Political News

సీఎం జ‌గ‌న్‌కు అస్వ‌స్థ‌త‌.. ఢిల్లీ టూర్ క్యాన్సిల్‌

ఏపీ ముఖ్య‌మంత్రి.. జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి శ‌నివారం త‌ల‌పెట్టిన ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్నారు. గురువారం రాత్రికే ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన షెడ్యూల్ ఖ‌రారైంది. దీనిని మీడియాకు కూడా విడుద‌ల చేశారు.

అయితే.. అనూహ్యంగా ఆయ‌న శుక్ర‌వారం అస్వ‌స్థ‌త‌కు గురయ్యారు. శుక్ర‌వారం ఉద‌యం రోజు వారీ వ్యాయామంలో భాగంగా.. జ‌గ‌న్ వ్యాయామానికి దిగారు. అయ‌తే.. ఆయ‌న కుడి పాదం అనూహ్యంగా మెలిదిర‌గ‌డంతో బెణికింది. దీంతో ఒక్క‌సారిగా ఆయ‌న కుప్ప‌కూలిపోయారు. ఈ క్ర‌మంలో ప‌రీక్షించిన వైద్యులు.. కాలు బెణికింద‌ని.. పేర్కొంటూ.. క‌ట్టు క‌ట్టారు.

అయితే.. దీనిని సాధార‌ణ‌మే అనుకున్న సీఎం జ‌గ‌న్‌.. ఈ విష‌యాన్ని పెద్ద సీరియ‌స్‌గా తీసుకోలేదు. అదేస‌మ‌యంలో రోజు వారి విధుల్లోనూ ఆయ‌న పాల్గొన్నారు. దీంతో కాలుపై మ‌రింత ఒత్తిడి పెరిగి.. సాయంత్రానికి వాచిపోయింది.

దీంతో ముఖ్య‌మంత్రి కి బెడ్ రెస్ట్ అవ‌స‌ర‌మ‌ని.. వైద్యులు సూచించారు. ఫ‌లితంగా శ‌నివారం ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లాల్సిన ముఖ్య‌మంత్రి.. త‌న షెడ్యూల్ ను ర‌ద్దు చేసుకున్నారు. ఈ మేర‌కు శుక్ర‌వారం పొద్దు పోయాక‌.. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నుంచి మీడియాకు స‌మాచారం అందింది. వాస్త‌వానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. న‌క్స‌ల్స్ ప్ర‌భావిత రాష్ట్రాల‌తో ఈ నెల 26న‌ భేటీ కానున్నారు.

ఆయా రాష్ట్రాల్లో జ‌రుగుతున్న అభివృద్ధి, న‌క్స‌ల్స్ ప్ర‌భావం ఎలా త‌గ్గించాల నే అంశంపై చ‌ర్చించ‌నున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే న‌క్స‌ల్స్ ప్రభావిత రాష్ట్రాల‌కు .. కేంద్ర హోం శాఖ నుంచి ఆహ్వానాలు అందాయి. తెలంగాణ‌తోపాటు.. ఏపీకూడా న‌క్స‌ల్స్ ప్ర‌భావిత రాష్ట్ర‌మే కావ‌డంతో.. కేంద్ర హోం శాఖ ఏపీ, ఒడిశా త‌దిత‌ర ప‌ది రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌ను ఆహ్వానించింది.

ఈ క్ర‌మంలో ఏపీ సీఎం జ‌గ‌న్ కూడా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రుకావాల్సి ఉంది. రెండు రోజుల పాటు ఆయ‌న ఢిల్లీలో నే ఉండాల‌ని షెడ్యూల్ నిర్ణ‌యించుకున్నారు. ఇక‌, ఎలాగూ.. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా ఇప్ప‌టికే ఢిల్లీ ప‌య‌న‌మైన నేప‌థ్యంలో ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు అక్క‌డ‌.. చ‌ర్చించుకునే అవ‌కాశం ఉంద‌ని.. విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి.అ యితే.. అనూహ్యంగా ఇప్పుడు జ‌గ‌న్ ఢిల్లీ టూర్ ర‌ద్ద‌యింది.

This post was last modified on September 24, 2021 11:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

3 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

47 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

2 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago