Political News

మోత్కుప‌ల్లికి పెద్ద‌పీట‌

మాజీ మంత్రి మోత్కుప‌ల్లి నర్సింహులు ద‌శ తిర‌గ‌నుందా? ఆయ‌నకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీల‌క ప‌ద‌వి అప్ప‌గించనున్నారా? అంటే రాజ‌కీయ వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. మోత్కుప‌ల్లికి కేసీఆర్ అధిక ప్రాధాన్య‌త‌నిస్తుండ‌డ‌మే అందుకు కార‌ణం. తాజాగా ఆయ‌నను కేసీఆర్ అసెంబ్లీకి తీసుకుని వెళ్లారు. స‌భ అయిపోయేంత వ‌ర‌కూ మోత్కుప‌ల్లి సీఎం కార్యాల‌యంలోనే ఉన్నారు. ఆ త‌ర్వాత కేసీఆర్ వెంట ప్ర‌గ‌తిభ‌వ‌న్‌కు వెళ్లారు. దీంతో ద‌ళిత బంధు ప‌థకాన్ని ప్ర‌తిష్ఠాత్మకంగా తీసుకున్న కేసీఆర్‌.. ఆ ప‌థ‌కం అమ‌లు త‌దిత‌ర వ్య‌వ‌హారాల ప‌ర్య‌వేక్ష‌ణ కోసం మోత్కుప‌ల్లికి కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌జెప్ప‌నున్నార‌ని స‌మాచారం.

ద‌ళిత బంధు పథ‌కాన్ని విడ‌త‌ల వారీగా రాష్ట్రంలోని ద‌ళితులంద‌రికీ అందిస్తామ‌ని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్ర‌క‌టించారు. వ‌చ్చే బ‌డ్జెట్‌లో ఈ ప‌థ‌కం కోసం రూ.20 వేల కోట్లు కేటాయిస్తామ‌ని వెల్ల‌డించారు. అయితే ఈ ప‌థ‌కానికి ఓ చ‌ట్ట‌బ‌ద్ధ‌త తీసుకు వ‌చ్చి దాని అమ‌లు కోసం ఓ ఛైర్మ‌న్ ప‌ద‌వి ఏర్పాటు చేయాల‌ని కేసీఆర్ అనుకుంటున్న‌ట్లు స‌మాచారం. ఈ ఛైర్మ‌న్ ప‌ద‌విని మోత్కుప‌ల్లికి ఇస్తార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

గ‌తంలో ద‌ళిత బంధు స‌మీక్షా స‌మావేశంలోనూ మోత్కుప‌ల్లి న‌ర్సింహులు పాల్గొన్నారు. ఆ స‌మావేశంలో సీఎం కేసీఆర్ ప‌క్క‌నే కూర్చోవ‌డం అప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీంతో ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి రాబోతుంద‌నే ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. ఇప్పుడు ఏకంగా అసెంబ్లీలో ద‌ళిత బంధు మీద చ‌ర్చ సంద‌ర్భంగా మోత్కుప‌ల్లిని కేసీఆర్ తీసుకొని వెళ్లారు. దీంతో ద‌ళిత బంధు అమ‌లు క‌మిటీ ఛైర్మ‌న్ ప‌ద‌విని మోత్కుప‌ల్లికే ఇచ్చేలా కేసీఆర్ త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకుంటార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

అంతే కాకుండా మోత్కుప‌ల్లి త్వ‌ర‌లోనే కేసీఆర్ స‌మ‌క్షంలో గులాబి కండువా క‌ప్పుకోనున్న‌ట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో ఆయ‌న టీఆర్ఎస్‌లో చేరే అవ‌కాశం ఉంది. ఈ స‌మ‌యంలోనే మోత్కుప‌ల్లికి ఇవ్వ‌నున్న కీల‌క ప‌ద‌వి గురించి కేసీఆర్ ఓ ప్ర‌క‌ట‌న చేసే ఆస్కార‌ముంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాజ‌కీయ‌ల్లో ఎంతో సీనియ‌ర్ అయిన మోత్కుప‌ల్లి ద‌శాబ్దం కిత్ర‌మే మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకుని ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాలో చ‌క్రం తిప్పారు. 1983లో తొలిసారి ఆలేరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి స్వ‌తంత్య్ర అభ్య‌ర్థిగా పోటీ చేసి ఆయ‌న ఎమ్మెల్యే అయ్యారు. మొత్తం ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గ‌తంలో టీడీపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ త‌ర‌పున పోటీ చేసి నెగ్గారు. ఆ త‌ర్వాత బీజేపీలో చేరిన ఆయ‌న‌.. ఇప్పుడు తిరిగి కారెక్క‌నున్నారు.

This post was last modified on October 6, 2021 6:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

యుద్ధంతో టీవీ ధరలకు షాక్.. సేల్స్ డౌన్

గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…

3 hours ago

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

6 hours ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

7 hours ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

8 hours ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

8 hours ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

9 hours ago