దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు చోటు చేసుకున్నాయి. అది కూడా ఢిల్లీలోని స్థానిక రోహిణి కోర్టులో ఈ కాల్పు లు జరగడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కాల్పుల్లోమొత్తం.. నలుగురు మృతి చెందారు. వీరిలో కరడు గట్టిన గ్యాంగ్ స్టర్ కూడా ఉండడం.. గ్యాంగ్ స్టర్ కేంద్రంగానే కాల్పులు జరగడం .. ప్రాధాన్యం సంతించుకుంది. మహారాష్ట్రంలో అత్యాచారాలు, దోపిడీలకు సంబంధించి జితేంద్ర గోగిపై 19 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో జితేంద్రకు ఢిల్లీలో కూడా లింకులు ఉండడంతో అతనిపై విచారణ రోహిణి కోర్టులో జరుగుతోంది.
ఈ క్రమంలో శుక్రవారం ఉదయం గోగిని.. పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. ప్రత్యేక విభాగం పోలీసులు ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. అయితే.. రోహిణీ కోర్టులో జితేంద్రను హాజరు పరిచిన కొద్దిసేపటికే.. కొందరు దుండగులు.. న్యాయ వాదుల దుస్తుల్లో కోర్టులోకి ప్రవేశించారు. వాస్తవానికి.. పటిష్టమైన భద్రత ఉన్న రోహిణి కోర్టులోకి దుండగులు ఎలా ప్రవేశించారన్న విషయంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. వచ్చీరావడంతోనే.. జితేంద్ర లక్ష్యంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లోగ్యాంగ్ స్టర్ గోగి.. ఆసుపత్రికి తరలించారు. అయితే.. అతను అక్కడ మృతి చెందాడు.
ఇక, వెంటనే తేరుకున్న పోలీసులు.. ఎదురు కాల్పులకు దిగారు. పోలీసు కాల్పుల్లో ముగ్గురు దుండగులు ప్రాణాలు విడిచారు. జితేంద్ర గోగీని వివిధ నేరాల కింద 2020లో అటు మహారాష్ట్ర, ఇటు ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో ఢిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగం అరెస్ట్ చేసింది. అతనితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచి జైలులో ఉంచారు.
శుక్రవారం పోలీసులు, 3వ బెటాలియన్ దళాలు గోగీని రోహిణి కోర్టుకు తీసుకొచ్చాయి. ఈ క్రమంలోనే దుండగులు 127 రూంలో జరుగుతునన విచారణ గదిలోకి న్యాయ వాద దుస్తుల్లో వచ్చి కాల్పులు జరగడం సంచలనం సృష్టించింది. కాగా, కాల్పులకు గ్యాంగ్ వారే కారణమని.. ఢిల్లీ పోలీసులు ప్రాథమికంగా నిర్దారించడం గమనార్హం.
This post was last modified on September 24, 2021 2:58 pm
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…