ఏపీలో మరో రగడ తెరమీదికి వచ్చింది. అది కూడా హిందూ ఆలయాలకు సంబంధించే కావడంతో ఇప్పు డు ఈ చర్చ జోరుగా సాగుతోంది. విషయం ఏంటంటే.. మరో వారం రోజుల్లో దేశవ్యాప్తంగా దసరా శరన్నవ రాత్రులు ప్రారంభం కానున్నాయి. ఇది అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకునే రోజులు. అదే సమయంలో జాతరలు, ఉత్సవాలు కూడా చేసుకుంటారు. శక్తి స్వరూపిణిగా ప్రతి ఇల్లూ అమ్మ వారికి ఆహ్వానం పలుకుతుంది. అదే సమయంలో ఆలయాల్లో అయితే.. మరింత ఎక్కువగా నిత్య పూజలు, నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తారు.
అయితే.. మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా దసరా ఉత్సవాలపై ప్రభుత్వ వ్యూహాన్ని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ నవరాత్రులను ఇంటిలోనే నిర్వహించుకోవాలన్నారు. అంతేకాదు.. ఏ ప్రజాప్రతినిధీ కూడా అమ్మవారి ఉత్సవాలను బహిరంగంగా చేయాలని అనుకోవడం లేదని.. చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కరోనా ఉందని.. అమ్మవారికి కూడా ఈ విషయం తెలుసని అన్నారు. దీనిని బట్టి.. దసరా సరదా కూడా ఏపీ ప్రజలకు లేకుండా పోతోందన్న మాట.
వాస్తవానికి రాష్ట్రంలో వైసీపీ సర్కారు వచ్చిన తర్వాత.. హిందూ ఆలయాలపై దాడులు జరిగాయనే వాదన ఉంది. దీనిపై అన్ని రాజకీయ పక్షాలు ఆందోళన నిర్వహించాయి. ప్రభుత్వం వైపు నుంచి మాత్రం చర్య లు తీసుకుంటాం అన్నారే తప్ప.. ఇప్పటి వరకు విజయనగరం జిల్లా రామతీర్థం విషయంలో చర్యలు ఏమయ్యాయో.. ఎవరికీ తెలియదు. ఇక, ఈ పరిస్థితి పక్కన పెడితే.. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కూడా హిందువులను వేధిస్తున్నాయి. నిజానికి గత ఏడాది ఫుల్లుగా కరోనా ఉండడంతో హిందులకు సంబంధించి అనేక పండగలు, ఉత్సవాలు.. చేసుకునే పరిస్థితి లేకుండాపోయింది.
దీంతో ఈ ఏడాదైనా.. వాటిని అంతో ఇంతో ఘనంగా చేసుకునేందుకు ప్రజలు ముందుకు వచ్చారు. అయితే.. ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోంది. నిన్న గా క మొన్న .. వినాయక చవితికి సంబంధించిన ఆంక్ష లు ప్రజల్లో ఆగ్రవేశాలు కలిగించాయి. పందిళ్లు వేసుకోవద్దని, గణపతి ఉత్సవాలు నిర్వహించవద్దని.. నిమజ్జన ఊరేగింపులు చేసుకోవద్దని ఆంక్షలు విధించింది.
దీంతో ఇతర పండగలకు లేని ఆంక్షలు ఒక్క హిందూ పండగలపైనేనా..అనే చర్చ జోరుగా సాగింది. అయితే.. హైకోర్టు కొంత మేరకు ఉపశమనం కల్పించినా.. పోలీసుల చర్యలతో ప్రజలు మనస్తాపానికి గురయ్యారు. అయితే.. ఏపీ ప్రభుత్వం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. తాజాగా దసరాపై మరికొన్ని ఆంక్షలు విధిం చేందుకు రెడీ అయింది. మరి దీనిపై హిందూ సంస్థలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.
This post was last modified on September 26, 2021 1:00 pm
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…