Political News

వైసీపీ నేత‌ల‌కు.. ప‌నిత‌గ్గించిన‌.. టీడీపీ..!

ఏపీ సీఎం జ‌గ‌న్ సొంత జిల్లాలోని.. ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం బ‌ద్వేల్ లో ఈ నెల 30న ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. అయితే.. దీనికి సంబంధించి.. వైసీపీ గ‌త ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ త‌ర‌ఫున గెలిచి అనారోగ్యంతో మృతి చెందిన వెంక‌ట‌సుబ్బ‌య్య స‌తీమ‌ణి సుధ‌కే టికెట్ ఇచ్చింది. దీనికి సంబంధించి వైసీపీ పెద్ద ఎత్త‌న ప్ర‌చారానికి కూడా రెడీ అయింది. అంతేకాదు.. మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి కూడా బాధ్యత‌లు అప్ప‌గించారు. ఎలా గెల‌వాలి? టీడీపీని ఎలా ఎదుర్కొనాలి? అనే వ్యూహాల‌పై అప్పుడే క‌స‌ర‌త్తు కూడా ప్రారంభించారు. జ‌గ‌న్ అయితే వైసీపీ నేత‌ల‌కు బ‌ద్వేల్లో 60 వేల మెజార్టీ రావాల‌ని టార్గెట్ పెట్టారు.

అక్క‌డ ఉప ఎన్నిక బాధ్య‌త‌ను క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు రాయ‌చోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి అప్ప‌గించారు. అక్క‌డ భారీ మెజార్టీ కోసం మూడంచెల వ్యూహం కూడా రూపొందించారు. అయితే..ఇంతలోనే.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం .. టీడీపీ, మ‌రో ప‌క్షం జ‌న‌సేనలు.. ఇక్క‌డ నుంచి పోటీ చేయ‌డం లేద‌ని ప్ర‌క‌టించాయి. దీంతో వైసీపీ నేత‌ల‌కు ప‌నిలేకుండా పోయింది. అంతేకాదు.. ఇక్క‌డ ఏక‌గ్రీవం అయ్యేందుకు ఛాన్స్ ఉంద‌నే సూచ‌న‌లు వ‌స్తున్నాయి. ఎందుకంటే.. వాస్త‌వానికి రాష్ట్రంలో బ‌ల‌మైన ప‌క్షాలు రెండు త‌ప్పుకొన్న త‌ర్వాత‌.. బీజేపీ ఇక్క‌డ నుంచి పోటీ చేస్తామ‌ని అనుకున్నా.. కేంద్ర అధిష్టానం సూచ‌నల మేర‌కు ఇక్క‌డ నుంచి పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

ఈ క్ర‌మంలో కేంద్ర బీజేపీ పెద్ద‌ల‌తో వైసీపీకి ఉన్న రిలేష‌న్‌ను బ‌ట్టి.. ఇక్క‌డ పోటీ చేసే అవ‌కాశం లేద‌ని.. అంటున్నారు. ఇక‌, మిగిలిన పార్టీలో క‌మ్యూనిస్టులు దీనిపై ఎలాంటి చ‌ర్చ‌చేప‌ట్ట‌లేదు. పైగా.. పోటీ చేస్తారో.. లేదో తెలియ‌దు. ఇక‌, మ‌రో పార్టీ బీఎస్పీ.. ఉన్నా.. పోటీ చేస్తామ‌ని అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌క‌టించ‌లేదు. అయితే.. అందరికీ కూడా సెంటిమెంటు ఇక్క‌డ ముంద‌రి కాళ్ల‌కు బంధం వేస్తోంది. ఎస్సీ వ‌ర్గానికి చెందిన వెంక‌ట సుబ్బ‌య్య మ‌ర‌ణం త‌ర్వాత‌.. ఆయ‌న స‌తీమ‌ణినే ఇక్క‌డ వైసీపి నిల‌బెట్ట‌డంతో .. తాము పోటీ చేస్తే.. ఎస్సీ వ‌ర్గంపై.. ఎస్సీలే పోటీ చేస్తున్నార‌ని.. క‌నీసం సింప‌తీ కూడా చూపించ‌డం లేద‌నే వాద‌న బ‌లంగా బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

ఈ నేప‌థ్యంలో బీఎస్పీ త‌ప్పుకొనే ఛాన్స్ ఉంటుంద‌ని అంటున్నారు. ఇక‌, బీజేపీ ఒక్క‌టే బ‌రిలో నిలిచినా.. పోటీ వ‌ర‌కు ప‌రిస్థితి ఉండ‌ద‌ని అంటున్నారు..మొత్తానికి చంద్ర‌బాబు తీసుకున్న ఒక్క నిర్ణ‌యం.. వైసీపీ నేత‌ల‌కు ప‌నిలేకుండా చేసింద‌నే టాక్‌రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on October 5, 2021 9:26 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

18 minutes ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

1 hour ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

2 hours ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

2 hours ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

3 hours ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

3 hours ago