Political News

వైసీపీ నేత‌ల‌కు.. ప‌నిత‌గ్గించిన‌.. టీడీపీ..!

ఏపీ సీఎం జ‌గ‌న్ సొంత జిల్లాలోని.. ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం బ‌ద్వేల్ లో ఈ నెల 30న ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. అయితే.. దీనికి సంబంధించి.. వైసీపీ గ‌త ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ త‌ర‌ఫున గెలిచి అనారోగ్యంతో మృతి చెందిన వెంక‌ట‌సుబ్బ‌య్య స‌తీమ‌ణి సుధ‌కే టికెట్ ఇచ్చింది. దీనికి సంబంధించి వైసీపీ పెద్ద ఎత్త‌న ప్ర‌చారానికి కూడా రెడీ అయింది. అంతేకాదు.. మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి కూడా బాధ్యత‌లు అప్ప‌గించారు. ఎలా గెల‌వాలి? టీడీపీని ఎలా ఎదుర్కొనాలి? అనే వ్యూహాల‌పై అప్పుడే క‌స‌ర‌త్తు కూడా ప్రారంభించారు. జ‌గ‌న్ అయితే వైసీపీ నేత‌ల‌కు బ‌ద్వేల్లో 60 వేల మెజార్టీ రావాల‌ని టార్గెట్ పెట్టారు.

అక్క‌డ ఉప ఎన్నిక బాధ్య‌త‌ను క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు రాయ‌చోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి అప్ప‌గించారు. అక్క‌డ భారీ మెజార్టీ కోసం మూడంచెల వ్యూహం కూడా రూపొందించారు. అయితే..ఇంతలోనే.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం .. టీడీపీ, మ‌రో ప‌క్షం జ‌న‌సేనలు.. ఇక్క‌డ నుంచి పోటీ చేయ‌డం లేద‌ని ప్ర‌క‌టించాయి. దీంతో వైసీపీ నేత‌ల‌కు ప‌నిలేకుండా పోయింది. అంతేకాదు.. ఇక్క‌డ ఏక‌గ్రీవం అయ్యేందుకు ఛాన్స్ ఉంద‌నే సూచ‌న‌లు వ‌స్తున్నాయి. ఎందుకంటే.. వాస్త‌వానికి రాష్ట్రంలో బ‌ల‌మైన ప‌క్షాలు రెండు త‌ప్పుకొన్న త‌ర్వాత‌.. బీజేపీ ఇక్క‌డ నుంచి పోటీ చేస్తామ‌ని అనుకున్నా.. కేంద్ర అధిష్టానం సూచ‌నల మేర‌కు ఇక్క‌డ నుంచి పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

ఈ క్ర‌మంలో కేంద్ర బీజేపీ పెద్ద‌ల‌తో వైసీపీకి ఉన్న రిలేష‌న్‌ను బ‌ట్టి.. ఇక్క‌డ పోటీ చేసే అవ‌కాశం లేద‌ని.. అంటున్నారు. ఇక‌, మిగిలిన పార్టీలో క‌మ్యూనిస్టులు దీనిపై ఎలాంటి చ‌ర్చ‌చేప‌ట్ట‌లేదు. పైగా.. పోటీ చేస్తారో.. లేదో తెలియ‌దు. ఇక‌, మ‌రో పార్టీ బీఎస్పీ.. ఉన్నా.. పోటీ చేస్తామ‌ని అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌క‌టించ‌లేదు. అయితే.. అందరికీ కూడా సెంటిమెంటు ఇక్క‌డ ముంద‌రి కాళ్ల‌కు బంధం వేస్తోంది. ఎస్సీ వ‌ర్గానికి చెందిన వెంక‌ట సుబ్బ‌య్య మ‌ర‌ణం త‌ర్వాత‌.. ఆయ‌న స‌తీమ‌ణినే ఇక్క‌డ వైసీపి నిల‌బెట్ట‌డంతో .. తాము పోటీ చేస్తే.. ఎస్సీ వ‌ర్గంపై.. ఎస్సీలే పోటీ చేస్తున్నార‌ని.. క‌నీసం సింప‌తీ కూడా చూపించ‌డం లేద‌నే వాద‌న బ‌లంగా బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

ఈ నేప‌థ్యంలో బీఎస్పీ త‌ప్పుకొనే ఛాన్స్ ఉంటుంద‌ని అంటున్నారు. ఇక‌, బీజేపీ ఒక్క‌టే బ‌రిలో నిలిచినా.. పోటీ వ‌ర‌కు ప‌రిస్థితి ఉండ‌ద‌ని అంటున్నారు..మొత్తానికి చంద్ర‌బాబు తీసుకున్న ఒక్క నిర్ణ‌యం.. వైసీపీ నేత‌ల‌కు ప‌నిలేకుండా చేసింద‌నే టాక్‌రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

6 minutes ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

43 minutes ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

50 minutes ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

1 hour ago

ప‌ద్మ అవార్డులు అడిగి ఇస్తారా?

దేశ అత్యున్న‌త పౌర పుర‌స్కారాలైన ప‌ద్మ అవార్డుల‌ను ఎంత ప్రతిష్ఠాత్మ‌కంగా భావిస్తారో తెలిసిందే. ప్ర‌తిసారీ అవార్డులు ప్ర‌క‌టించిన‌పుడు గ్ర‌హీత‌ల అర్ఙ‌త‌ల…

2 hours ago

అంబానీ ఆసుప‌త్రికి ప‌వ‌న్ క‌ల్యాణ్‌… ఏం జ‌రిగింది?

జ‌న‌సేన పార్టీ అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మ‌రోసారి ఆసుప‌త్రిలో చేరారు. 40 రోజుల కింద‌ట‌ ఆయ‌న…

2 hours ago