Political News

టీడీపీ ఆఫీసుల పై దాడులు, ఏపీలో కలకలం- జాతీయ మీడియాలో చర్చ

అమరావతిలోని కేంద్ర కార్యాలయంతో పాటు తెలుగుదేశం పార్టీ (టిడిపి) పలు జిల్లా కార్యాలయాలపై మంగళవారం సాయంత్రం దాడులు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్ఆర్‌సిపి కార్యకర్తలు ఈ విధ్వంసానికి పాల్పడ్డారని, ఇది స్టేట్ టెర్రరిజం అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు.

రాజధాని అమరావతి, మంగళగిరి, విజయవాడ మరియు విశాఖపట్నం సహా మొత్తం 13 జిల్లాల్లోని ప్రధాన టీడీపీ కార్యాలయాలు లక్ష్యంగా చేసుకుని ఏకకాలంలో దాడులు జరగడం గమనార్హం. ఇది ముఖ్యమంత్రి జగన్ అభిమానులు ఆగ్రహం తో చేసిన పని అని వైఎస్సార్ కాంగ్రెస్ అంగీకరించడం ఇక్కడ గమనించాల్సిన విషయం.

ఈ ఘటనకు రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం గురించి, ఏపీలో డ్రగ్స్ వ్యాపారాల గురించి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పెట్టిన మీడియా సమావేశం వల్లే అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కారణాలు పక్కన పెడితే… రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీపై ఆర్గనైజ్డ్ గా ఏకకాలంలో దాడులు జరగడంపై రాష్ట్రమంతటా విస్మయం వ్యక్తమవుతోంది.

జాతీయ మీడియా దీనిని పెద్ద ఎత్తున కవర్ చేయడంతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా ఈ ఘటన కలకలం రేపింది. పట్టపగలు దాడులు జరగడం ఏంటి అంటూ అందరూ విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఎక్కడా ఈ దాడులు జరిగినంత సేపు కూడా పోలీసులు అదుపు చేయకపోవడం మరింత చర్చనీయాంశం అవుతోంది. ఈ ఘటనలో తెలుగుదేశం పార్టీ ఆఫీసుల్లో ఆస్తులు ధ్వంసం అయ్యాయి.

ఈ ఘటనపై టిడిపి అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరియు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌లకు ఫిర్యాదు చేశారు. టిడిపి కార్యాలయాలు మరియు పార్టీ కార్యకర్తలకు కేంద్ర భద్రతా రక్షణ కల్పించాలని నాయుడు అమిత్ షాను అభ్యర్థించారు. “ఇవి ప్రణాళికబద్ధమైన రాజకీయ ప్రేరేపిత దాడులు‘‘ అని తెలుగుదేశం వ్యాఖ్యానించింది.

ఈ దాడులకు సంబంధించిన వీడియోలు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. #YCPTerroristsAttack హ్యాష్ టాగ్ తో ఇది జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతుండటం గమనార్హం.

This post was last modified on October 19, 2021 10:03 pm

Share
Show comments
Published by
satya
Tags: Feature

Recent Posts

జ‌గ‌న్‌లో ఓట‌మి భ‌యానికిది సంకేత‌మా?

ఆంధ్ర‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకో వార‌మే స‌మ‌యం ఉంది. ఈ ఎన్నిక‌లు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌కు, అటు ప్ర‌తిప‌క్ష…

5 hours ago

ఫ్యామిలీ మ్యాన్ ఫ్యాన్స్‌కు స్వీట్ న్యూస్

‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…

6 hours ago

ప‌థ‌కాల మాట ఎత్తొద్దు: జ‌గ‌న్‌కు ఈసీ షాక్‌!

ఏపీ ప్ర‌భుత్వానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జ‌గ‌న్ ప్ర‌బుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను ఎన్నిక‌ల…

10 hours ago

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

13 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

13 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

14 hours ago