ఏపీ ముఖ్యమంత్రి.. జగన్మోహన్ రెడ్డి శనివారం తలపెట్టిన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. గురువారం రాత్రికే ఢిల్లీ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. దీనిని మీడియాకు కూడా విడుదల చేశారు.
అయితే.. అనూహ్యంగా ఆయన శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఉదయం రోజు వారీ వ్యాయామంలో భాగంగా.. జగన్ వ్యాయామానికి దిగారు. అయతే.. ఆయన కుడి పాదం అనూహ్యంగా మెలిదిరగడంతో బెణికింది. దీంతో ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోయారు. ఈ క్రమంలో పరీక్షించిన వైద్యులు.. కాలు బెణికిందని.. పేర్కొంటూ.. కట్టు కట్టారు.
అయితే.. దీనిని సాధారణమే అనుకున్న సీఎం జగన్.. ఈ విషయాన్ని పెద్ద సీరియస్గా తీసుకోలేదు. అదేసమయంలో రోజు వారి విధుల్లోనూ ఆయన పాల్గొన్నారు. దీంతో కాలుపై మరింత ఒత్తిడి పెరిగి.. సాయంత్రానికి వాచిపోయింది.
దీంతో ముఖ్యమంత్రి కి బెడ్ రెస్ట్ అవసరమని.. వైద్యులు సూచించారు. ఫలితంగా శనివారం ఢిల్లీ పర్యటనకు వెళ్లాల్సిన ముఖ్యమంత్రి.. తన షెడ్యూల్ ను రద్దు చేసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం పొద్దు పోయాక.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి మీడియాకు సమాచారం అందింది. వాస్తవానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలతో ఈ నెల 26న భేటీ కానున్నారు.
ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి, నక్సల్స్ ప్రభావం ఎలా తగ్గించాల నే అంశంపై చర్చించనున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాలకు .. కేంద్ర హోం శాఖ నుంచి ఆహ్వానాలు అందాయి. తెలంగాణతోపాటు.. ఏపీకూడా నక్సల్స్ ప్రభావిత రాష్ట్రమే కావడంతో.. కేంద్ర హోం శాఖ ఏపీ, ఒడిశా తదితర పది రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించింది.
ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉంది. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలో నే ఉండాలని షెడ్యూల్ నిర్ణయించుకున్నారు. ఇక, ఎలాగూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇప్పటికే ఢిల్లీ పయనమైన నేపథ్యంలో ఇద్దరు ముఖ్యమంత్రులు అక్కడ.. చర్చించుకునే అవకాశం ఉందని.. విశ్లేషణలు వచ్చాయి.అ యితే.. అనూహ్యంగా ఇప్పుడు జగన్ ఢిల్లీ టూర్ రద్దయింది.
This post was last modified on September 24, 2021 11:41 pm
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…