దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన యూపీలోని ‘లఖింపర్ ఖేరి’ అరాచకాన్నిఇంతవరకు కేవలం విన్నాం. ఆ దారుణానికి సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. ప్రస్తుతం వైరల్ గా మారిన ఈ వీడియోలో.. నిరసన చేస్తున్న వారు.. తమ దారిన తాము ముందుకు నడుస్తున్న వేళ.. ఏ మాత్రం కనికరం లేకుండా వాహనంతో గుద్దేసి.. ముందుకు వెళ్లిన వైనం షాకింగ్ గా మారింది. అధికారంతో కన్నుమిన్ను కానకుండా ఉన్న వైనం చూస్తే.. బీజేపీ నేతల అరాచకం ఏ స్థాయిలో ఉంటుందన్న విషయం తాజా వీడియో స్పష్టం చేస్తుందని చెప్పాలి.
ఎంత అధికారం అండగా ఉంటే మాత్రం మనుషుల ప్రాణాలు తీయడం ఏమిటి? ఈ నేరపూరిత ధోరణి చూస్తే.. అధికార బలుపు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఇంతకాలం సినిమాల్లో మాత్రమే చూసిన ఇలాంటి సీన్.. ఇప్పుడు రియల్ గా చూడాల్సిన పరిస్థితి. ఇంత చేసి కూడా.. తన కుమారుడు ఘటన జరిగిన దగ్గర లేదన్న కేంద్ర సహాయ మంత్రి మాట వింటే.. ఆయన మాటలకు చేతలకు మధ్యనున్న తేడా ఎంతన్న విషయం తాజా వీడియో స్పష్టం చేస్తుందని చెప్పాలి.
అంతేకాదు.. తన దారికి అడ్డు వచ్చే వారిని ఎలాంటి మొహమాటం లేకుండా బెదిరింపులకు దిగడం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రాకు అలవాటే అన్న విమర్శలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి. గతంలో ఒకసారి ఆగ్రహానికి గురైన సందర్భంలో తాను తలుచుకుంటే.. అందరిని దారిలోకి తెచ్చుకోవటానికి రెండు నిమిషాలకు మించిన సమయం పట్టదని.. తాను ఎంపీ కాక ముందు ఏమిటన్న విషయం అందరికి బాగా తెలుసని ఆయన స్వయంగా చేసిన వ్యాఖ్యలు ఇపుడు అందరికీ గుర్తుకువస్తున్నాయి.
ఒకసారి తాను రంగంలోకి దిగితే మీరున్న ప్రాంతమే కాదు.. ఆ చుట్టుపక్కల కూడా ఉండలేరన్న మాట కూడా ఆయన అన్నారు. ఇలాంటి వారి చేతుల్లో అధికారం ఉంటే ఇంకెన్ని అరాచకాలు చేస్తారో అని కాంగ్రెస్ నేతలు, ఈ ఘటన చూసిన ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దేశంలో ఎక్కడ ఏం జరిగినా వెంటనే స్పందించే మోడీ.. ఈ ఉదంతంపై ఇప్పటివరకు ఎందుకు రియాక్టు కానట్లు?
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…
మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్ను అనుకోకుండా రివీల్…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…
"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…
కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…