Political News

టీడీపీలో మొదలైన డిమాండ్లు

రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రెండు పార్టీలు పొత్తులు పెట్టుకోవాలంటూ టీడీపీ నేతల నుంచి డిమాండ్లు మొదలైపోయాయి. తాజాగా వెల్లడైన పరిషత్ ఎన్నికల ఫలితాల తర్వాత కొన్ని మండలాల్లో టీడీపీ-జనసేన కలుస్తున్న విషయం తెలిసిందే. స్ధానికంగా ఎదురైన పరిస్థితుల కారణంగా రెండు పార్టీలు అవగాహనతో సర్దుబాట్లు చేసుకుంటే మండల ప్రజా పరిషత్ అధ్యక్ష పదవిని ఈ రెండు పార్టీలు తమ ఖాతాలో వేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే రెండు పార్టీలు స్థానిక నేతలు గట్టిగా కసరత్తు చేస్తున్నారు.

రెండు పార్టీలు గనుక కలిస్తే సుమారు ఎనిమిది మండలాల్లో ప్రెసిడెంట్ పదవికి అధికార వైసీపిని దూరంగా పెట్టవచ్చు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు, కడియం, మలికిపురం, పశ్చిమగోదావరి జిల్లాలోని వీరవాసరం, ఆచంట, కృష్ణా జిల్లాలోని చల్లపల్లి, మోపిదేవి, కడప జిల్లాలోని గోపవరం మండలాల్లో వైసీపీ గెలిచిన ఎంపీటీసీ స్థానాల కన్నా టీడీపీ, జనసేనలు గెలుచుకున్న ఎంపీటీసీ స్థానాలు ఎక్కువ. కాబట్టి తమ రెండు పార్టీలు కలిస్తే బాగుంటుందని టీడీపీ నేతలు బహిరంగంగానే చంద్రబాబునాయుడును డిమాండ్ చేస్తున్నారు.

మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ రాబోయే సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ-జనసేనలు పొత్తులు పెట్టుకోవాలని చంద్రబాబుకు సూచించారు. తమ రెండు పార్టీలు కలిస్తే వైసీపీ మీద గెలవచ్చని తాజా ఫలితాల్లో అర్ధమైనట్లు చెప్పారు. విడివిడిగా పోటీ చేసి ఫలితాల తర్వాత కలవటం కన్నా ముందే పొత్తుంటే ఇంకా బాగుంటుందని పితాని చెప్పారు. ముందస్తు ఎన్నికలు వస్తాయని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఇపుడే పొత్తులపై రెండు పార్టీల అధినేతలు భేటీ జరిపి నిర్ణయం తీసుకోవాలని పితాని డిమాండ్ చేశారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీజేపీ-జనసేనలు మిత్రపక్షాలైనా ఎంపీపీ అధ్యక్ష పదవుల కోసం జనసేన-టీడీపీలు కలుస్తున్నాయి. అధినేతల స్ధాయిలోనే కాదు చివరకు క్రింది స్థాయిలో కూడా బీజేపీ-జనసేన పొత్తు ఎవరికీ ఇష్టంలేనట్లుంది.  అందుకనే ఎవరికి వారుగా కార్యక్రమాలను చేసుకుంటున్నారు. అవసరమైనపుడు మాత్రమే ఏదో మొక్కుబడిగా బీజేపీ నేతలతో జనసేన నేతలు కలుస్తున్నారన్న విషయం అందరికీ అర్ధమవుతోంది.

తాజా పరిషత్ ఫలితాల్లో బీజేపీ 28 ఎంపీటీసీల్లో  గెలిస్తే జనసేన 177 ఎంపీటీసీల్లో గెలిచింది.  టీడీపీ 917 ఎంపీటీసీల్లో గెలిచింది. దీంతో టీడీపీ-జనసేన గెలిస్తే ఇంకా మంచి ఫలితాలు వచ్చుండేదనే చర్చ, ఆశ రెండుపార్టీల్లోను పెరిగిపోతోంది. దీన్ని గమనించే జనసేనతో పొత్తు పెట్టుకోవాలని టీడీపీ నేతల నుండి డిమాండ్లు మొదలైపోయాయి. బహుశా పవన్ కల్యాణ్ కు కూడా ఇదే కావాలేమో. చూద్దాం తొందరలోనే పొత్తులపై అనూహ్య ప్రకటన వస్తుందేమో.

This post was last modified on September 25, 2021 10:40 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగోళ్లు లేపుతుంటే… తమిళోళ్లు ముంచేస్తున్నారు

ఒకప్పుడు తెలుగు సినిమాల మీద తమిళ చిత్రాలు స్పష్టమైన ఆధిపత్యం చూపించేవి. అక్కడ ఎంతోమంది మేటి దర్శకులు ఉండేవాళ్లు. కొత్త…

2 hours ago

సీఎంకు మ‌రో టెస్ట్‌.. రెండు సీట్ల కోసం ప‌దుల సంఖ్య‌లో పోటీ!

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి మ‌రో టెస్ట్ ఎదురు కానుందా? మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ముహూర్తం చూస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న ఎవ‌రిని…

3 hours ago

హాలీవుడ్ రికార్డు బద్దలు కొట్టిన మన లెజెండ్

ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…

6 hours ago

రిస్కులు చూసుకుంటున్న జైలర్ 2

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…

7 hours ago

ఎన్నికలపై బెట్టింగుల హోరు!… అంతటా హైటెన్షన్!

దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…

11 hours ago

తారక్ అభిమానికి చరణ్ ఛాన్స్?

పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…

11 hours ago