Political News

మొత్తానికి షర్మిలను గుర్తించిన కేటీయార్

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను మంత్రి కేటీయార్ మొదటిసారిగా గుర్తించారు. రాజన్న రాజ్యం తెస్తానంటు తెలంగాణాలో కొంతకాలం పర్యటనలు చేసిన షర్మిల ఈ మధ్యనే కొత్త పార్టీ పెట్టారు. అయితే ఆమె పార్టీ పెట్టినా అనుకున్నంత మైలేజీ సాధించలేకపోతున్నారు. అందుకనే పార్టీ ఉనికిని కాపాడుకునేందుకా అన్నట్లుగా నిరుద్యోగ సమస్యలపై అప్పుడప్పుడు నిరాహార దీక్షలు చేస్తున్నారు.

ఆమె ఎంత అవస్థలు పడుతున్నా వైఎస్సార్టీపీ కూడా ఒక రాజకీయ పార్టయేనని, షర్మిలను పార్టీ అధ్యక్షురాలిగా గుర్తించటానికి మిగిలిన పార్టీలు ఇష్టపడటం లేదు. అందుకనే సందర్భం ఏదైనా మిగిలిన పార్టీలు షర్మిలను, ఆ పార్టీ గురించి ఏమీ మాట్లాడటం లేదు. అలాంటిది ఒక్కసారిగా మంత్రి కేటీఆర్ షర్మిల గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ఆమె వ్యవహారశైలిపై పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు గుప్పించారు.

వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల, బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్ జాతీయ పార్టీలకు తొత్తులుగా మంత్రి మండిపడ్డారు. ఎంతసేపు కేసీఆర్ గురించే తప్ప బీజేపీ, కాంగ్రెస్ పార్టీల గురించి షర్మిల ఎందుకు మాట్లాడటం లేదంటూ నిలదీశారు.  తన ప్రశ్నలోనే సమాధానం కూడా ఉందని కేటీయార్ మరచిపోయినట్లున్నారు. అధికారంలో ఉన్నది టీఆర్ఎస్, కేసీఆర్ సీఎం కాబట్టే షర్మిల కేసీయార్ గురించే మాట్లాడుతున్నారు.

కాంగ్రెస్, బీజేపీలు ప్రతిపక్షాలు కాబట్టి వాటిగురించి ఏమి మాట్లాడినా ఉపయోగం లేదనే మాట్లాడటం లేదన్న విషయాన్ని కేటీయార్ కు తెలీదా ? బీజేపీ అయినా కేసీయార్ గురించే కాంగ్రెస్ అయినా సీఎంనే కదా టార్గెట్ చేసుకున్నది. కాబట్టి ప్రతిపక్షాలు ఏవి మాట్లాడినా కేసీయార్ నే టార్గెట్ చేసుకుని మాట్లాడటంలో ఆశ్చర్యం ఏముంది ? పైగా కేసీయార్ ను నోటికొచ్చినట్లు తిడితే రాజద్రోహం కేసుల పెట్టడానికి కూడా ప్రభుత్వం వెనకాడేది లేదని కూడా కేటీయార్ హెచ్చరించటం ఆశ్చర్యంగా ఉంది.

చివరగా టీఆర్ఎస్ ఓట్లు చీల్చి జాతీయ పార్టీలకు లాభం చేయటానికే షర్మిల ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించటం గమనార్హం. సరే ఎలాంటి ఆరోపణలు చేసినా, విమర్శలు చేసినా మొత్తానికి షర్మిలను మంత్రి కేటీఆర్ గుర్తించటమే గమనించాలి. తమ అధినేత్రి షర్మిల గురించి కేటీయార్ అంతసేపు మాట్లాడటంపై బహుశా వైఎస్సార్టీపీ నేతలు చాలా హ్యాపీగా ఫీలవుతుంటారేమో. మొత్తానికి మొదటిసారి షర్మిలకు కూడా గుర్తింపు లభించినట్లయ్యింది.

This post was last modified on September 19, 2021 12:20 pm

Share

Recent Posts

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

36 minutes ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

51 minutes ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

52 minutes ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

2 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

3 hours ago

కన్నీటి పర్యంతమైన బొత్స

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…

3 hours ago