Political News

టీడీపీలో మొదలైన డిమాండ్లు

రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రెండు పార్టీలు పొత్తులు పెట్టుకోవాలంటూ టీడీపీ నేతల నుంచి డిమాండ్లు మొదలైపోయాయి. తాజాగా వెల్లడైన పరిషత్ ఎన్నికల ఫలితాల తర్వాత కొన్ని మండలాల్లో టీడీపీ-జనసేన కలుస్తున్న విషయం తెలిసిందే. స్ధానికంగా ఎదురైన పరిస్థితుల కారణంగా రెండు పార్టీలు అవగాహనతో సర్దుబాట్లు చేసుకుంటే మండల ప్రజా పరిషత్ అధ్యక్ష పదవిని ఈ రెండు పార్టీలు తమ ఖాతాలో వేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే రెండు పార్టీలు స్థానిక నేతలు గట్టిగా కసరత్తు చేస్తున్నారు.

రెండు పార్టీలు గనుక కలిస్తే సుమారు ఎనిమిది మండలాల్లో ప్రెసిడెంట్ పదవికి అధికార వైసీపిని దూరంగా పెట్టవచ్చు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు, కడియం, మలికిపురం, పశ్చిమగోదావరి జిల్లాలోని వీరవాసరం, ఆచంట, కృష్ణా జిల్లాలోని చల్లపల్లి, మోపిదేవి, కడప జిల్లాలోని గోపవరం మండలాల్లో వైసీపీ గెలిచిన ఎంపీటీసీ స్థానాల కన్నా టీడీపీ, జనసేనలు గెలుచుకున్న ఎంపీటీసీ స్థానాలు ఎక్కువ. కాబట్టి తమ రెండు పార్టీలు కలిస్తే బాగుంటుందని టీడీపీ నేతలు బహిరంగంగానే చంద్రబాబునాయుడును డిమాండ్ చేస్తున్నారు.

మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ రాబోయే సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ-జనసేనలు పొత్తులు పెట్టుకోవాలని చంద్రబాబుకు సూచించారు. తమ రెండు పార్టీలు కలిస్తే వైసీపీ మీద గెలవచ్చని తాజా ఫలితాల్లో అర్ధమైనట్లు చెప్పారు. విడివిడిగా పోటీ చేసి ఫలితాల తర్వాత కలవటం కన్నా ముందే పొత్తుంటే ఇంకా బాగుంటుందని పితాని చెప్పారు. ముందస్తు ఎన్నికలు వస్తాయని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఇపుడే పొత్తులపై రెండు పార్టీల అధినేతలు భేటీ జరిపి నిర్ణయం తీసుకోవాలని పితాని డిమాండ్ చేశారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీజేపీ-జనసేనలు మిత్రపక్షాలైనా ఎంపీపీ అధ్యక్ష పదవుల కోసం జనసేన-టీడీపీలు కలుస్తున్నాయి. అధినేతల స్ధాయిలోనే కాదు చివరకు క్రింది స్థాయిలో కూడా బీజేపీ-జనసేన పొత్తు ఎవరికీ ఇష్టంలేనట్లుంది.  అందుకనే ఎవరికి వారుగా కార్యక్రమాలను చేసుకుంటున్నారు. అవసరమైనపుడు మాత్రమే ఏదో మొక్కుబడిగా బీజేపీ నేతలతో జనసేన నేతలు కలుస్తున్నారన్న విషయం అందరికీ అర్ధమవుతోంది.

తాజా పరిషత్ ఫలితాల్లో బీజేపీ 28 ఎంపీటీసీల్లో  గెలిస్తే జనసేన 177 ఎంపీటీసీల్లో గెలిచింది.  టీడీపీ 917 ఎంపీటీసీల్లో గెలిచింది. దీంతో టీడీపీ-జనసేన గెలిస్తే ఇంకా మంచి ఫలితాలు వచ్చుండేదనే చర్చ, ఆశ రెండుపార్టీల్లోను పెరిగిపోతోంది. దీన్ని గమనించే జనసేనతో పొత్తు పెట్టుకోవాలని టీడీపీ నేతల నుండి డిమాండ్లు మొదలైపోయాయి. బహుశా పవన్ కల్యాణ్ కు కూడా ఇదే కావాలేమో. చూద్దాం తొందరలోనే పొత్తులపై అనూహ్య ప్రకటన వస్తుందేమో.

This post was last modified on September 25, 2021 10:40 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

3 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

4 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

5 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

6 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

6 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

8 hours ago