దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన యూపీలోని ‘లఖింపర్ ఖేరి’ అరాచకాన్నిఇంతవరకు కేవలం విన్నాం. ఆ దారుణానికి సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. ప్రస్తుతం వైరల్ గా మారిన ఈ వీడియోలో.. నిరసన చేస్తున్న వారు.. తమ దారిన తాము ముందుకు నడుస్తున్న వేళ.. ఏ మాత్రం కనికరం లేకుండా వాహనంతో గుద్దేసి.. ముందుకు వెళ్లిన వైనం షాకింగ్ గా మారింది. అధికారంతో కన్నుమిన్ను కానకుండా ఉన్న వైనం చూస్తే.. బీజేపీ నేతల అరాచకం ఏ స్థాయిలో ఉంటుందన్న విషయం తాజా వీడియో స్పష్టం చేస్తుందని చెప్పాలి.
ఎంత అధికారం అండగా ఉంటే మాత్రం మనుషుల ప్రాణాలు తీయడం ఏమిటి? ఈ నేరపూరిత ధోరణి చూస్తే.. అధికార బలుపు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఇంతకాలం సినిమాల్లో మాత్రమే చూసిన ఇలాంటి సీన్.. ఇప్పుడు రియల్ గా చూడాల్సిన పరిస్థితి. ఇంత చేసి కూడా.. తన కుమారుడు ఘటన జరిగిన దగ్గర లేదన్న కేంద్ర సహాయ మంత్రి మాట వింటే.. ఆయన మాటలకు చేతలకు మధ్యనున్న తేడా ఎంతన్న విషయం తాజా వీడియో స్పష్టం చేస్తుందని చెప్పాలి.
అంతేకాదు.. తన దారికి అడ్డు వచ్చే వారిని ఎలాంటి మొహమాటం లేకుండా బెదిరింపులకు దిగడం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రాకు అలవాటే అన్న విమర్శలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి. గతంలో ఒకసారి ఆగ్రహానికి గురైన సందర్భంలో తాను తలుచుకుంటే.. అందరిని దారిలోకి తెచ్చుకోవటానికి రెండు నిమిషాలకు మించిన సమయం పట్టదని.. తాను ఎంపీ కాక ముందు ఏమిటన్న విషయం అందరికి బాగా తెలుసని ఆయన స్వయంగా చేసిన వ్యాఖ్యలు ఇపుడు అందరికీ గుర్తుకువస్తున్నాయి.
ఒకసారి తాను రంగంలోకి దిగితే మీరున్న ప్రాంతమే కాదు.. ఆ చుట్టుపక్కల కూడా ఉండలేరన్న మాట కూడా ఆయన అన్నారు. ఇలాంటి వారి చేతుల్లో అధికారం ఉంటే ఇంకెన్ని అరాచకాలు చేస్తారో అని కాంగ్రెస్ నేతలు, ఈ ఘటన చూసిన ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దేశంలో ఎక్కడ ఏం జరిగినా వెంటనే స్పందించే మోడీ.. ఈ ఉదంతంపై ఇప్పటివరకు ఎందుకు రియాక్టు కానట్లు?
This post was last modified on October 5, 2021 11:12 am
ఎయిర్పోర్టులంటే పెద్ద సిటీల్లోనే ఉండాలనే నియమాలేమీ లేవిప్పుడు. టైర్-2 సిటీలు, పట్టణాలకు కూడా విమానాశ్రయాలు విస్తరిస్తున్నాయి. ఐతే మరో తెలుగు…
‘పుష్ప’, ‘పుష్ప-2’ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. దీని తర్వాత అతను ఏ…
టాలీవుడ్ యువ నటుడు సుహాస్ నటించిన తమిళ చిత్రం మండాడి బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో గురువారం చెన్నైలో నిర్వహించిన…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. సుదీర్ఘ విరామం తర్వాత.. ఏపీకి చేరుకున్నారు. గత నెల…
మహిళలు యుక్త వయసుకు వచ్చిన దగ్గర్నుంచి వారిని పీరియడ్స్ ఎంతగా ఇబ్బంది పెడతాయో ఆ బాధను అనుభవించే వారికి మాత్రమే…
హృదయ కాలేయం, కొబ్బరి మట్ట లాంటి సినిమాలతో స్పూఫ్ హీరోగా గుర్తింపు పొందిన సంపూర్ణేష్ బాబు ఆ తర్వాత అదే…