Political News

ఉద్యోగ సంఘాల నేతలకు లైవ్‌లో వార్నింగ్

ఆంధ్రప్రదేశ్‌లో ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరెత్తితే అంతే సంగతులు అన్నట్లే ఉంటోంది పరిస్థితి. ప్రతిపక్ష నేతలను ఈ విషయంలో ఎంతగా అణగదొక్కారో, ఎదురు దాడి చేసి నోళ్లు మూయించే ప్రయత్నం చేశారో చెప్పడానికి గత రెండున్నరేళ్లలో ఎన్నో ఉదాహరణలున్నాయి. ఇక సామాన్య జనాలెవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పితే వాళ్లకు మరింత దారుణమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉద్యోగ సంఘాల నేతలు తమకెన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ నోరు విప్పకుండా సర్దుకుంటూ వచ్చారు ఇన్నాళ్లూ.

గత ప్రభుత్వ హయాంలో ఏ చిన్న సమస్య తలెత్తినా ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాల నేతలు ఎలా విరుచుకుపడేవారో తెలిసిందే. తమ డిమాండ్లను చాలా వరకు నెరవేర్చినా, అడగని కోర్కెలు తీర్చినా కూడా చంద్రబాబు సర్కారుకు వ్యతిరేకంగా మారి, ఆ ప్రభుత్వం గద్దె దిగడంలో ఉద్యోగ సంఘాలు కీలకంగా మారాయనే అభిప్రాయం బలంగా ఉంది.

కానీ జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక హామీలు కానీ, డిమాండ్లు కానీ ఏవీ నెరవేర్చలేదు. పైగా జీతాలే సక్రమంగా చెల్లించని పరిస్థితి. కొన్ని నెలల నుంచి ఒకటో తేదీకి జీతం అనే మాటే మరిచిపోయారు ఉద్యోగులు. ఎవరికి ఎఫ్పుడు జీతాలు పడతాయో, పెన్షన్లు అందుతాయో దైవాదీనంగా మారిపోయింది. ఇక పెండింగ్ డీఏలు, పీఆర్సీ, సీపీఎస్ రద్దు లాంటి అంశాల సంగతి సరేసరి. అయినా సరే.. ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పటిదాకా నోరు విప్పలేదు.

కానీ పరిస్థితి రోజు రోజుకూ అధ్వాన్నంగా తయారవుతుండటంతో ఎట్టకేలకు ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు గళం విప్పక తప్పట్లేదు. ఉద్యోగుల జీతాల ఆలస్యం సహా పలు సమస్యలపై ఏపీ రాష్ట్ర ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, రాష్ట్ర రెవెన్యూ సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తదితరులు ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు.

ఐతే ఈ ప్రెస్ మీట్ జరుగుతుండగా మధ్యలో ప్రభుత్వ పెద్దల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ప్రెస్ మీట్ లైవ్ నడుస్తుండగా.. వాళ్లిద్దరూ ఫోన్లో మాట్లాడ్డం కనిపించింది. కంట్రోల్లో ఉంటాం సార్ అని శ్రీనివాసరావు అనడం.. మా మీద చాలా ఒత్తిడి ఉంది ఏం చేయమంటారని వెంకటేశ్వర్లు పేర్కొనడం వినిపించింది. ప్రభుత్వంలో పెద్ద స్థాయి వ్యక్తే ఇలా ఫోన్ చేసి ఉద్యోగ సంఘాల నేతల్ని హెచ్చరించిన విషయం స్పష్టంగా తెలిసిపోయింది.

ఇటీవలే ఓ కార్యక్రమంలో ఉద్యోగుల సమస్యల గురించి మాట్లాడిన ఓ ఎమ్మెల్సీపై ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆ కార్యక్రమం మధ్యలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ ఉదంతాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఇలాంటి అనుభవాలు నభూతో అంటూ ఉద్యోగులు మథన పడుతున్నారు.

This post was last modified on October 8, 2021 10:20 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

41 minutes ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

3 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

6 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

9 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

9 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

12 hours ago