Political News

జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్.. అవసరమైతే సాయం చేస్తాం

‘గులాబ్’ గుబులు ఏపీలో మొదలైంది. గులాబ్ తుఫాను వల్ల ఉత్తరాంధ్రకు తుఫాన్‌ ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

శనివారం వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా మారిందని అధికారులు తెలిపారు. దీనికి పాకిస్థాన్‌ ‘గులాబ్‌’ (గుల్‌-ఆబ్‌) అనే పేరు పెట్టింది. ఆదివారం సాయంత్రం కళింగపట్నం- గోపాల్‌పూర్‌ (ఒడిసా) మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తరాంధ్రపై తుఫాన్‌ తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించింది.

ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. గులాబ్ తుఫాన్‌ పరిస్థితులపై ప్రధాని మోదీ ఆరా తీసినట్లు తెలుస్తోంది. కేంద్రం నుంచి కావాల్సిన సహకారం అందిస్తామని జగన్‌కు ప్రధాని హామీ ఇచ్చారు. ప్రజలంతా క్షేమంగా ఉండాలని మోదీ ఆకాంక్షించారు. వాస్తవానికి ఈ రోజు జగన్ ఢిల్లీ ఉండాల్సి ఉంది.

ఈ రోజు దేశ రాజధానితో మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్రమంత్రి అమిత్‌షా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించారు. ఢిల్లీ పర్యటన ముందు ఆయన వ్యాయామం చేస్తూ కింద పడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆయన కాలు బెనికినట్లు చెబుతున్నారు. వైద్యుల సూచనల మేరకు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. జగన్ స్థానంలో రాష్ట్ర హోం మంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్ ఢిల్లీ వెళ్లారు.

అయితే సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచే తుఫాను సహాయ చర్యలను జగన్ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. సహాయ చర్యలకు ఉపక్రమించింది. శ్రీకాకుళం జిల్లాలో ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను తరలించారు. బారువ తీర ప్రాంత గ్రామాల్లో ఎస్పీ అమిత్ బర్దార్ పర్యటించారు. జిల్లాలో 75 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాను తీరంవైపు కదులుతూ ఆందోళనకు గురిచేస్తోంది.

వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గులాబ్‌ తుఫాన్‌ కొనసాగుతోంది. గోపాలపూర్‌కు 140 కిలోమీటర్లు, కళింగపట్నానికి 190 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఉత్తరాంధ్రలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు పడుతాయని అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురుస్తామని అధికారులు తెలిపారు.

This post was last modified on September 26, 2021 6:02 pm

Share

Recent Posts

హాలీవుడ్ సినిమాలకు మళ్ళీ మంచి రోజులు

ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…

14 minutes ago

గండాన్ని దాటిన చెన్నై లవ్ స్టోరీ

గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…

27 minutes ago

మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగాలని ఉంది: నటుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…

36 minutes ago

కనకరాజు సీమలో కొరియన్ దెయ్యం

బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…

1 hour ago

దేశం కోసం కష్టపడే ప్రధాని మోదీపై విమర్శలా

జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…

2 hours ago

మోదీని యువత తిడుతుంటే పవన్ కంట్లో నీళ్లు తిరిగాయి

బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…

3 hours ago