Political News

బిగ్ బ్రేకింగ్‌: బ‌ద్వేల్ జ‌న‌సేన అభ్య‌ర్థి ఖ‌రారు..?


ఏపీలోని కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో ఎలాంటి ట్విస్టులు ఉండ‌వ‌ని అనుకుంటే… అదిరిపోయే ట్విస్టులు చోటు చేసుకునే వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ఇక్క‌డ వైసీపీ నుంచి దివంగ‌త మాజీ ఎమ్మెల్యే డాక్ట‌ర్ వెంక‌ట సుబ్బ‌య్య స‌తీమ‌ణి సుధ పోటీలో ఉంటున్నారు. ఇక టీడీపీ నుంచి గ‌త ఎన్నిక‌ల‌లో పోటీ చేసి ఓడిపోయిన ఓబులాపురం రాజ‌శేఖ‌ర్ మ‌రోసారి బ‌రిలో ఉంటున్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే క‌మ‌ల‌మ్మ పేరు ఖ‌రారైంది.

ఇక జ‌న‌సేన – బీజేపీ పొత్తులో ఉండ‌డంతో ఈ రెండు పార్టీల్లో ఏ పార్టీ అభ్య‌ర్థి బ‌ద్వేల్ బ‌రిలో ఉంటారా ? అని నిన్న‌టి వ‌ర‌కు కాస్త స‌స్పెన్స్ నెల‌కొంది. క‌డ‌ప జిల్లాలో ఈ ఉప ఎన్నిక జ‌రుగుతూ ఉండ‌డం.. ఇక్క‌డ బీజేపీకి నుంచి బ‌ల‌మైన నేత‌లుగా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డితో పాటు సీఎం ర‌మేష్ లాంటి వాళ్లు ఉండ‌డంతో బీజేపీ అటూ ఇటూ తిప్పేసి తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లోలా మ‌రోసారి త‌మ పార్టీ అభ్య‌ర్థినే పోటీ పెడుతుంద‌నే అంద‌రూ అనుకుంటున్నారు.

అయితే ఇంత‌లోనే జ‌న‌సేన ఇక్క‌డ ట్విస్ట్ ఇచ్చింది. ఈ ఎన్నిక‌లో బ‌రిలో నిల‌వాల‌ని జనసేన పార్టీ యోచిస్తోంది. జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా విజయజ్యోతిని బరిలోకి దించ‌నున్న‌ట్లు స‌మాచారం వ‌స్తోంది. విజ‌య‌జ్యోతి గ‌తంలో బ్యాంక్ ఆఫీస‌ర్‌గా ప‌నిచేశారు. 2014 ఎన్నిక‌ల‌లో ఆమె టీడీపీ నుంచి ఇక్క‌డ పోటీ చేసి జ‌య‌రాములు చేతిలో ఓడిపోయారు. త‌ర్వాత జ‌య‌రాములు టీడీపీలోకి జంప్ చేయ‌డంతో ఆమెకు అక్క‌డ ప్రాధాన్య‌త ఇవ్వ‌లేదు. దీంతో ఆమె గ‌త ఎన్నిక‌ల‌లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఇప్పుడు జ‌న‌సేన అక్క‌డ నుంచి త‌మ పార్టీ త‌ర‌పున విజ‌య‌జ్యోతిని రంగంలోకి దింపేలా ఒప్పించే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది.

జ‌న‌సేన రాష్ట్ర నాయ‌కులు కొంద‌రు విజ‌య‌జ్యోతికి ఫోన్ చేసి జ‌న‌సేన తర‌పున పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాల‌ని చెప్పార‌ట‌. అయితే నియోజ‌క‌వ‌ర్గంలో కొంత ప‌ట్టున్న ఆమె త‌న అనుచ‌రుల‌తో చ‌ర్చించి త‌న నిర్ణ‌యం చెపుతాన‌ని అన్న‌ట్టు కూడా తెలిసింది. మ‌రి జ‌నసేన బీజేపీతో చ‌ర్చించాక త‌మ పార్టీ త‌ర‌పున అభ్య‌ర్థిని నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేస్తుందా ? లేదా సొంత నిర్ణ‌యం తీసుకుందా ? అన్న‌ది తెలియాలి. ఏదేమైనా మ‌ళ్లీ ఇక్క‌డ బీజేపీయే పోటీ చేయాల‌ని అనుకుంటోన్న స‌మ‌యంలో జ‌న‌సేన ఇలా దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం బీజేపీకి కాస్త షాక్ లాంటిదే.

అయితే ప‌వ‌న్ ఎప్ప‌టి లాగానే ముందు హ‌డావిడి చేసి.. చివ‌ర్లో బీజేపీకి బెండ్ అయిపోతారేమో కూడా చూడాలి. ఇక మ‌రోవైపు వైసీపీ అభ్యర్థిగా పోటీలో నిలుస్తున్న‌ సుధను గెలిపించ‌డానికి ఆ పార్టీ అధిష్ఠానం ప‌లువురికి బాధ్య‌త‌లు అప్ప‌గించింది. ఇప్ప‌టికే బ‌ద్వేలులో వైసీపీ నేత‌లు ప్ర‌చారం ప్రారంభించారు.

Satya

Recent Posts

వాయిస్ మెసేజ్‌తోనూ FIR… భళా బాబు గారు

పోలీసు స్టేష‌న్ల‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవ‌స‌రం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్‌ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…

4 hours ago

రాజు గారి స్థలంలో వైసీపీ కార్యాలయమా…?

ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…

4 hours ago

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

5 hours ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

6 hours ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

6 hours ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

6 hours ago