Political News

వైసీపీ నేత‌ల్లో క‌ట్ట‌లు తెగిన‌ అస‌హ‌నం… ఆపినా ఆగ‌రా ?


ఒక‌రిలో ఆగ్ర‌హం వ‌స్తే.. స‌రే.. ఏదైనా లోపం జ‌రిగి ఉంటుద‌ని అనుకోవ‌చ్చు. కానీ, ఒక‌రు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా.. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఎమ్మెల్యేల్లో చాలా మంది అస‌హ‌నంతో ర‌గిలిపోతున్నారు. దీంతో ఇప్పుడు వారిని స‌ర్దుబాటు చేయ‌డం.. ప‌రిస్థితిని చ‌క్క‌దిద్ద‌డం వంటివి అధికార పార్టీకి త‌ల‌నొప్పిగా మారింది. నెల్లూరు జిల్లా నుంచి అనంత‌పురం వ‌ర‌కు చాలా మంది ఎమ్మెల్యేలు.. ప‌నులు జ‌ర‌గ‌డం లేద‌ని.. నిధులు ఇవ్వ‌డం లేద‌ని.. ర‌గిలిపోతున్నారు. తాజాగా నెల్లూరుకు చెందిన మాజీ మంత్రి, ప్ర‌స్తుత ఎమ్మెల్యే ఆనం రామనారాయ‌ణ రెడ్డి ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు.

ప‌రోక్షంగా ఆయ‌న ప్ర‌భుత్వ వైఖ‌రిని బ‌హిరంగంగానే దుయ్య‌బ‌ట్టారు. చేసిన‌పనులకు ఇంకా నిధులు ఇవ్వ‌లేద‌ని.. మ‌రోసారి కొత్త‌గా ప‌నులు ఎలా ప్రారంభిస్తామ‌ని.. అధికారులపై ఒత్తిడి తీసుకువ‌స్తే.. వాళ్లు మాత్రం ఎలా ప‌నులు చేస్తార‌ని.. ప్ర‌శ్నించారు. స‌రే.. ఆనం వ్యాఖ్య‌ల‌పై పెద్ద‌గా రియాక్ష‌న్ రాలేదు. దీనికి కార‌ణం.. ఆయ‌న ఎప్పటి నుంచో అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. కానీ, మ‌రో నాయ‌కుడు.. జ‌గ‌న్‌కు అత్యంత వీర విధేయుడుగా ఉన్న నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి కూడా ఇదే రేంజ్‌లో విరుచుకుప‌డ్డారు.

గ‌డిచిన ఏడాది కాలంగా.. నిధులు ఇవ‌వ్వ‌డం లేద‌ని.. త‌ననియోజ‌క‌వ‌ర్గంలో చేసిన ప‌నుల‌కు సంబంధించి ప్ర‌భుత్వం నుంచి కోట్ల రూపాయ‌లు రావాల్సి ఉంద‌ని.. అవి ఇవ్వ‌కుండా.. కొత్త‌గా ప‌నులు చేప‌ట్టాలంటే.. ఎవ‌రు మాత్రం ముందుకు వ‌స్తార‌ని .. ఆయ‌న ప్ర‌శ్నించారు. అస‌లు కాంట్రాక్ట‌ర్లు కూడా ప‌నులు చేసేందుకు ముందుకు రావ‌డం లేద‌ని.. ఈ విష‌యాన్ని పెద్ద‌లు ఆలోచించుకోవాల‌ని చెప్పారు. గుంటూరు జిల్లాకు చెందిన వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు కూడా గ‌తంలో అధికారులు అస్స‌లు మాట విన‌డం లేద‌ని.. ఇలా అయితే తాము అధికారంలో ఉండి కూడా ఎలా త‌లెత్తుకుని తిరుగుతామ‌ని ప్ర‌శ్నించారు.

ఇక‌, అనంత‌పురంలోనూ కొన్ని రోజుల కింద‌ట ఇలాంటి ఘ‌ట‌నే చోటు చేసుకుంది. ఈ ప‌రిణామాలు చూస్తే.. నిజంగానే ప్ర‌భుత్వం నుంచి నిధులు ఆగిన‌ప్ప‌టికీ.. మేనేజ్ చేసుకునే స‌త్తా ఎమ్మెల్యేల‌కు లేదా? అనేది ప్ర‌శ్న‌. కానీ.. వారి అస‌హ‌నం వేరే ఉంద‌ని.. త‌మ‌కు ప్ర‌భుత్వం నుంచి జ‌గ‌న్ నుంచి కూడా గుర్తింపు ఉండ‌డం లేద‌ని.. వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నార‌ని.. అందుకే ఇలా వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇలాంటి వారిని స‌ర్దుబాటు చేయ‌డం జ‌గ‌న్‌కు క‌ష్ట‌మేన‌ని చెబుతున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on October 1, 2021 10:28 am

Share
Show comments

Recent Posts

ఏపీలో ఎన్నికల కోలాహ‌లం.. ఎప్పుడైనా?!

దాదాపు రెండేళ్ల త‌ర్వాత‌.. ఏపీలో మ‌రోసారి ఎన్నిక‌ల‌కు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయ‌తీ స‌హా.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు…

1 hour ago

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

9 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

10 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

10 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

12 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

12 hours ago