Political News

మోడీకి షాక్‌.. ఈ వేలంలో నిరాశే!

మోడీ ప్ర‌భ‌తో 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ ఘ‌న విజ‌యం సాధించి కేంద్రంలో అధికారాన్ని ద‌క్కించుకుంది. మోడీ తొలిసారి ప్ర‌ధాని అయ్యారు. 2019 ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న ప్ర‌భ‌తో దేశ‌వ్యాప్తంగా కాషాయ ప‌వ‌నాలు వీచాయి. మ‌ళ్లీ గెలిచి రెండో సారి ప్ర‌ధాని ప‌ద‌విని సొంతం చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేద‌నే చెప్పొచ్చు. దేశ‌మంతా మోడీ ప్ర‌భ క్ర‌మంగా ప‌డిపోతుంద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తాజాగా మోడీకి వివిధ సంద‌ర్బాల్లో వ‌చ్చిన బ‌హుమ‌తులు జ్ణాపిక‌ల‌కు ఈ వేలం నిర్వ‌హిస్తే వ‌స్తున్న ఆద‌ర‌ణ అంతంత మాత్రంగానే ఉండ‌డం అందుకు కార‌ణం.

ప్ర‌ధాన మోడీ వాడిన వ‌స్తువులంటే చాలా క్రేజ్ ఉండేది. గ‌తంలో ఆయ‌న తొడిగిన ఓ కోటు కోసం ఓ వ్య‌క్తి ఏకంగా రూ.4.31 కోట్లు చెల్లించాడు. గ‌తంలో ఆయ‌న‌కు వ‌చ్చిన బ‌హుమ‌తులు ఈ- వేలం వేస్తే తీవ్ర‌మైన పోటీ ఉండేది. కానీ ఇప్పుడా ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. నేటితో ముగియ‌నున్న ప్ర‌స్తుత వేలంలో ఏకంగా 162 వ‌స్తువుల‌కు ఒక్క బిడ్ కూడా దాఖ‌లు కాక‌పోవ‌డం విశేషం. అందులో మోడీ త‌న త‌ల్లితో దిగిన ఫొటో కూడా ఉంది. గంగా న‌ది ప్ర‌క్షాళ‌న కోసం ఏర్పాటు చేసిన న‌మామి గంగే ప్రాజెక్టుకు నిధుల సేక‌ర‌ణ కోసం ప్ర‌స్తుతం ఈ- వేలం జ‌రుగుతోంది. సెప్టెంబ‌ర్ 17న మొద‌లైన ఈ వేలం అక్టోబ‌ర్ 7న ముగుస్తుంది. ఒలింపిక్స్ పారాలింపిక్స్‌లో అద్బుత ప్ర‌ద‌ర్శ‌న చేసిన అథ్లెట్లు మోడీకి అందించిన క్రీడా ప‌రిక‌రాల‌తో పాటు ఇత‌ర వ‌స్తువులు ఈ వేలంలో ఉన్నాయి.

ఒలింపిక్స్‌లో ప‌సిడితో చ‌రిత్ర సృష్టించిన నీర‌జ్ చోప్రా విసిరిన ఈటెకు రూ.కోటి 50 వేలు ప‌లికింది. రెండు ఒలింపిక్స్ ప‌త‌కాలు సాధించిన తొలి భార‌త మ‌హిళ‌గా నిలిచిన పీవీ సింధు రాకెట్కు రూ.80,00,100 ప‌లికింది. ఇక్క‌డ ఈ వ‌స్తువుల‌కు భారీ ధ‌ర వ‌చ్చిందంటే అందుకు కార‌ణం ఆయా క్రీడాకారులకున్నా క్రేజ్ కానీ మోడీ ప్ర‌భ ఎంత మాత్రం కాదు. ఎందుకంటే మోడీ వాడిన కండువాలు దుప్ప‌ట్లు బూట్లు వివిధ దేశాల వాళ్లు మెడ‌లో వేసిన శాలువాలు ఇలా చాలా వ‌స్తువుల కొనేందుకు ఎవ‌రూ ఆస‌క్తి చూపించ‌లేదు. దేశ‌వ్యాప్తంగా మోడీకి ఆద‌ర‌ణ ద‌క్కుతుంద‌న‌డానికి ఇదే నిద‌ర్శ‌న‌మ‌నే అభిప్రాయాలు వ్యక్త‌మ‌వుతున్నాయి.

దేశాన్ని అల్ల‌క‌ల్లోలం చేసిన కరోనా క‌ట్ట‌డిలో విఫ‌లం సాగు చ‌ట్టాల‌పై మొండి వైఖ‌రి పెగాస‌స్ వ్య‌వ‌హారం ఇంధ‌న ధ‌ర‌ల‌ను నియంత్రించ‌లేక‌పోవ‌డం.. ఇలా చాలా విష‌యాల్లో మోడీ ఫెయిల్ అయ్యారంటూ దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల్లో ఆయ‌న‌పై వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. ఇప్ప‌టికే ఈ వ్యతిxరేక‌త‌ను త‌గ్గించుకుని తిరిగి ప్ర‌జ‌ల ఓట్లు గెలుచుకునేందుకు మోడీ ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. కానీ వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మాత్రం మోడీకి ఎదురు దెబ్బ త‌గ‌ల‌డం ఖాయ‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

This post was last modified on October 7, 2021 2:38 pm

Share

Recent Posts

300 కోట్లు దాటినా ఆనందం లేదు

అదేదో సామెత చెప్పినట్టు జన నాయగన్ బాక్సాఫీస్ గ్రాస్ 300 కోట్లు దాటినా కూడా నిర్మాత, బయ్యర్లు పెద్దగా సంతోష…

3 minutes ago

కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో విజయసాయి రెడ్డి?

రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి…

7 minutes ago

బండి పదవికి గండి పడనుందా

కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సన్ స్ట్రోక్ తప్పేలా లేదు. బండిని మంత్రి పదవి నుంచి తొలగించడం ఖాయమని…

3 hours ago

స్థానికాల తరువాత మంత్రివర్గ మార్పులు తప్పవా?

మంత్రులు మౌనంగా ఉంటే స‌హించేది లేద‌ని సీఎం చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. ముఖ్యంగా టీడీపీ మంత్రుల‌కు ఆయ‌న ఈ విష‌యంలో…

4 hours ago

వారణాసి కానుకలు… తప్పని షరతులు

ఇంకో నాలుగు రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు రానుంది. గుంటూరు కారం తర్వాత తన దర్శనం స్క్రీన్…

4 hours ago

సందీప్ కిషన్ కరికాల… 2 పార్టులు… నాలుగు నెలలు!

యువ కథానాయకుడు సందీప్ కిషన్ కెరీర్లో సక్సెస్ రేట్ తక్కువే అయినా.. అవకాశాలకేమీ లోటుండదు. ఎప్పుడూ చేతిలో రెండు మూడు…

4 hours ago