Political News

మ‌ళ్లీ ఢిల్లీకి కేసీఆర్‌.. ఈ సారి ఏం చేస్తారు?

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. మ‌రోసారి ఢిల్లీ వెళ్ల‌నున్నారు. అన్ని కుదిరితే.. ఆయ‌న శుక్ర‌వార‌మే (రేపే) ఢిల్లీ ఫ్ల‌యిట్ ఎక్కనున్నార‌ని.. తెలంగాణ భ‌వ‌న్ వ‌ర్గాలు గుస‌గుస‌లాడుతున్నాయి. వాస్త‌వానికి ఇటీవ‌లే ఢిల్లీలో ప‌ర్య‌టించిన కేసీఆర్‌.. సుమారు వారం రోజుల‌కు పైగానే అక్కడ గ‌డిపారు. ఈ నెల 1 ఢిల్లీ ప‌య‌న‌మైన కేసీఆర్‌.. అక్క‌డ పార్టీ భ‌వ‌నానికి శంకు స్థాప‌న చేశారు. అదేస‌మ‌యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోనూ భేటీ అయ్యారు. ఆ త‌ర్వాత‌.. చాలా రోజులు అక్క‌డే ఉన్నారు. అప్ప‌ట్లో దీనిపై అనేక ఊహాగానాలు వ‌చ్చాయి.

ఈ నెల 1న కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. దేశ రాజధానిలో టీఆర్ ఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సీఎం.. ఆ పనుల నిమిత్తం అక్క‌డికి వెళ్లారు. అక్కడ కేవలం 3 రోజుల పాటు బస చేయాలని భావించిన కేసీఆర్.. పలు కార్యక్రమాల దృష్ట్యా అక్కడే ఉండిపోయారు. 2 న టీఆర్ ఎస్‌ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భూమి పూజ అనంతరం 3న ప్రధాని మోడీతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. సుమారు 50నిమిషాల పాటు సమావేశమైన కేసీఆర్.. రాష్ట్రానికి సంబంధించిన పది అంశాలపై విడివిడిగా పది లేఖలు అందజేశారు.

అదే స‌మ‌యంలో యాదాద్రి గుట్ట‌ను సంపూర్ణంగా.. నూత‌నీక‌రించిన నేప‌థ్యంలో ఈ ఆల‌య‌ ప్రారంభోత్స వానికి ముఖ్య అతిథిగా రావాల్సిందినగా మోడీని కేసీఆర్ ఆహ్వానించారు. అనంత‌రం అమిత్ షాను క‌లిశారు. కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రిని కూడా క‌లిశారు. త‌ర్వాత‌.. చాలా రోజులు అక్క‌డే ఉన్నారు. ఇక‌, ఇప్పుడు ప‌ట్టుమ‌ని రెండు వారాలు కూడా తిర‌క్కుండానే.. మ‌రోసారి కేసీఆర్ .. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తుండడం ఆస‌క్తిగా మారింది. ఈ నెల 25న కేసీఆర్ ఢిల్లీ వెళ్లే అవకాశముంది. ఈ నెల 26న మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశం జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఈ సమావేశం కానుంది.

ఇందులో ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ఝార్ఖండ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల సీఎంలు పాల్గొనే అవకాశం ఉంది. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ ఢిల్లీ టూర్ పెట్టుకున్నార‌ని.. తెలంగాణ భ‌వ‌న్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆదివారం ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో హోంమంత్రి అమిత్‌షా నేతృత్వంలో ఈ భేటీ జరుగనుంది. అయితే.. ఇదొక్క‌టే కాద‌ని.. కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి వ్య‌వ‌హారం తేల్చుకునేందుకు వెళ్తున్నార‌ని.. మ‌రికొన్ని వ‌ర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా.. ఇప్పుడు కేసీఆర్ టూర్ ఆస‌క్తిగా మారింది.

This post was last modified on September 23, 2021 2:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇరాన్ పై యుద్ధం… ట్రంప్ కొంప ముంచుతుందా?

ఇరాన్‌తో యుద్ధం విష‌యంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా?  నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…

1 hour ago

‘కల్కి’పై విమర్శలకు కట్టుబడి ఉన్న లిరిసిస్ట్

ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…

1 hour ago

ఎన్నిక‌ల క‌మిష‌నర్‌ను తొలగించడానికి తీర్మానమా?

దేశంలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప‌లు కీల‌క అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్ర‌ధాని పైనే గ‌త ఐదేళ్ల‌లో…

4 hours ago

చంద్రబాబు 3సీ ఫార్ములా… ఇది కలెక్టర్ల కోసమే

ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…

5 hours ago

థియేటర్ అనుభూతికి ‘సబ్ టైటిల్స్’ దెబ్బ

మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…

6 hours ago

సెలబ్రెటీ పెళ్లిళ్లు.. హడావుడి తగ్గించాలా?

పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…

7 hours ago