దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు చోటు చేసుకున్నాయి. అది కూడా ఢిల్లీలోని స్థానిక రోహిణి కోర్టులో ఈ కాల్పు లు జరగడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కాల్పుల్లోమొత్తం.. నలుగురు మృతి చెందారు. వీరిలో కరడు గట్టిన గ్యాంగ్ స్టర్ కూడా ఉండడం.. గ్యాంగ్ స్టర్ కేంద్రంగానే కాల్పులు జరగడం .. ప్రాధాన్యం సంతించుకుంది. మహారాష్ట్రంలో అత్యాచారాలు, దోపిడీలకు సంబంధించి జితేంద్ర గోగిపై 19 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో జితేంద్రకు ఢిల్లీలో కూడా లింకులు ఉండడంతో అతనిపై విచారణ రోహిణి కోర్టులో జరుగుతోంది.
ఈ క్రమంలో శుక్రవారం ఉదయం గోగిని.. పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. ప్రత్యేక విభాగం పోలీసులు ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. అయితే.. రోహిణీ కోర్టులో జితేంద్రను హాజరు పరిచిన కొద్దిసేపటికే.. కొందరు దుండగులు.. న్యాయ వాదుల దుస్తుల్లో కోర్టులోకి ప్రవేశించారు. వాస్తవానికి.. పటిష్టమైన భద్రత ఉన్న రోహిణి కోర్టులోకి దుండగులు ఎలా ప్రవేశించారన్న విషయంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. వచ్చీరావడంతోనే.. జితేంద్ర లక్ష్యంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లోగ్యాంగ్ స్టర్ గోగి.. ఆసుపత్రికి తరలించారు. అయితే.. అతను అక్కడ మృతి చెందాడు.
ఇక, వెంటనే తేరుకున్న పోలీసులు.. ఎదురు కాల్పులకు దిగారు. పోలీసు కాల్పుల్లో ముగ్గురు దుండగులు ప్రాణాలు విడిచారు. జితేంద్ర గోగీని వివిధ నేరాల కింద 2020లో అటు మహారాష్ట్ర, ఇటు ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో ఢిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగం అరెస్ట్ చేసింది. అతనితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచి జైలులో ఉంచారు.
శుక్రవారం పోలీసులు, 3వ బెటాలియన్ దళాలు గోగీని రోహిణి కోర్టుకు తీసుకొచ్చాయి. ఈ క్రమంలోనే దుండగులు 127 రూంలో జరుగుతునన విచారణ గదిలోకి న్యాయ వాద దుస్తుల్లో వచ్చి కాల్పులు జరగడం సంచలనం సృష్టించింది. కాగా, కాల్పులకు గ్యాంగ్ వారే కారణమని.. ఢిల్లీ పోలీసులు ప్రాథమికంగా నిర్దారించడం గమనార్హం.
This post was last modified on September 24, 2021 2:58 pm
గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…
మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…
వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…
ఏపీలో కీలక ఘట్టానికి కూటమి ప్రభుత్వం తెరదీయనుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమైంది. గత ఏడాది ఈ…
రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…