Political News

పాదయాత్రతో బండి ఏం సాధించారు ?

బీజేపీ తెలంగాణా చీఫ్ బండి సంజయ్ పాదయాత్రతో ఏమి సాధించారో అర్ధం కావటంలేదు. మామూలుగా ఎవరైనా పాదయాత్ర చేశారంటే ప్రజల బాధలు వ్యక్తిగతంగా తెలుసుకునేందుకు, పరిష్కార మార్గాలు చర్చించేందుకే. తాము అధికారంలోకి వస్తే ప్రజా సమస్యలను పరిష్కారిస్తామని భరోసా ఇవ్వటం మామూలే. గతంలో పాదయాత్ర సందర్భంగా వైఎస్సార్, చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి చేసిందిదే. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి చేశారనేది వేరే విషయం.

అయితే తాజాగా బండి సంజయ్ చేసిన 36 రోజల 438 కిలోమీటర్ల పాదయాత్ర మొదటిదశ ఈరోజు ముగుస్తోంది. సిద్ధిపేట జిల్లాలోని హుస్నాబాద్ లో ముగింపుసభ జరగబోతోంది. బండి పాదయాత్ర 8 జిల్లాలు, 6 లోక్ సభ నియోజకవర్గాలు, 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగింది. రెండోదశ పాదయాత్ర ఎప్పుడు ప్రారంభిస్తారో ఇంకా ప్రకటించలేదు. సరే ఎప్పుడు చేసినా, ఎప్పుడు ముగించినా ఒకటే అనే అభిప్రాయం జనాల్లో ఉంది.

ఎందుకంటే బండి పాదయాత్ర కేసీయార్ పాలనకు వ్యతిరేకంగా చేశారన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకవైపు రాష్ట్రాన్ని కేసీయార్ అధంకారంలోకి నెట్టేస్తున్నారని ఆరోపణలు చేస్తున్న బండి కేంద్రంనుండి రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలను రాబట్టడంలో మాత్రం ఫెయిలవుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రంలోని నరేంద్రమోడి సర్కార్ ఏ విధంగా దెబ్బకొడుతుందో మంత్రులు, టీఆర్ఎస్ నేతలు ఉదాహరణలతో సహా చెబుతున్నారు.

హనుమకొండకు శాంక్షన్ అయిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తర్వాత మహారాష్ట్రకు తరలిపోయింది. రాష్ట్రంలో రైల్వేలైన్ల ఏర్పాటు నత్తనడక నడుస్తోంది. రాష్ట్ర విభజనలో భాగంగా తెలంగాణాకు అప్పటి యూపీఏ ప్రభుత్వం కేటాయించిన ఐటిఐఆర్ సంస్ధ ఏమైందో కూడా తెలీదు. ఇలాంటి అనేక హామీలను కేంద్రం ఒకవైపు తుంగలో తొక్కుతుంటే మరోవైపు బీజేపీ అధ్యక్షుడు పాదయాత్ర చేసినందు వల్ల ఉపయోగం ఏమిటో అర్ధం కావటంలేదు.

కేంద్రం నుండి తెలంగాణాకు రావాల్సిన ప్రయోజనాలు, నిధులను రాబడుతుంటే బండి సజయ్ పాదయాత్రక జనాల మద్దతు లభిస్తుంది. అలా కాకుండా కేంద్రం నుండి తెలంగాణాకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించటం మానేసి ఎంతసేపు కేసీయార్ ను మాత్రమే టార్గెట్ చేస్తామంటే జనాలు అంగీకరించరని కమలనాదులు గ్రహించాలి.

This post was last modified on October 2, 2021 10:58 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

3 hours ago

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

3 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

4 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

4 hours ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

5 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

6 hours ago