దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు చోటు చేసుకున్నాయి. అది కూడా ఢిల్లీలోని స్థానిక రోహిణి కోర్టులో ఈ కాల్పు లు జరగడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కాల్పుల్లోమొత్తం.. నలుగురు మృతి చెందారు. వీరిలో కరడు గట్టిన గ్యాంగ్ స్టర్ కూడా ఉండడం.. గ్యాంగ్ స్టర్ కేంద్రంగానే కాల్పులు జరగడం .. ప్రాధాన్యం సంతించుకుంది. మహారాష్ట్రంలో అత్యాచారాలు, దోపిడీలకు సంబంధించి జితేంద్ర గోగిపై 19 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో జితేంద్రకు ఢిల్లీలో కూడా లింకులు ఉండడంతో అతనిపై విచారణ రోహిణి కోర్టులో జరుగుతోంది.
ఈ క్రమంలో శుక్రవారం ఉదయం గోగిని.. పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. ప్రత్యేక విభాగం పోలీసులు ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. అయితే.. రోహిణీ కోర్టులో జితేంద్రను హాజరు పరిచిన కొద్దిసేపటికే.. కొందరు దుండగులు.. న్యాయ వాదుల దుస్తుల్లో కోర్టులోకి ప్రవేశించారు. వాస్తవానికి.. పటిష్టమైన భద్రత ఉన్న రోహిణి కోర్టులోకి దుండగులు ఎలా ప్రవేశించారన్న విషయంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. వచ్చీరావడంతోనే.. జితేంద్ర లక్ష్యంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లోగ్యాంగ్ స్టర్ గోగి.. ఆసుపత్రికి తరలించారు. అయితే.. అతను అక్కడ మృతి చెందాడు.
ఇక, వెంటనే తేరుకున్న పోలీసులు.. ఎదురు కాల్పులకు దిగారు. పోలీసు కాల్పుల్లో ముగ్గురు దుండగులు ప్రాణాలు విడిచారు. జితేంద్ర గోగీని వివిధ నేరాల కింద 2020లో అటు మహారాష్ట్ర, ఇటు ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో ఢిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగం అరెస్ట్ చేసింది. అతనితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచి జైలులో ఉంచారు.
శుక్రవారం పోలీసులు, 3వ బెటాలియన్ దళాలు గోగీని రోహిణి కోర్టుకు తీసుకొచ్చాయి. ఈ క్రమంలోనే దుండగులు 127 రూంలో జరుగుతునన విచారణ గదిలోకి న్యాయ వాద దుస్తుల్లో వచ్చి కాల్పులు జరగడం సంచలనం సృష్టించింది. కాగా, కాల్పులకు గ్యాంగ్ వారే కారణమని.. ఢిల్లీ పోలీసులు ప్రాథమికంగా నిర్దారించడం గమనార్హం.
This post was last modified on September 24, 2021 2:58 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…