సెన్సేషనలిషజమే ఊపిరిగా బతికే రామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడు ఏ సినిమా ప్రకటిస్తాడో తెలీదు. ఎలాంటి కాన్సెప్ట్ను ఎంచుకుని ఎవరిని కంగారు పెడతాడో అర్థం కాదు. ఆల్రెడీ ఎన్టీఆర్, జగన్ల జీవితాలను తెరకెక్కించాడు. తర్వాత శశికళ లాంటి కొందరిపై సినిమాలను ప్రకటించాడు. ఇప్పుడు కొండా వారి ఫ్యామిలీని టార్గెట్ చేశాడు. వరంగల్ రాజకీయాల్లో అత్యంత కీలక వ్యక్తులైన కొండా మురళి, సురేఖల ప్రేమకథని, వారి రాజకీయ జీవితాన్ని చూపిస్తానంటూ ‘కొండా’ టైటిల్తో కొత్త సినిమాని ప్రకటించాడు వర్మ.
ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియోలో తన వాయిస్తో ఇంట్రడక్షన్ ఇచ్చాడు వర్మ. తాను విన్న విషయాల్లో ఎన్కౌంటర్లో చంపేయబడ్డ ఆర్కేకి, కొండా మురళికి ఉన్న సంబంధం చాలా ఆసక్తిగా అనిపించిందని, అప్పటి పరిస్థితుల్ని సినిమాగా తీయడానికి మురళిని కలిసి కో ఆపరేట్ చేయమని కూడా అడిగానని, ఆయన కూడా ఒప్పుకున్నాడని వర్మ చెప్పాడు. ‘గాంధీ లెక్క రెండో చెంప జూపెట్ట నేను.. చంపేస్తా.. అర్థం కాలే’ అనే క్యాప్షన్తో కాన్సెప్ట్పై ఆసక్తిని పెంచాడు.
తాను తీస్తున్నది సినిమా కాదని, తెలంగాణలో జరిగిన ఓ రక్త చరిత్రని అంటున్నాడు వర్మ. ఈ చిత్ర విప్లవం అతి త్వరలో మొదలు కాబోతోంది అంటూ క్యూరియాసిటీని రేపే ప్రయత్నం చేశాడు. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని తెరకెక్కించడంలో వర్మ ఎంత సిన్సియర్గా ఉంటాడో అందరికీ తెలిసిందే. దాంతో కొండా వారి జీవితాల్ని ఎలా చూపించబోతున్నాడో, మురళి, సురేఖ పాత్రలకు ఎవరిని తీసుకుంటాడోననే ఆసక్తి కలుగుతోంది.
This post was last modified on September 27, 2021 12:51 pm
నాలుగు నెలల క్రితం జన నాయకుడు వాయిదా పడినప్పుడు అభిమానులు తెగ కలవరపడ్డారు. సెన్సార్ వివాదాల వల్ల ఎప్పుడు వస్తుందో…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి గంటలో ఆసక్తికర…
తమిళనాడు ఎన్నికల ముంగిట రాజకీయాలతో సంబంధం లేని ఒక వ్యక్తి పేరు బాగా చర్చనీయాంశం అయిందే. ఆ పేరు ఇంకేదో…
ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ ఏర్పడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పశ్చిమ…
గత శుక్రవారం జెట్లీ అనే సినిమా రిలీజైంది. అది కమెడియన్ సత్య హీరోగా పరిచయం అయిన సినిమా. అయినా సరే..…
ఒకప్పుడు తెలుగు సినిమాల మీద తమిళ చిత్రాలు స్పష్టమైన ఆధిపత్యం చూపించేవి. అక్కడ ఎంతోమంది మేటి దర్శకులు ఉండేవాళ్లు. కొత్త…