Political News

టీడీపీ నేత‌ల‌పై వేటు.. ఇది జ‌గ‌న్ నైతిక‌త‌కు దెబ్బేనా?

టీడీపీ కీల‌క నేత‌లు.. పార్టీ త‌రఫున బ‌ల‌మైన గ‌ళం వినిపిస్తున్న రాష్ట్ర టీడీపీ అధ్య‌క్షుడు కింజ‌రాపు అచ్చ న్నాయుడు.. పాల‌కొల్లు ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడుల‌పై వేటు వేసేందుకు రంగం సిద్ధ‌మైంది. కొన్నాళ్ల కింద‌ట‌..(స‌భ‌లో కాదు) స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాంపై అచ్చెన్నాయుడు కొన్ని వ్యాఖ్య‌లు చేశారు. అది కూడా ఓ లేఖ రూపంలో ఆయ‌న రాశారు. అయితే.. దీనిపై ఆయ‌న ఎందుకో సంత‌కం చేయ‌లేదు. కానీ, మీడియాలో వ‌చ్చేసింది. అయితే.. ఈ లేఖ‌పై సీతారాం.. అసెంబ్లీ హ‌క్కుల క‌మిటీకి ఫిర్యాదు చేశారు. దీంతో రెండు సార్లు విచార‌ణ చేసిన ప్రివిలేజ్ క‌మిటీ చైర్మ‌న్ కాకాని గోవ‌ర్ధ‌న్‌రెడ్డి.. అచ్చెన్న‌పై చ‌ర్య‌ల‌కు సిపార‌సు చేశారు.

అదేస‌మయంలో పాల‌కొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడు కూడా వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇది స‌భ‌లోనే జ‌రిగింది. పింఛ‌న్లు పెంచుతూ.. పోతామ‌న్నా.. కానీ.. క‌ట్ చేస్తు న్నార‌ని.. ఇదేనా సంక్షేమ పాల‌న అని విరుచుకుప‌డ్డారు. దీంతో ఈయ‌న‌పై కూడా ప్రివిలేజ్ క‌మిటీకి ఫిర్యాదులు అందాయి. దీంతో ఈయ‌న‌పై కూడా విచార‌ణ జ‌రిపిన కాకాని నేతృత్వంలోని క‌మిటీ.. తాజాగా సిఫార‌సు చేసింది. ఈ ఇద్ద‌రినీ.. త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్న వ‌ర్షాకాల స‌మావేశాల్లో వీరిద్ద‌రికీ.. మైక్ ఇవ్వ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించారు. ప్ర‌స్తుతం ఇది స‌భాప‌తి సీతారాం పేషీకి చేరింది. దీనిపై ఆయ‌న నిర్ణ‌యం తీసుకుంటే.. ఇద్ద‌రు కీల‌క నేత‌ల‌కు వాయిస్ క‌ట్ అవుతుంది.

అయితే.. ఈ విష‌యం ఇప్పుడు మ‌రోసారి జ‌గ‌న్ మెడ‌కు చుట్టుకునే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఎందుకంటే.. సీఎంగా ప‌గ్గాలు చేప‌ట్టిన తొలినాళ్ల‌లో జ‌రిగిన తొలి స‌భ‌లో.. జ‌గ‌న్ ఆవేశంగా ప్ర‌సంగించారు. గ‌త స్పీక‌ర్‌(అప్ప‌టికి జీవించే ఉన్నారు) కోడెల శివ‌ప్ర‌సాద్ పేరు చెప్ప‌కుండానే నిప్పులు చెరిగారు. “అధ్య‌క్షా.. స‌భ‌లో స‌భ్యుల‌కు స్వేచ్ఛ ఉండాలి. మాట్లాడే అవ‌కాశం ఇవ్వాలి. మా స‌భ్యురాలు.. రోజా.. ఏదో అన్నార‌ని ఏకంగా ఏడాదిపాటు స‌స్పెండ్ చేశారు. ఇదేం అన్యాయం అధ్య‌క్షా! స‌భ‌లో ప్ర‌సంగించేప్పుడు.. స‌భ్యుల‌కు స్వేచ్ఛ లేక‌పోతే.. ప్ర‌జాస్వామ్యం ఎక్క‌డుంది అధ్య‌క్షా!!” అని ప్ర‌శ్నించారు.

అంతేకాదు.. “మ‌న స‌భ‌లో(వైసీపీ స‌ర్కారు హ‌యాంలో) ఇలాంటి జ‌ర‌గ‌కూడ‌దు అధ్య‌క్షా! స‌స్పెండ్‌ల వ‌ర‌కు స‌భ పోకూడ‌దు అధ్య‌క్షా! ఎవ‌రికైనా మాట్లాడే స్వేచ్ఛ ఉండాలి. విమ‌ర్శ‌లు ఏ రూపంలో ఉన్నా.. మేం స్వీక‌రిస్తాం. మేమేమీ.. భుజాలు త‌డుముకోం. చంద్ర‌బాబు మాదిరిగా బితుకు బితుకు మంటూ.. స‌భ‌ను నిర్వ‌హించం. ఎవ‌రు ఏం చెప్పినా..పాజిటివ్‌గానే తీసుకుంటాం. ఈ స‌భ దేశానికే ఆద‌ర్శంగా ఉండేలా చూస్తాం” అని నీతులు చెప్పారు. అయితే.. ఇప్పుడు కేవ‌లం రెండేళ్లు తిరిగే స‌రికి నాలిక రివ‌ర్స్ అయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌తంలో చెప్పిన నీతులు ఇప్పుడు జ‌గ‌న్ కానీ.. స్పీక‌ర్ కానీ.. మ‌రిచిపోయారా? అని ప్ర‌శ్నిస్తున్నారు. సో.. ఈ ప‌రిణామాల‌ను బ‌ట్టి.. అచ్చెన్న‌.. నిమ్మ‌ల‌పై వేటు వేస్తే.. అది అంతిమంగా.. జ‌గ‌న‌కు మైన‌స్ అవుతుంద‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి.

This post was last modified on September 22, 2021 12:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

1 hour ago

ఈ తరంలో చిరుకు నచ్చిన యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…

4 hours ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

10 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

12 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

12 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

13 hours ago