పని చేసే వాడి కంటే.. పని చేస్తున్న వాడి తప్పుల్ని వెతికే విషయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నన్ని శక్తులు మరే రాజకీయ పార్టీలో కనిపించవు. కాంగ్రెస్ మినహా మిగిలిన పార్టీల్లో మాత్రం.. మనం పని చేయటం.. చేసేవాడు ఎలా చేస్తేనేం అన్నట్లుగా ఫీల్ కావటం కనిపిస్తుంది. కానీ.. కాంగ్రెస్ లో మాత్రం.. కాస్త పని చేసినా.. దానికి ఏవో లెక్కల్ని తెర మీదకు తీసుకొచ్చి.. నెగిటివ్ అంశాన్ని చర్చకు తెచ్చి.. అధిష్ఠానానికి కంప్లైంట్ చేయటం మామూలే.
ఈ కారణంతోనే.. కాంగ్రెస్ రాష్ట్ర రథ సారథులకు ఇలాంటి తలనొప్పులు తరచూ ఎదురవుతుంటాయి. ఆ మధ్యన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డికి ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు బోలెడన్ని ఎదురవుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ కిందకు చూడటమే కానీ పైకి చూసింది లేదు. ఆ విషయం తెలంగాణ కాంగ్రెస్ నేతలకు తెలుసు.. అధిష్ఠానానికి తెలుసు. ఒక దశలో కాంగ్రెస్ పని అయిపోయిందంటూ గులాబీ అధినేత మొదలు మిగిలిన నేతలంతా ఎక్కెసాలు చేయటం.. దానికి వేదనతో ఇంట్లో కూర్చొని పళ్లు నూరుకోవటం మినహా చేసిందేమీ లేదు. ఇలాంటివేళ.. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గులాబీ దళానికి చురుకు పుట్టేలా చేయటమే కాదు.. ఇవాల్టి రోజున కేసీఆర్ అండ్ కో బీపీ పెరిగేలా చేయటంలో రేవంత్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
తమకు చేతకానిది.. ఎవరికి చేతకాకూడదన్నట్లుగా ఫీలయ్యే టీ కాంగ్రెస్ నేతలు.. రేవంత్ మీద ఏదో ఒక విమర్శను.. ఆరోపణను తీసుకొచ్చి అధిష్ఠానం ముందు పెడుతున్నారు. అయినప్పటికి రేవంత్ కు కొంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పటికి.. అప్పుడప్పుడు మాత్రం క్లాసులు పీకుతున్నట్లు చెబుతున్నారు. తాజాగా అలాంటి పరిస్థితి రేవంత్ కు ఎదురైందని చెబుతున్నారు. ఈ మధ్యన ఢిల్లీకి వెళ్లిన సందర్భంగా అధిష్ఠానం ఒక విషయంలో క్లాస్ తీసుకున్నట్లు చెబుతున్నారు.
సోషల్ మీడియాలో రేవంత్ ప్రజా దర్బార్ పేరుతో చేసే ప్రచారం గురించి ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రచారంపై గుర్రుగా ఉన్న మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అధిష్ఠానానికి కంప్లైంట్ చేసినట్లుగా సమాచారం. దీనిపై రేవంత్ ను వివరణ కోరారని తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ అయిన తర్వాత కూడా ఇలాంటి ప్రచారం అవసరమా? అని ప్రశ్నించటంతో పాటు.. ఇలాంటివి వద్దని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే.. ఇలాంటి ప్రచారంతో తన వ్యక్తిగత ఇమేజ్ తో పాటు పార్టీ ఇమేజ్ కూడా పెరుగుతుందని కన్వీన్స్ చేసినట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. తనకు షాకిచ్చేలా చేస్తున్న సీనియర్ల తీరుకు రేవంత్ ఇబ్బంది పడుతున్నట్లు చెబుతున్నారు.
This post was last modified on October 14, 2021 2:54 pm
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…
అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్సీపీ…