Political News

ఏపీలో విద్యుత్ సంక్షోభం.. కారణం చెప్పిన ట్రాన్స్ కో

భారత్ కు తీవ్రమైన విద్యుత్ సంక్షోభం పొంచి ఉందనే మాట ఇటీవల వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. చెప్పినంత ఎక్కువగా ఏమీ కొరత లేదన్న మాటను ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా.. అందులో నిజం లేదన్న మాట తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూస్తే అర్థం కాక మానదు. రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణ కంటే ఏపీకే విద్యుత్ సంక్షోభం ఎక్కువగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి బలం చేకూరేలా తాజాగా ఏపీ ట్రాన్స్ కో చేసిన ప్రకటన స్పస్టం చేస్తోంది.

రాష్ట్రంలో బొగ్గు కొరత ఉన్నప్పటికీ.. విద్యుత్ డిమాండ్ ను తట్టుకునేలా డిస్కింలు పని చేస్తున్ట్లుగా ఏపీ ట్రాన్స్ కో చెప్పింది. ఈ మాట విన్నంతనే ఫర్లేదన్న భావన కలిగినప్పటికి.. సదరు సంస్థ చెబుతున్న లెక్కల్ని చూస్తే మాత్రం.. ముంచుకొస్తున్న సంక్షోభం స్పష్టంగా కనిపించక మానదు. బొగ్గు కొరత కారణంగా ఏపీలో 2500 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతున్నాయని చెబుతున్నారు.

ఏపీ థర్మల్ విద్యుత్ కేంద్రాలకు రోజుకు 70 వేల టన్నుల బొగ్గు అవసరం అవుతుండగా.. కొరత కారణంగా సెప్టెంబరులో 24వేల టన్నులు మాత్రమే సరఫరా అయ్యాయని పేర్కొన్నారు. దీంతో విద్యుదుత్పత్తి మీద కూడా ప్రభావం పడింది. ప్రస్తుతం నెలకొన్న బొగ్గు కొరత కారణంగా తక్కువ స్థాయి విద్యుత్ అంతరాయాలతో సరఫరా చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. నిరంతర సరఫరా కోసం పీక్ డిమాండ్ ఉన్న వేళలో ఒక్కో యూనిట్ కు రూ.15-20 పెట్టి మరీ విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు.

ఏపీలో విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం 18,533 మెగావాట్లు అయినప్పటికీ.. సరిపడినంత విద్యుత్ ఉత్పత్తి కావటం లేదని చెబుతున్నారు. 8075 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ప్లాంట్లు ఉన్నా బేస్ లోడుకు సరిపడినంత విద్యుత్ ఉత్పత్తి కావడం లేదని.. 908 గ్యాస్ ఆధారిత ప్లాంట్ల నుంచి 100 మెగావాట్లు మాత్రమే వస్తుందని వెల్లడించింది. ప్రస్తుతం ఏపీలో 185 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉందని.. పీక్ డిమాండ్ మేరకు 9064 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతోందన్నారు.

This post was last modified on October 14, 2021 10:07 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

16 minutes ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

1 hour ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

2 hours ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

2 hours ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

3 hours ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

3 hours ago