ఏపీలో మరో రగడ తెరమీదికి వచ్చింది. అది కూడా హిందూ ఆలయాలకు సంబంధించే కావడంతో ఇప్పు డు ఈ చర్చ జోరుగా సాగుతోంది. విషయం ఏంటంటే.. మరో వారం రోజుల్లో దేశవ్యాప్తంగా దసరా శరన్నవ రాత్రులు ప్రారంభం కానున్నాయి. ఇది అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకునే రోజులు. అదే సమయంలో జాతరలు, ఉత్సవాలు కూడా చేసుకుంటారు. శక్తి స్వరూపిణిగా ప్రతి ఇల్లూ అమ్మ వారికి ఆహ్వానం పలుకుతుంది. అదే సమయంలో ఆలయాల్లో అయితే.. మరింత ఎక్కువగా నిత్య పూజలు, నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తారు.
అయితే.. మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా దసరా ఉత్సవాలపై ప్రభుత్వ వ్యూహాన్ని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ నవరాత్రులను ఇంటిలోనే నిర్వహించుకోవాలన్నారు. అంతేకాదు.. ఏ ప్రజాప్రతినిధీ కూడా అమ్మవారి ఉత్సవాలను బహిరంగంగా చేయాలని అనుకోవడం లేదని.. చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కరోనా ఉందని.. అమ్మవారికి కూడా ఈ విషయం తెలుసని అన్నారు. దీనిని బట్టి.. దసరా సరదా కూడా ఏపీ ప్రజలకు లేకుండా పోతోందన్న మాట.
వాస్తవానికి రాష్ట్రంలో వైసీపీ సర్కారు వచ్చిన తర్వాత.. హిందూ ఆలయాలపై దాడులు జరిగాయనే వాదన ఉంది. దీనిపై అన్ని రాజకీయ పక్షాలు ఆందోళన నిర్వహించాయి. ప్రభుత్వం వైపు నుంచి మాత్రం చర్య లు తీసుకుంటాం అన్నారే తప్ప.. ఇప్పటి వరకు విజయనగరం జిల్లా రామతీర్థం విషయంలో చర్యలు ఏమయ్యాయో.. ఎవరికీ తెలియదు. ఇక, ఈ పరిస్థితి పక్కన పెడితే.. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కూడా హిందువులను వేధిస్తున్నాయి. నిజానికి గత ఏడాది ఫుల్లుగా కరోనా ఉండడంతో హిందులకు సంబంధించి అనేక పండగలు, ఉత్సవాలు.. చేసుకునే పరిస్థితి లేకుండాపోయింది.
దీంతో ఈ ఏడాదైనా.. వాటిని అంతో ఇంతో ఘనంగా చేసుకునేందుకు ప్రజలు ముందుకు వచ్చారు. అయితే.. ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోంది. నిన్న గా క మొన్న .. వినాయక చవితికి సంబంధించిన ఆంక్ష లు ప్రజల్లో ఆగ్రవేశాలు కలిగించాయి. పందిళ్లు వేసుకోవద్దని, గణపతి ఉత్సవాలు నిర్వహించవద్దని.. నిమజ్జన ఊరేగింపులు చేసుకోవద్దని ఆంక్షలు విధించింది.
దీంతో ఇతర పండగలకు లేని ఆంక్షలు ఒక్క హిందూ పండగలపైనేనా..అనే చర్చ జోరుగా సాగింది. అయితే.. హైకోర్టు కొంత మేరకు ఉపశమనం కల్పించినా.. పోలీసుల చర్యలతో ప్రజలు మనస్తాపానికి గురయ్యారు. అయితే.. ఏపీ ప్రభుత్వం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. తాజాగా దసరాపై మరికొన్ని ఆంక్షలు విధిం చేందుకు రెడీ అయింది. మరి దీనిపై హిందూ సంస్థలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.
రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. అయితే కొన్నిసార్లు అవి శృతిమించిపోయి వివాదాలకు తావిస్తున్నాయి. ఏపీ రాజకీయాలు ఇందుకు మినహాయింపు…
మన హీరోల పాత రీ రిలీజులు తెలుగు రాష్ట్రాల్లో ఆడటం పెద్ద విషయం కాదు. చాలాసార్లు చూశాం. పోకిరి, ఖుషి…
నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో, ఈ ఏడాది…
గత ఏడాది పెద్ది నుంచి చికిరి చికిరి వీడియో సాంగ్ విడుదల చేశాక సోషల్ మీడియా ఊగిపోయింది. మిలియన్లలో వ్యూస్,…
ప్రభాస్ అభిమానులే కాదు సగటు మూవీ లవర్స్ లో కూడా విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా కల్కి 2. ఆల్రెడీ…
ఈ ఏడాది వేసవికి సరైన గమ్యస్థానంగా శ్రీనగర్ నిలిచింది. పెద్దగా ప్రచారం జరగనప్పటికి.. ఈసారి వేసవిలో చల్లదనాన్ని అస్వాదించేందుకు శ్రీనగర్…