Political News

ఢిల్లీ కోర్టులో కాల్పులు.. గ్యాంగ్‌స్ట‌ర్ స‌హా న‌లుగురు మృతి

దేశ రాజ‌ధాని ఢిల్లీలో కాల్పులు చోటు చేసుకున్నాయి. అది కూడా ఢిల్లీలోని స్థానిక రోహిణి కోర్టులో ఈ కాల్పు లు జ‌ర‌గ‌డం దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఈ కాల్పుల్లోమొత్తం.. న‌లుగురు మృతి చెందారు. వీరిలో క‌ర‌డు గ‌ట్టిన గ్యాంగ్ స్ట‌ర్ కూడా ఉండ‌డం.. గ్యాంగ్ స్ట‌ర్ కేంద్రంగానే కాల్పులు జ‌ర‌గ‌డం .. ప్రాధాన్యం సంతించుకుంది. మ‌హారాష్ట్రంలో అత్యాచారాలు, దోపిడీల‌కు సంబంధించి జితేంద్ర గోగిపై 19 కేసులు న‌మోదయ్యాయి. ఈ క్ర‌మంలో జితేంద్ర‌కు ఢిల్లీలో కూడా లింకులు ఉండ‌డంతో అత‌నిపై విచార‌ణ రోహిణి కోర్టులో జ‌రుగుతోంది.

ఈ క్ర‌మంలో శుక్ర‌వారం ఉద‌యం గోగిని.. పోలీసులు కోర్టులో హాజ‌రు ప‌రిచారు. ప్ర‌త్యేక విభాగం పోలీసులు ఈ కేసును ప‌ర్య‌వేక్షిస్తున్నారు. అయితే.. రోహిణీ కోర్టులో జితేంద్ర‌ను హాజ‌రు ప‌రిచిన కొద్దిసేప‌టికే.. కొంద‌రు దుండ‌గులు.. న్యాయ వాదుల దుస్తుల్లో కోర్టులోకి ప్ర‌వేశించారు. వాస్త‌వానికి.. ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌త ఉన్న రోహిణి కోర్టులోకి దుండ‌గులు ఎలా ప్ర‌వేశించార‌న్న విష‌యంపై స‌ర్వ‌త్రా విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది. వ‌చ్చీరావ‌డంతోనే.. జితేంద్ర ల‌క్ష్యంగా కాల్పులు జ‌రిపారు. ఈ కాల్పుల్లోగ్యాంగ్ స్ట‌ర్ గోగి.. ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే.. అత‌ను అక్క‌డ‌ మృతి చెందాడు.

ఇక‌, వెంట‌నే తేరుకున్న పోలీసులు.. ఎదురు కాల్పుల‌కు దిగారు. పోలీసు కాల్పుల్లో ముగ్గురు దుండ‌గులు ప్రాణాలు విడిచారు. జితేంద్ర గోగీని వివిధ నేరాల‌ కింద 2020లో అటు మ‌హారాష్ట్ర‌, ఇటు ఢిల్లీ పోలీసులు కేసులు న‌మోదు చేశారు. ఈ క్ర‌మంలో ఢిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగం అరెస్ట్ చేసింది. అతనితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచి జైలులో ఉంచారు.

శుక్రవారం పోలీసులు, 3వ బెటాలియన్ దళాలు గోగీని రోహిణి కోర్టుకు తీసుకొచ్చాయి. ఈ క్రమంలోనే దుండగులు 127 రూంలో జ‌రుగుతున‌న విచార‌ణ గ‌దిలోకి న్యాయ వాద దుస్తుల్లో వ‌చ్చి కాల్పులు జ‌ర‌గ‌డం సంచ‌ల‌నం సృష్టించింది. కాగా, కాల్పుల‌కు గ్యాంగ్ వారే కార‌ణ‌మ‌ని.. ఢిల్లీ పోలీసులు ప్రాథ‌మికంగా నిర్దారించ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on September 24, 2021 2:58 pm

Share

Recent Posts

నాగార్జున నమ్మకం ఎక్కడ తప్పింది

చిన్న సినిమా వెనుక అగ్ర నిర్మాతలు, హీరోలు ఉండటం వాటికి చాలా పెద్ద బలమవుతుంది. బలగంలో ఎంత గొప్ప కంటెంట్…

1 hour ago

విజయ్ స్థానాన్ని భర్తీ చేస్తాడా?

తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…

4 hours ago

విశ్వంభర వెళ్తున్న దారి సరైనదేనా

చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…

6 hours ago

యష్ మాటల్లో పరిణితి పని చేస్తుంది

ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…

7 hours ago

వైసీపీ స‌త్తాకు `బ్యాలెట్` టెస్ట్‌?

ఏపీలో వ‌చ్చే సెప్టెంబ‌రులో నిర్వ‌హించాల‌ని భావిస్తున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను బ్యాలెట్ విధానంలోనే నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించింది. దీంతో…

7 hours ago

కేటీఆర్ కార్యకర్తల రక్తాన్ని అమ్ముకున్నారు

తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…

7 hours ago