Political News

వైసీపీ నేత‌ల్లో క‌ట్ట‌లు తెగిన‌ అస‌హ‌నం… ఆపినా ఆగ‌రా ?


ఒక‌రిలో ఆగ్ర‌హం వ‌స్తే.. స‌రే.. ఏదైనా లోపం జ‌రిగి ఉంటుద‌ని అనుకోవ‌చ్చు. కానీ, ఒక‌రు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా.. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఎమ్మెల్యేల్లో చాలా మంది అస‌హ‌నంతో ర‌గిలిపోతున్నారు. దీంతో ఇప్పుడు వారిని స‌ర్దుబాటు చేయ‌డం.. ప‌రిస్థితిని చ‌క్క‌దిద్ద‌డం వంటివి అధికార పార్టీకి త‌ల‌నొప్పిగా మారింది. నెల్లూరు జిల్లా నుంచి అనంత‌పురం వ‌ర‌కు చాలా మంది ఎమ్మెల్యేలు.. ప‌నులు జ‌ర‌గ‌డం లేద‌ని.. నిధులు ఇవ్వ‌డం లేద‌ని.. ర‌గిలిపోతున్నారు. తాజాగా నెల్లూరుకు చెందిన మాజీ మంత్రి, ప్ర‌స్తుత ఎమ్మెల్యే ఆనం రామనారాయ‌ణ రెడ్డి ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు.

ప‌రోక్షంగా ఆయ‌న ప్ర‌భుత్వ వైఖ‌రిని బ‌హిరంగంగానే దుయ్య‌బ‌ట్టారు. చేసిన‌పనులకు ఇంకా నిధులు ఇవ్వ‌లేద‌ని.. మ‌రోసారి కొత్త‌గా ప‌నులు ఎలా ప్రారంభిస్తామ‌ని.. అధికారులపై ఒత్తిడి తీసుకువ‌స్తే.. వాళ్లు మాత్రం ఎలా ప‌నులు చేస్తార‌ని.. ప్ర‌శ్నించారు. స‌రే.. ఆనం వ్యాఖ్య‌ల‌పై పెద్ద‌గా రియాక్ష‌న్ రాలేదు. దీనికి కార‌ణం.. ఆయ‌న ఎప్పటి నుంచో అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. కానీ, మ‌రో నాయ‌కుడు.. జ‌గ‌న్‌కు అత్యంత వీర విధేయుడుగా ఉన్న నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి కూడా ఇదే రేంజ్‌లో విరుచుకుప‌డ్డారు.

గ‌డిచిన ఏడాది కాలంగా.. నిధులు ఇవ‌వ్వ‌డం లేద‌ని.. త‌ననియోజ‌క‌వ‌ర్గంలో చేసిన ప‌నుల‌కు సంబంధించి ప్ర‌భుత్వం నుంచి కోట్ల రూపాయ‌లు రావాల్సి ఉంద‌ని.. అవి ఇవ్వ‌కుండా.. కొత్త‌గా ప‌నులు చేప‌ట్టాలంటే.. ఎవ‌రు మాత్రం ముందుకు వ‌స్తార‌ని .. ఆయ‌న ప్ర‌శ్నించారు. అస‌లు కాంట్రాక్ట‌ర్లు కూడా ప‌నులు చేసేందుకు ముందుకు రావ‌డం లేద‌ని.. ఈ విష‌యాన్ని పెద్ద‌లు ఆలోచించుకోవాల‌ని చెప్పారు. గుంటూరు జిల్లాకు చెందిన వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు కూడా గ‌తంలో అధికారులు అస్స‌లు మాట విన‌డం లేద‌ని.. ఇలా అయితే తాము అధికారంలో ఉండి కూడా ఎలా త‌లెత్తుకుని తిరుగుతామ‌ని ప్ర‌శ్నించారు.

ఇక‌, అనంత‌పురంలోనూ కొన్ని రోజుల కింద‌ట ఇలాంటి ఘ‌ట‌నే చోటు చేసుకుంది. ఈ ప‌రిణామాలు చూస్తే.. నిజంగానే ప్ర‌భుత్వం నుంచి నిధులు ఆగిన‌ప్ప‌టికీ.. మేనేజ్ చేసుకునే స‌త్తా ఎమ్మెల్యేల‌కు లేదా? అనేది ప్ర‌శ్న‌. కానీ.. వారి అస‌హ‌నం వేరే ఉంద‌ని.. త‌మ‌కు ప్ర‌భుత్వం నుంచి జ‌గ‌న్ నుంచి కూడా గుర్తింపు ఉండ‌డం లేద‌ని.. వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నార‌ని.. అందుకే ఇలా వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇలాంటి వారిని స‌ర్దుబాటు చేయ‌డం జ‌గ‌న్‌కు క‌ష్ట‌మేన‌ని చెబుతున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on October 1, 2021 10:28 am

Share

Recent Posts

రోమియో ఫిక్సయ్యాడు… ఓజి లేటవుతాడు

నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…

2 hours ago

ఉత్త‌రాదిన మోడీ ఇమేజ్‌కు యూత్ చెక్ పెడుతున్నారా?

దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం ఉన్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఉత్త‌రాది రాష్ట్రాల్లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఇమేజ్‌కు యువ‌త పెద్ద ఎత్తున…

2 hours ago

మంగాపురం కుర్రాడికి మంగళవారం పాఠం

సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ డెబ్యూ ఫలితం తేలిపోయింది. కుర్రాడి నటనకు కాసిన్ని ప్రశంసలు దక్కినప్పటికీ కంటెంట్ పరంగా…

3 hours ago

అప్పుడు ఒప్పు.. ఇప్పుడు తప్పు.. ఇదేం న్యాయం జగన్?

త్వ‌ర‌లోనే ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు తెర‌దీయ‌నున్నారు. సెప్టెంబ‌రు-అక్టోబ‌రు మ‌ధ్య మునిసిపాలిటీ… న‌వంబ‌రు-డిసెంబ‌రు మ‌ధ్య కార్పోరేష‌న్లు, జ‌న‌వ‌రిలో పంచాయ‌తీ ఎన్నిక‌లు…

3 hours ago

సెలెక్టర్లకు షమీ కనపడడం లేదా?

శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్…

3 hours ago

మార్క్ మామా… మోదీజీకి సారీ చెప్పాల్సిందే

ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్‌బుక్ నుంచి తొలగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా…

4 hours ago