Political News

విద్యుత్ దుమారం.. టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ.. ఎవ‌రికి లాభం..?


ఏపీలో ఒక‌దాని త‌ర్వాత‌.. ఒక‌టి ప్ర‌భుత్వానికి ఇబ్బందిగా మారాయి. కొన్నాళ్ల కింద‌టి వ‌ర‌కు ఎస్సీలపై దాడులు.. రాష్ట్రంలో ప్ర‌ధాన వార్త‌గా మారింది. త‌ర్వాత హిందూ ఆల‌యాల‌పై దాడులు.. ప్ర‌భుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. త‌ర్వాత‌.. టీడీపీ నేత‌ల‌పై కేసులు.. స‌ర్కారును ఊపిరి ఆడ‌కుండా చేసింది. ఇలా.. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త వివాదాలు.. విమ‌ర్శ‌ల‌తో జ‌గ‌న్ ప్ర‌భుత్వం స‌మ‌స్య‌లు ఎదుర్కొంటూనే ఉంది. తాజాగా అప్పుల విష‌యం.. రాష్ట్రాన్ని దేశంలోనే ముందుకు తీసుకువెళ్లింది. ఇదిలావుంటే.. ఇప్పుడు తాజాగా విద్యుత్ స‌మ‌స్య రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఇబ్బందిగా మారింది.

రాష్ట్రంలో విద్యుత్ కోత‌లు.. మొద‌ల‌య్యాయ‌ని.. ప్ర‌భుత్వానికి ముందు చూపు లేక పోవ‌డంతోనే ఇలా జ‌రిగింద‌ని.. టీడీపీ నేత‌లు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేస్తున్నారు. నిజానికి గ‌త కొన్నాళ్లుగా విద్యుత్ స‌మ‌స్య రాష్ట్రంలో ప్ర‌ధాన చ‌ర్చ‌గా మారింది. గ్రామాలు, ప‌ల్లెల్లో.. విద్యుత్ కోత‌లు స‌ర్వ‌సాధార‌ణంగా మారాయి. రైతుల‌కు ఉచిత విద్యుత్ ఇస్తున్నా.. అది కూడా ఎప్పుడు ఉంటుందో లేదో తెలియ‌ని ప‌రిస్థితి. మ‌రోవైపు.. ట్రూ అప్ చార్జీల పేరిట ప్ర‌భుత్వం పెంచిన చార్జీల‌పైనా ప్ర‌జ‌ల్లో చ‌ర్చ సాగుతోంది. ఈ క్ర‌మంలో ఇప్పుడు వ‌ర్షాకాలం నేప‌థ్యంలో సౌర‌విద్యుత్ త‌గ్గిపోయి.. ప‌వ‌న్ విద్యుత్ కూడా డేంజ‌ర్‌లో పడింది.

దీంతో ఈ ప‌రిస్థితిని టీడీపీ త‌న‌కు అడ్వాంటేజ్‌గా తీసుకుని.. విమ‌ర్శ‌లు సంధించ‌డం కామ‌న్‌. అయితే.. దీనికి కౌంట‌ర్‌గా .. మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి స‌హా.. ఇత‌ర నాయ‌కులు.. రాష్ట్రంలో విద్యుత్‌కు కొర‌తే లేద‌ని ప్ర‌క‌టించారు. అంతేకాదు.. సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని కొట్టివేశారు. త‌ప్పుడు ప్ర‌చారం చేసే వారిపై చ‌ర్యలు త‌ప్ప‌వని కూడా హెచ్చ‌రించారు. అయితే.. ప్ర‌భుత్వం ఎన్ని హెచ్చ‌రిక‌లు చేసినా.. రాష్ట్రంలో విద్యుత్ కోత‌లు కామ‌న్‌గా మారుతున్నాయ‌నే వాద‌న మాత్రం.. అధికార వ‌ర్గాల నుంచే వినిపిస్తోంది. ఇప్ప‌టికిప్పుడు వ‌చ్చిన న‌ష్టం లేద‌ని అంటున్నా.. మున్ముందు మాత్రం స‌మ‌స్య‌లు త‌ప్పేలా క‌నిపించ‌డం లేదు.

సో.. దీనిని గ‌మ‌నిస్తే.. టీడీపీ చెబుతున్న వాద‌న బ‌లంగా ప్ర‌జ‌ల‌లోకి వెళ్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ప్ర‌భుత్వానికి ముందు చూపు లేద‌నే విష‌యాన్ని కేంద్రం కూడా ఇటీవ‌ల హెచ్చ‌రించింది. మున్ముందు క‌రెంటు క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని.. హెచ్చ‌రిస్తూ.. ఓ లేఖ రాసింది. అయినా. కూడా జ‌గ‌న్ స‌ర్కార్ దీనిని ప‌ట్టించుకోకుండా.. వ్య‌వ‌హ‌రించిన తీరుతో ఇప్పుడు క‌ష్టాల ముంగిట ఏపీ నిలిచింద‌నేదివాద‌న‌. ఈ ప‌రిణామాల‌తో టీడీపీ వాద‌నే బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on October 17, 2021 6:37 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

2 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

2 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

2 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

2 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

4 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

4 hours ago