ఏపీలో మరో రగడ తెరమీదికి వచ్చింది. అది కూడా హిందూ ఆలయాలకు సంబంధించే కావడంతో ఇప్పు డు ఈ చర్చ జోరుగా సాగుతోంది. విషయం ఏంటంటే.. మరో వారం రోజుల్లో దేశవ్యాప్తంగా దసరా శరన్నవ రాత్రులు ప్రారంభం కానున్నాయి. ఇది అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకునే రోజులు. అదే సమయంలో జాతరలు, ఉత్సవాలు కూడా చేసుకుంటారు. శక్తి స్వరూపిణిగా ప్రతి ఇల్లూ అమ్మ వారికి ఆహ్వానం పలుకుతుంది. అదే సమయంలో ఆలయాల్లో అయితే.. మరింత ఎక్కువగా నిత్య పూజలు, నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తారు.
అయితే.. మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా దసరా ఉత్సవాలపై ప్రభుత్వ వ్యూహాన్ని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ నవరాత్రులను ఇంటిలోనే నిర్వహించుకోవాలన్నారు. అంతేకాదు.. ఏ ప్రజాప్రతినిధీ కూడా అమ్మవారి ఉత్సవాలను బహిరంగంగా చేయాలని అనుకోవడం లేదని.. చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కరోనా ఉందని.. అమ్మవారికి కూడా ఈ విషయం తెలుసని అన్నారు. దీనిని బట్టి.. దసరా సరదా కూడా ఏపీ ప్రజలకు లేకుండా పోతోందన్న మాట.
వాస్తవానికి రాష్ట్రంలో వైసీపీ సర్కారు వచ్చిన తర్వాత.. హిందూ ఆలయాలపై దాడులు జరిగాయనే వాదన ఉంది. దీనిపై అన్ని రాజకీయ పక్షాలు ఆందోళన నిర్వహించాయి. ప్రభుత్వం వైపు నుంచి మాత్రం చర్య లు తీసుకుంటాం అన్నారే తప్ప.. ఇప్పటి వరకు విజయనగరం జిల్లా రామతీర్థం విషయంలో చర్యలు ఏమయ్యాయో.. ఎవరికీ తెలియదు. ఇక, ఈ పరిస్థితి పక్కన పెడితే.. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కూడా హిందువులను వేధిస్తున్నాయి. నిజానికి గత ఏడాది ఫుల్లుగా కరోనా ఉండడంతో హిందులకు సంబంధించి అనేక పండగలు, ఉత్సవాలు.. చేసుకునే పరిస్థితి లేకుండాపోయింది.
దీంతో ఈ ఏడాదైనా.. వాటిని అంతో ఇంతో ఘనంగా చేసుకునేందుకు ప్రజలు ముందుకు వచ్చారు. అయితే.. ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోంది. నిన్న గా క మొన్న .. వినాయక చవితికి సంబంధించిన ఆంక్ష లు ప్రజల్లో ఆగ్రవేశాలు కలిగించాయి. పందిళ్లు వేసుకోవద్దని, గణపతి ఉత్సవాలు నిర్వహించవద్దని.. నిమజ్జన ఊరేగింపులు చేసుకోవద్దని ఆంక్షలు విధించింది.
దీంతో ఇతర పండగలకు లేని ఆంక్షలు ఒక్క హిందూ పండగలపైనేనా..అనే చర్చ జోరుగా సాగింది. అయితే.. హైకోర్టు కొంత మేరకు ఉపశమనం కల్పించినా.. పోలీసుల చర్యలతో ప్రజలు మనస్తాపానికి గురయ్యారు. అయితే.. ఏపీ ప్రభుత్వం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. తాజాగా దసరాపై మరికొన్ని ఆంక్షలు విధిం చేందుకు రెడీ అయింది. మరి దీనిపై హిందూ సంస్థలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.
This post was last modified on September 26, 2021 1:00 pm
స్టార్ హీరోలను ఫ్యాన్స్ దేవుళ్లుగా భావించడం నిజమేమో అనిపిస్తుంది కొన్ని సంఘటనలు చూస్తే. స్వంత అభిమానిని హత్య చేసిన కేసులో…
అభిమానుల దశాబ్దాల నిరీక్షణకు బ్రేక్ వేస్తూ వెంకటేష్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సందర్భంగా…
జపాన్ దేశాన్ని ఇప్పుడు ఓ భయంకరమైన వార్త వణికిస్తోంది. అధికారులు అరుదైన "మెగాక్వేక్ అడ్వైజరీ" జారీ చేయడంతో అక్కడి ప్రజలు…
తెలుగు సినీ పరిశ్రమకు ప్రస్తుతం అనధికార పెద్ద అంటే మెగాస్టార్ చిరంజీవి అనే చెప్పాలి. ఒకప్పుడు దాసరి నారాయణరావులా ఇప్పుడు…
గత రెండు మూడేళ్ల నుంచి ఎదురు చూస్తున్న వేలాది మందికి సీఎం చంద్రబాబు తాజాగా చల్లని కబురు అందించారు. తమ…
చైనాలో అవినీతికి పాల్పడితే శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో మరోసారి రుజువైంది. భారీగా లంచం తీసుకున్న బై తియాన్హుయి అనే…