Political News

ఆ టీడీపీ సీనియ‌ర్‌కు రెండు సీట్లు కావాల‌ట‌…!

రాయపాటి సాంబశివరావు…ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్‌లో పనిచేసి, పలుమార్లు గుంటూరు ఎంపీగా గెలిచిన రాయపాటి ఎన్నో కీల‌క ప‌ద‌వులు అధిరోహించారు. 2014 రాష్ట్ర విభజన నేపథ్యంలో రాయపాటి టి‌డి‌పిలోకి వచ్చేశారు. ఇక 2014 ఎన్నికల్లో నరసారావుపేట ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2019 ఎన్నికలోచ్చేసరికి రాయపాటి మళ్ళీ పోటీలోకి దిగడానికి కొంచెం తటపటాయించారు. తనతో తన కుమారుడు రాయ‌పాటి రంగారావుకు టికెట్ ఇస్తేనే పోటీ చేస్తానని అన్నారు. రంగబాబుకు సత్తెనపల్లి టికెట్ అడిగారు.

అక్కడ కోడెల శివప్రసాద్ ఉండటంతో చంద్రబాబు, రాయపాటి ఫ్యామిలీకి టికెట్ ఇవ్వలేదు. దీంతో రాయపాటి మళ్ళీ నరసారావుపేట పార్లమెంట్ బరిలో పోటీ చేశారు. కానీ జగన్ గాలిలో ఓటమి పాలయ్యారు. ఓడిపోయాక రాజకీయాలకు దూరం జరిగారు. ఒకానొక సమయంలో ఈయన వైసీపీ లేదా బి‌జే‌పిలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. కానీ రాయపాటి పార్టీ మారలేదు. తాజాగా ఏపీ పోలిటికల్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చి, తాను రాజకీయాల నుంచి రిటైర్ అయినట్లు ప్రకటించారు. అలాగే తన కుమారుడు, కుమార్తెలకు రెండు సీట్లు ఇవ్వాలని చంద్రబాబుని అడిగినట్లు చెప్పారు.

ఇందులో సత్తెనపల్లి సీటు కూడా ఉంది. కాకపోతే ఇప్పుడు సత్తెనపల్లిలో కోడెల తనయుడు శివరాం ఉన్నారు. ఆయనకే ఆ సీటు ఇవ్వాలని టి‌డి‌పిలో కొంద‌రు కోరుతున్నారు. కానీ అక్కడ శివరాంకు సొంత పార్టీ కార్యకర్తల నుంచే వ్యతిరేకత వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో రాయపాటి తన ఫ్యామిలీకి సత్తెనపల్లి టికెట్ అడుగుతున్నారు. అలాగే నరసారావుపేట పార్లమెంట్ సీటు ఎలాగో, వారి ఫ్యామిలీకే వచ్చేలా ఉంది.

మరి సత్తెనపల్లి విషయంలోనే క్లారిటీ రావాలి. కోడెల ఫ్యామిలీకి న్యాయం చేయాలనుకుంటే బాబు, శివరాంకే సీటు ఇస్తారు. లేదు అక్కడ వ్యతిరేకత ఉంది పార్టీకే ఇబ్బంది అవుతుందనుకుంటే రూట్ మార్చి రాయపాటి వారసుడుని రంగంలోకి దింపవచ్చు. చూడాలి మరి సత్తెనపల్లి సీటు విషయంలో ఎప్పటికి క్లారిటీ వస్తుందో ? ఏదేమైనా రాయ‌పాటి రెండు సీట్ల డిమాండ్ ఇప్పుడు గుంటూరు టీడీపీ సీనియ‌ర్ల‌లో కాక రేపుతోంది..!

This post was last modified on September 20, 2021 12:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈ సారి అమరావతికి మోదీ ఎం తెస్తున్నారు?

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…

1 hour ago

పొట్ట తగ్గటానికి ఈ పండ్లు తింటే చాలు

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…

3 hours ago

ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మంత్రులు

ఏపీ మంత్రి వ‌ర్గంలో సీఎం చంద్ర‌బాబు గీస్తున్న ల‌క్ష్మ‌ణ రేఖ‌ల‌కు.. ఆయ‌న ఆదేశాల‌కు కూడా.. పెద్ద‌గా రెస్పాన్స్ ఉండ‌డం లేద‌ని…

3 hours ago

గాయకుడి విమర్శ…రెహమాన్ చెంపపెట్టు సమాధానం

సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…

4 hours ago

‘వక్ఫ్’పై విచారణ.. కేంద్రానికి ‘సుప్రీం’ ప్రశ్న

యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…

5 hours ago

దర్శకుడి ఆవేదనలో న్యాయముంది కానీ

నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…

5 hours ago