Political News

షర్మిలతో పీకే టీం భేటీ

రాజకీయ పార్టీలకు రాజగురువులు, గాద్ ఫాదర్‌లు ఉన్నప్పటికీ రాజకీయ వ్యూహకర్తలను ఆశ్రయిస్తున్నారు. తమకు ఉన్న బ్యాక్ గ్రౌండ్ పాటు వ్యూహకర్తల విధానాలతో సునాయాసంగా విజయం సాధిస్తున్నారని భావిస్తున్నారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న వాళ్లు సైతం ప్రశాంత్ కిషోర్ లాంటి వారి కోసం పోటీపడుతున్నారు. రాజకీయ నాయకులు కూడా సిద్ధాంతాలను మరచిపోయారు. ప్రజా సమస్యలను ప్రస్తావించి, పోరాటాలు చేయడం మరచిపోయారు. వ్యూహకర్తలో కోట్లలో ఖర్చు చేస్తున్నారు. సీఎం పీఠం దక్కాలి కానీ కోట్లు ఓ లెక్కనా అనుకుంటున్నారో ఏమో.. ఖర్చుకోసం ఏమాత్రం పార్టీలు వెనుకాడడం లేదు.

ఇక తెలంగాణ ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల కూడా వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహాలతో ముందుకు పోవాలని నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నట్లుగానే పీకీ టీం తెలంగాణలోకి ఎంట్రీ కాబోతోంది. ఈ నేపథ్యంలోన బుధవారం లోటస్ పాండ్‌లో షర్మిలతో పీకే టీం సభ్యులు సమావేశమయ్యారు. పార్టీ విస్తరణ, పాదయాత్ర, పార్టీ బలోపేతం తదితర అన్ని అంశాలపై ఈ టీంతో షర్మిల చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇక నుంచి ప్రశాంత్‌కిషోర్ సలహాలతోనే షర్మిల అడుగులు వేస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల తర్వాత తాను ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయబోనని పీకే స్పష్టం చేశారు. ఐతే, అంతకుముందే, షర్మిలతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఆమె పార్టీతో పీకే బృందం పనిచేయబోతోందని సమాచారం.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉండగానే పార్టీతో ప్రజల్లోకి వెళ్లాలని షర్మిల ప్లాన్ చేస్తున్నారు. పార్టీ విధివిధానాలు, పార్టీ జెండా, అజెండా తదితరాలపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. షర్మిల అక్టోబరు 18న చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఈ పాదయాత్రపై ఇప్పటికే పీకే టీంతో షర్మిల సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది. పాదయాత్రలో ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియాలో ఎలా ప్రచారం చేయాలనే దానిపై ఇప్పటికే పీకే టీం కసరత్తు చేసినట్లు సమాచారం. తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004 ఎన్నికల ముందు చేవెళ్ల నుంచే పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఏపీలో ప్రశాంత్ కిషోర్ వైసీపీకి ఘన విజయం కట్టబెట్టిన విజయం తెలిసిందే. వైసీపీ తరఫున ఐ-ప్యాక్ తమ ప్రచారాన్ని మే, 2017లో ప్రారంభించింది. 709 రోజులు తమ ప్రణాళికల్ని అమలు చేసింది. మొత్తం 17 ప్రధాన ప్రచార కార్యక్రమాలను నిర్వహించింది. అందులో 13 ప్రచార కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో నిర్వహించారు. ఐ-ప్యాక్ తన ప్రచారానికి మొదటి అస్త్రంగా క్షేత్ర స్థాయిలో వైసీపీ బూత్ క్యాడర్‌ని బలోపేతం చేసింది. అదే విధంగా పార్టీ కార్యకర్తలకు శిక్షణ ఇస్తూ వారికి మార్గనిర్దేశం చేసింది. పక్కా ప్రణాళికతో సరైన వ్యూహాన్ని అమలు చేయడం వల్లే పార్టీ ఘన విజయం సాధించింది.

Satya

Recent Posts

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

1 hour ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

2 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

2 hours ago

పుత్రోత్సాహం కోరుతున్న నందమూరి ఫ్యాన్స్

రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…

4 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

6 hours ago

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

12 hours ago