్ల క్రితం వచ్చిన పలాసతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్. తక్కువ ఖర్చులో స్టార్ క్యాస్టింగ్ లేకుండా…
అక్కినేని నాగార్జున హీరోనే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన అన్నపూర్ణ సంస్థలో…
కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…
ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…
దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…
సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ నివేదిక వెల్లడైన…