Political News

వైసీపీ నేత‌ల్లో క‌ట్ట‌లు తెగిన‌ అస‌హ‌నం… ఆపినా ఆగ‌రా ?


ఒక‌రిలో ఆగ్ర‌హం వ‌స్తే.. స‌రే.. ఏదైనా లోపం జ‌రిగి ఉంటుద‌ని అనుకోవ‌చ్చు. కానీ, ఒక‌రు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా.. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఎమ్మెల్యేల్లో చాలా మంది అస‌హ‌నంతో ర‌గిలిపోతున్నారు. దీంతో ఇప్పుడు వారిని స‌ర్దుబాటు చేయ‌డం.. ప‌రిస్థితిని చ‌క్క‌దిద్ద‌డం వంటివి అధికార పార్టీకి త‌ల‌నొప్పిగా మారింది. నెల్లూరు జిల్లా నుంచి అనంత‌పురం వ‌ర‌కు చాలా మంది ఎమ్మెల్యేలు.. ప‌నులు జ‌ర‌గ‌డం లేద‌ని.. నిధులు ఇవ్వ‌డం లేద‌ని.. ర‌గిలిపోతున్నారు. తాజాగా నెల్లూరుకు చెందిన మాజీ మంత్రి, ప్ర‌స్తుత ఎమ్మెల్యే ఆనం రామనారాయ‌ణ రెడ్డి ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు.

ప‌రోక్షంగా ఆయ‌న ప్ర‌భుత్వ వైఖ‌రిని బ‌హిరంగంగానే దుయ్య‌బ‌ట్టారు. చేసిన‌పనులకు ఇంకా నిధులు ఇవ్వ‌లేద‌ని.. మ‌రోసారి కొత్త‌గా ప‌నులు ఎలా ప్రారంభిస్తామ‌ని.. అధికారులపై ఒత్తిడి తీసుకువ‌స్తే.. వాళ్లు మాత్రం ఎలా ప‌నులు చేస్తార‌ని.. ప్ర‌శ్నించారు. స‌రే.. ఆనం వ్యాఖ్య‌ల‌పై పెద్ద‌గా రియాక్ష‌న్ రాలేదు. దీనికి కార‌ణం.. ఆయ‌న ఎప్పటి నుంచో అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. కానీ, మ‌రో నాయ‌కుడు.. జ‌గ‌న్‌కు అత్యంత వీర విధేయుడుగా ఉన్న నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి కూడా ఇదే రేంజ్‌లో విరుచుకుప‌డ్డారు.

గ‌డిచిన ఏడాది కాలంగా.. నిధులు ఇవ‌వ్వ‌డం లేద‌ని.. త‌ననియోజ‌క‌వ‌ర్గంలో చేసిన ప‌నుల‌కు సంబంధించి ప్ర‌భుత్వం నుంచి కోట్ల రూపాయ‌లు రావాల్సి ఉంద‌ని.. అవి ఇవ్వ‌కుండా.. కొత్త‌గా ప‌నులు చేప‌ట్టాలంటే.. ఎవ‌రు మాత్రం ముందుకు వ‌స్తార‌ని .. ఆయ‌న ప్ర‌శ్నించారు. అస‌లు కాంట్రాక్ట‌ర్లు కూడా ప‌నులు చేసేందుకు ముందుకు రావ‌డం లేద‌ని.. ఈ విష‌యాన్ని పెద్ద‌లు ఆలోచించుకోవాల‌ని చెప్పారు. గుంటూరు జిల్లాకు చెందిన వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు కూడా గ‌తంలో అధికారులు అస్స‌లు మాట విన‌డం లేద‌ని.. ఇలా అయితే తాము అధికారంలో ఉండి కూడా ఎలా త‌లెత్తుకుని తిరుగుతామ‌ని ప్ర‌శ్నించారు.

ఇక‌, అనంత‌పురంలోనూ కొన్ని రోజుల కింద‌ట ఇలాంటి ఘ‌ట‌నే చోటు చేసుకుంది. ఈ ప‌రిణామాలు చూస్తే.. నిజంగానే ప్ర‌భుత్వం నుంచి నిధులు ఆగిన‌ప్ప‌టికీ.. మేనేజ్ చేసుకునే స‌త్తా ఎమ్మెల్యేల‌కు లేదా? అనేది ప్ర‌శ్న‌. కానీ.. వారి అస‌హ‌నం వేరే ఉంద‌ని.. త‌మ‌కు ప్ర‌భుత్వం నుంచి జ‌గ‌న్ నుంచి కూడా గుర్తింపు ఉండ‌డం లేద‌ని.. వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నార‌ని.. అందుకే ఇలా వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇలాంటి వారిని స‌ర్దుబాటు చేయ‌డం జ‌గ‌న్‌కు క‌ష్ట‌మేన‌ని చెబుతున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on October 1, 2021 10:28 am

Share
Show comments

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

2 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

3 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

7 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

8 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

8 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

9 hours ago