టీడీపీ కీలక నేతలు.. పార్టీ తరఫున బలమైన గళం వినిపిస్తున్న రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చ న్నాయుడు.. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడులపై వేటు వేసేందుకు రంగం సిద్ధమైంది. కొన్నాళ్ల కిందట..(సభలో కాదు) స్పీకర్ తమ్మినేని సీతారాంపై అచ్చెన్నాయుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది కూడా ఓ లేఖ రూపంలో ఆయన రాశారు. అయితే.. దీనిపై ఆయన ఎందుకో సంతకం చేయలేదు. కానీ, మీడియాలో వచ్చేసింది. అయితే.. ఈ లేఖపై సీతారాం.. అసెంబ్లీ హక్కుల కమిటీకి ఫిర్యాదు చేశారు. దీంతో రెండు సార్లు విచారణ చేసిన ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాని గోవర్ధన్రెడ్డి.. అచ్చెన్నపై చర్యలకు సిపారసు చేశారు.
అదేసమయంలో పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కూడా వైసీపీ అధినేత జగన్పై విమర్శలు గుప్పించారు. ఇది సభలోనే జరిగింది. పింఛన్లు పెంచుతూ.. పోతామన్నా.. కానీ.. కట్ చేస్తు న్నారని.. ఇదేనా సంక్షేమ పాలన అని విరుచుకుపడ్డారు. దీంతో ఈయనపై కూడా ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదులు అందాయి. దీంతో ఈయనపై కూడా విచారణ జరిపిన కాకాని నేతృత్వంలోని కమిటీ.. తాజాగా సిఫారసు చేసింది. ఈ ఇద్దరినీ.. త్వరలోనే ప్రారంభం కానున్న వర్షాకాల సమావేశాల్లో వీరిద్దరికీ.. మైక్ ఇవ్వకూడదని నిర్ణయించారు. ప్రస్తుతం ఇది సభాపతి సీతారాం పేషీకి చేరింది. దీనిపై ఆయన నిర్ణయం తీసుకుంటే.. ఇద్దరు కీలక నేతలకు వాయిస్ కట్ అవుతుంది.
అయితే.. ఈ విషయం ఇప్పుడు మరోసారి జగన్ మెడకు చుట్టుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే.. సీఎంగా పగ్గాలు చేపట్టిన తొలినాళ్లలో జరిగిన తొలి సభలో.. జగన్ ఆవేశంగా ప్రసంగించారు. గత స్పీకర్(అప్పటికి జీవించే ఉన్నారు) కోడెల శివప్రసాద్ పేరు చెప్పకుండానే నిప్పులు చెరిగారు. “అధ్యక్షా.. సభలో సభ్యులకు స్వేచ్ఛ ఉండాలి. మాట్లాడే అవకాశం ఇవ్వాలి. మా సభ్యురాలు.. రోజా.. ఏదో అన్నారని ఏకంగా ఏడాదిపాటు సస్పెండ్ చేశారు. ఇదేం అన్యాయం అధ్యక్షా! సభలో ప్రసంగించేప్పుడు.. సభ్యులకు స్వేచ్ఛ లేకపోతే.. ప్రజాస్వామ్యం ఎక్కడుంది అధ్యక్షా!!” అని ప్రశ్నించారు.
అంతేకాదు.. “మన సభలో(వైసీపీ సర్కారు హయాంలో) ఇలాంటి జరగకూడదు అధ్యక్షా! సస్పెండ్ల వరకు సభ పోకూడదు అధ్యక్షా! ఎవరికైనా మాట్లాడే స్వేచ్ఛ ఉండాలి. విమర్శలు ఏ రూపంలో ఉన్నా.. మేం స్వీకరిస్తాం. మేమేమీ.. భుజాలు తడుముకోం. చంద్రబాబు మాదిరిగా బితుకు బితుకు మంటూ.. సభను నిర్వహించం. ఎవరు ఏం చెప్పినా..పాజిటివ్గానే తీసుకుంటాం. ఈ సభ దేశానికే ఆదర్శంగా ఉండేలా చూస్తాం” అని నీతులు చెప్పారు. అయితే.. ఇప్పుడు కేవలం రెండేళ్లు తిరిగే సరికి నాలిక రివర్స్ అయిందని అంటున్నారు పరిశీలకులు. గతంలో చెప్పిన నీతులు ఇప్పుడు జగన్ కానీ.. స్పీకర్ కానీ.. మరిచిపోయారా? అని ప్రశ్నిస్తున్నారు. సో.. ఈ పరిణామాలను బట్టి.. అచ్చెన్న.. నిమ్మలపై వేటు వేస్తే.. అది అంతిమంగా.. జగనకు మైనస్ అవుతుందనే విశ్లేషణలు వస్తున్నాయి.
This post was last modified on September 22, 2021 12:56 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…