Political News

ఉద్యోగ సంఘాల నేతలకు లైవ్‌లో వార్నింగ్

ఆంధ్రప్రదేశ్‌లో ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరెత్తితే అంతే సంగతులు అన్నట్లే ఉంటోంది పరిస్థితి. ప్రతిపక్ష నేతలను ఈ విషయంలో ఎంతగా అణగదొక్కారో, ఎదురు దాడి చేసి నోళ్లు మూయించే ప్రయత్నం చేశారో చెప్పడానికి గత రెండున్నరేళ్లలో ఎన్నో ఉదాహరణలున్నాయి. ఇక సామాన్య జనాలెవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పితే వాళ్లకు మరింత దారుణమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉద్యోగ సంఘాల నేతలు తమకెన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ నోరు విప్పకుండా సర్దుకుంటూ వచ్చారు ఇన్నాళ్లూ.

గత ప్రభుత్వ హయాంలో ఏ చిన్న సమస్య తలెత్తినా ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాల నేతలు ఎలా విరుచుకుపడేవారో తెలిసిందే. తమ డిమాండ్లను చాలా వరకు నెరవేర్చినా, అడగని కోర్కెలు తీర్చినా కూడా చంద్రబాబు సర్కారుకు వ్యతిరేకంగా మారి, ఆ ప్రభుత్వం గద్దె దిగడంలో ఉద్యోగ సంఘాలు కీలకంగా మారాయనే అభిప్రాయం బలంగా ఉంది.

కానీ జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక హామీలు కానీ, డిమాండ్లు కానీ ఏవీ నెరవేర్చలేదు. పైగా జీతాలే సక్రమంగా చెల్లించని పరిస్థితి. కొన్ని నెలల నుంచి ఒకటో తేదీకి జీతం అనే మాటే మరిచిపోయారు ఉద్యోగులు. ఎవరికి ఎఫ్పుడు జీతాలు పడతాయో, పెన్షన్లు అందుతాయో దైవాదీనంగా మారిపోయింది. ఇక పెండింగ్ డీఏలు, పీఆర్సీ, సీపీఎస్ రద్దు లాంటి అంశాల సంగతి సరేసరి. అయినా సరే.. ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పటిదాకా నోరు విప్పలేదు.

కానీ పరిస్థితి రోజు రోజుకూ అధ్వాన్నంగా తయారవుతుండటంతో ఎట్టకేలకు ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు గళం విప్పక తప్పట్లేదు. ఉద్యోగుల జీతాల ఆలస్యం సహా పలు సమస్యలపై ఏపీ రాష్ట్ర ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, రాష్ట్ర రెవెన్యూ సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తదితరులు ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు.

ఐతే ఈ ప్రెస్ మీట్ జరుగుతుండగా మధ్యలో ప్రభుత్వ పెద్దల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ప్రెస్ మీట్ లైవ్ నడుస్తుండగా.. వాళ్లిద్దరూ ఫోన్లో మాట్లాడ్డం కనిపించింది. కంట్రోల్లో ఉంటాం సార్ అని శ్రీనివాసరావు అనడం.. మా మీద చాలా ఒత్తిడి ఉంది ఏం చేయమంటారని వెంకటేశ్వర్లు పేర్కొనడం వినిపించింది. ప్రభుత్వంలో పెద్ద స్థాయి వ్యక్తే ఇలా ఫోన్ చేసి ఉద్యోగ సంఘాల నేతల్ని హెచ్చరించిన విషయం స్పష్టంగా తెలిసిపోయింది.

ఇటీవలే ఓ కార్యక్రమంలో ఉద్యోగుల సమస్యల గురించి మాట్లాడిన ఓ ఎమ్మెల్సీపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆ కార్యక్రమం మధ్యలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఉదంతాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఇలాంటి అనుభవాలు నభూతో అంటూ ఉద్యోగులు మథన పడుతున్నారు.

This post was last modified on October 8, 2021 10:20 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

12 minutes ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

40 minutes ago

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

2 hours ago

ఈ తరంలో చిరుకు నచ్చిన యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…

5 hours ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

10 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

13 hours ago