ఏపీ ముఖ్యమంత్రి.. జగన్మోహన్ రెడ్డి శనివారం తలపెట్టిన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. గురువారం రాత్రికే ఢిల్లీ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. దీనిని మీడియాకు కూడా విడుదల చేశారు.
అయితే.. అనూహ్యంగా ఆయన శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఉదయం రోజు వారీ వ్యాయామంలో భాగంగా.. జగన్ వ్యాయామానికి దిగారు. అయతే.. ఆయన కుడి పాదం అనూహ్యంగా మెలిదిరగడంతో బెణికింది. దీంతో ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోయారు. ఈ క్రమంలో పరీక్షించిన వైద్యులు.. కాలు బెణికిందని.. పేర్కొంటూ.. కట్టు కట్టారు.
అయితే.. దీనిని సాధారణమే అనుకున్న సీఎం జగన్.. ఈ విషయాన్ని పెద్ద సీరియస్గా తీసుకోలేదు. అదేసమయంలో రోజు వారి విధుల్లోనూ ఆయన పాల్గొన్నారు. దీంతో కాలుపై మరింత ఒత్తిడి పెరిగి.. సాయంత్రానికి వాచిపోయింది.
దీంతో ముఖ్యమంత్రి కి బెడ్ రెస్ట్ అవసరమని.. వైద్యులు సూచించారు. ఫలితంగా శనివారం ఢిల్లీ పర్యటనకు వెళ్లాల్సిన ముఖ్యమంత్రి.. తన షెడ్యూల్ ను రద్దు చేసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం పొద్దు పోయాక.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి మీడియాకు సమాచారం అందింది. వాస్తవానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలతో ఈ నెల 26న భేటీ కానున్నారు.
ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి, నక్సల్స్ ప్రభావం ఎలా తగ్గించాల నే అంశంపై చర్చించనున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలకు .. కేంద్ర హోం శాఖ నుంచి ఆహ్వానాలు అందాయి. తెలంగాణతోపాటు.. ఏపీకూడా నక్సల్స్ ప్రభావిత రాష్ట్రమే కావడంతో.. కేంద్ర హోం శాఖ ఏపీ, ఒడిశా తదితర పది రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించింది.
ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉంది. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలో నే ఉండాలని షెడ్యూల్ నిర్ణయించుకున్నారు. ఇక, ఎలాగూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇప్పటికే ఢిల్లీ పయనమైన నేపథ్యంలో ఇద్దరు ముఖ్యమంత్రులు అక్కడ.. చర్చించుకునే అవకాశం ఉందని.. విశ్లేషణలు వచ్చాయి.అ యితే.. అనూహ్యంగా ఇప్పుడు జగన్ ఢిల్లీ టూర్ రద్దయింది.
This post was last modified on September 24, 2021 11:41 pm
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…