Political News

ఆ టీడీపీ ఫ్యామిలీకి మూడు టిక్కెట్లా… ఒక్క‌టే ర‌చ్చ‌..!


క‌ర్నూలు జిల్లా టీడీపీలో టికెట్ల ర‌గ‌డ రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం కూడా చేరువ కాక‌పోయినా.. టికెట్ల కోసం.. నాయ‌కులు ఒక‌రి వెంట ఒక‌రు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అంతేకాదు.. మాకు రెండు కావాల‌ని ఒక‌రంటే.. మాకు మూడు కావాలంటూ.. చంద్ర‌బాబు వ‌ద్ద ఇండెంట్లు పెట్టేస్తున్నార‌ట‌. ఈ ప‌రిస్థితిని చూసి.. ఎవ‌రినీ నొప్పించ‌కుండా ఉండేందుకు .. చంద్ర‌బాబు త‌న‌దైన వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. అంటే.. ఎవ‌రికీ టికెట్లు కేటాయించ‌కుండా.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌క‌టిస్తామ‌నే సందేశాన్ని ఆయ‌న పంపేసిన‌ట్టు చెబుతున్నారు.

మ‌రీ ముఖ్యంగా దివంగ‌త భూమా నాగిరెడ్డి కుటుంబం .. గ‌త ఎన్నిక‌ల్లో రెండు స్థానాలు ద‌క్కించుకుంది. అయితే.. ఇప్పుడు ఏకంగా మూడు సీట్లు త‌మ‌కు ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌డుతున్న‌ట్టు టీడీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. మాజీ మంత్రి, నాగిరెడ్డి కుమార్తె.. అఖిల ప్రియ‌.. ఆళ్ల‌గ‌డ్డ‌.. నంద్యాలతోపాటు.. శ్రీశైలం టికెట్‌ను కూడా త‌మ ఖాతాలోకే ప‌డేలా చ‌క్రం తిప్పుతున్నార‌ని అంటున్నారు. గ‌తంలో ఆళ్ల‌గ‌డ్డ నుంచి గెలిచిన అఖిల ప్రియ‌.. అనూహ్య ప‌రిస్థితుల్లో మంత్రిగా ప‌ద‌విని చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో నంద్యాల నుంచి పోటీ చేసిన‌.. నాగిరెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంతో వ‌చ్చిన గ్యాప్‌తో ఈ కుటుంబానికే చెందిన భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు.

అయితే.. ఇప్పుడు.. నాగిరెడ్డి కుమారుడు జ‌గ‌త్‌విఖ్యాత్ రెడ్డి.. కూడా రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. వ‌చ్చే ఎన్నిక ల్లో పోటీకి రెడీ అవుతున్నారు. అయితే.. టికెట్ విష‌యంలో చ‌ర్చ‌గా మారింది. త‌న తండ్రి పోటీ చేసిన స్థానం క‌నుక‌.. నంద్యాల‌ను త‌న సొద‌రుడు జ‌గ‌త్‌కు ఇప్పించుకునేందుకు అఖిల ప్ర‌య‌త్నిస్తున్నారు. దీంతో భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి ప‌రిస్థితి ఏంట‌నేది ప్ర‌శ్న‌గా మారింది. దీంతో కొన్నాళ్లుగా ఈ విష‌యంలో స్త‌బ్ద‌త ఏర్ప‌డింది. అయితే.. ఇది కుటుంబంలో చిచ్చుగా మారి.. అఖిల ప్రియ రాజ‌కీయాల‌కు ఇబ్బందిగా ప‌రిణిస్తోంద‌నే సంకేతాలు వ‌చ్చాయి.

ఈ నేప‌థ్యంలో ఆమె శ్రీశైలం టికెట్‌ను బ్ర‌హ్మానంద‌రెడ్డికి ఇవ్వాల‌ని.. చంద్ర‌బాబుకు లేఖ రాసిన‌ట్టు.. ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే.. ఒక్క భూమా కుటుంబానికే ఇన్ని టికెట్లు మాకు కూడా కావాలంటూ.. కేఈ, కోట్ల కుటుంబాల నుంచి కూడా డిమాండ్లు పెరుగుతున్నాయ‌ట‌. మ‌రి చంద్ర‌బాబు ఈ విష‌యంలో ఎవ‌రినీ నొప్పించ‌కుండా.. చేసేందుకు టికెట్ల విష‌యాన్ని వాయిదా వేస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఏం జరుగుతుందో చూడాలి.

This post was last modified on October 18, 2021 8:18 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

10 minutes ago

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

2 hours ago

ఈ తరంలో చిరుకు నచ్చిన యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…

4 hours ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

10 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

12 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

12 hours ago