Political News

టీడీపీ నేత‌ల‌పై వేటు.. ఇది జ‌గ‌న్ నైతిక‌త‌కు దెబ్బేనా?

టీడీపీ కీల‌క నేత‌లు.. పార్టీ త‌రఫున బ‌ల‌మైన గ‌ళం వినిపిస్తున్న రాష్ట్ర టీడీపీ అధ్య‌క్షుడు కింజ‌రాపు అచ్చ న్నాయుడు.. పాల‌కొల్లు ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడుల‌పై వేటు వేసేందుకు రంగం సిద్ధ‌మైంది. కొన్నాళ్ల కింద‌ట‌..(స‌భ‌లో కాదు) స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాంపై అచ్చెన్నాయుడు కొన్ని వ్యాఖ్య‌లు చేశారు. అది కూడా ఓ లేఖ రూపంలో ఆయ‌న రాశారు. అయితే.. దీనిపై ఆయ‌న ఎందుకో సంత‌కం చేయ‌లేదు. కానీ, మీడియాలో వ‌చ్చేసింది. అయితే.. ఈ లేఖ‌పై సీతారాం.. అసెంబ్లీ హ‌క్కుల క‌మిటీకి ఫిర్యాదు చేశారు. దీంతో రెండు సార్లు విచార‌ణ చేసిన ప్రివిలేజ్ క‌మిటీ చైర్మ‌న్ కాకాని గోవ‌ర్ధ‌న్‌రెడ్డి.. అచ్చెన్న‌పై చ‌ర్య‌ల‌కు సిపార‌సు చేశారు.

అదేస‌మయంలో పాల‌కొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడు కూడా వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇది స‌భ‌లోనే జ‌రిగింది. పింఛ‌న్లు పెంచుతూ.. పోతామ‌న్నా.. కానీ.. క‌ట్ చేస్తు న్నార‌ని.. ఇదేనా సంక్షేమ పాల‌న అని విరుచుకుప‌డ్డారు. దీంతో ఈయ‌న‌పై కూడా ప్రివిలేజ్ క‌మిటీకి ఫిర్యాదులు అందాయి. దీంతో ఈయ‌న‌పై కూడా విచార‌ణ జ‌రిపిన కాకాని నేతృత్వంలోని క‌మిటీ.. తాజాగా సిఫార‌సు చేసింది. ఈ ఇద్ద‌రినీ.. త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్న వ‌ర్షాకాల స‌మావేశాల్లో వీరిద్ద‌రికీ.. మైక్ ఇవ్వ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించారు. ప్ర‌స్తుతం ఇది స‌భాప‌తి సీతారాం పేషీకి చేరింది. దీనిపై ఆయ‌న నిర్ణ‌యం తీసుకుంటే.. ఇద్ద‌రు కీల‌క నేత‌ల‌కు వాయిస్ క‌ట్ అవుతుంది.

అయితే.. ఈ విష‌యం ఇప్పుడు మ‌రోసారి జ‌గ‌న్ మెడ‌కు చుట్టుకునే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఎందుకంటే.. సీఎంగా ప‌గ్గాలు చేప‌ట్టిన తొలినాళ్ల‌లో జ‌రిగిన తొలి స‌భ‌లో.. జ‌గ‌న్ ఆవేశంగా ప్ర‌సంగించారు. గ‌త స్పీక‌ర్‌(అప్ప‌టికి జీవించే ఉన్నారు) కోడెల శివ‌ప్ర‌సాద్ పేరు చెప్ప‌కుండానే నిప్పులు చెరిగారు. “అధ్య‌క్షా.. స‌భ‌లో స‌భ్యుల‌కు స్వేచ్ఛ ఉండాలి. మాట్లాడే అవ‌కాశం ఇవ్వాలి. మా స‌భ్యురాలు.. రోజా.. ఏదో అన్నార‌ని ఏకంగా ఏడాదిపాటు స‌స్పెండ్ చేశారు. ఇదేం అన్యాయం అధ్య‌క్షా! స‌భ‌లో ప్ర‌సంగించేప్పుడు.. స‌భ్యుల‌కు స్వేచ్ఛ లేక‌పోతే.. ప్ర‌జాస్వామ్యం ఎక్క‌డుంది అధ్య‌క్షా!!” అని ప్ర‌శ్నించారు.

అంతేకాదు.. “మ‌న స‌భ‌లో(వైసీపీ స‌ర్కారు హ‌యాంలో) ఇలాంటి జ‌ర‌గ‌కూడ‌దు అధ్య‌క్షా! స‌స్పెండ్‌ల వ‌ర‌కు స‌భ పోకూడ‌దు అధ్య‌క్షా! ఎవ‌రికైనా మాట్లాడే స్వేచ్ఛ ఉండాలి. విమ‌ర్శ‌లు ఏ రూపంలో ఉన్నా.. మేం స్వీక‌రిస్తాం. మేమేమీ.. భుజాలు త‌డుముకోం. చంద్ర‌బాబు మాదిరిగా బితుకు బితుకు మంటూ.. స‌భ‌ను నిర్వ‌హించం. ఎవ‌రు ఏం చెప్పినా..పాజిటివ్‌గానే తీసుకుంటాం. ఈ స‌భ దేశానికే ఆద‌ర్శంగా ఉండేలా చూస్తాం” అని నీతులు చెప్పారు. అయితే.. ఇప్పుడు కేవ‌లం రెండేళ్లు తిరిగే స‌రికి నాలిక రివ‌ర్స్ అయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌తంలో చెప్పిన నీతులు ఇప్పుడు జ‌గ‌న్ కానీ.. స్పీక‌ర్ కానీ.. మ‌రిచిపోయారా? అని ప్ర‌శ్నిస్తున్నారు. సో.. ఈ ప‌రిణామాల‌ను బ‌ట్టి.. అచ్చెన్న‌.. నిమ్మ‌ల‌పై వేటు వేస్తే.. అది అంతిమంగా.. జ‌గ‌న‌కు మైన‌స్ అవుతుంద‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి.

This post was last modified on September 22, 2021 12:56 pm

Share

Recent Posts

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

3 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

3 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

4 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

4 hours ago

వ్య‌క్తి చ‌నిపోతే… కేసు మూసేయొచ్చు: ఉండ‌వ‌ల్లి కేసుపై సుప్రీంకోర్టు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ కీల‌క కేసు విష‌యంలో సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. వ్య‌క్తి చ‌నిపోయిన త‌ర్వాత‌.. కేసును…

5 hours ago

డాటరాఫ్ రవీనా… ఫలితం కూడా అదేనా

టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…

5 hours ago