Political News

చంద్ర‌బాబు ఇంటిపై రాళ్ల దాడి.. ఉద్రిక్త‌త‌.. ఏం జ‌రిగింది?

టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ దాడిలో టీడీపీ నేత‌లు స‌హా.. మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. తీవ్ర ఉద్రిక్త‌త‌కు దారితీసిన ఈ ఘ‌ట‌న వివ‌రాలు.. ఇవీ.. గురువారం టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు.. మాజీ స్పీక‌ర్‌.. దివంగ‌త కోడెల శివ‌ప్ర‌సాద‌రావు వ‌ర్ధంతి జ‌రిగింది. దీనిని పుర‌స్క‌రించుకుని.. ప‌లువురు నాయ‌కులు గుంటూరు జిల్లా న‌కిరిక‌ల్లులో వ‌ర్ధంతి కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన మాజీ మంత్రి ఉత్త‌రాంధ్ర నాయ‌కుడు.. చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు.. సీఎం జ‌గ‌న్‌పై తీవ్ర‌స్తాయిలో విరుచుకుపడ్డారు.

‘‘చెత్తనాకొ… ఈ రోజున రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ముఖ్యమంత్రి మద్యం, మాంసం, చేపలు అమ్ముతాడా..! చెత్త, మరుగుదొడ్లపై పన్ను వేసే వాడిని చెత్త నా కొ… అనక ఏం అంటారు?’’ అని అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. ఇది.. ఇప్పుడు వివాదానికి దారితీసింది. అయ్య‌న్న వ్యాఖ్య‌ల‌పై చంద్ర‌బాబు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేస్తూ.. కృష్నాజిల్లా పెడ‌న ఎమ్మెల్యే జోగి ర‌మేష్ ఆధ్వ‌ర్యంలో టీడీపీ నాయ‌కులు.. ఉండ‌వ‌ల్లిలోని టీడీపీ అధినేత నివాసానికి వెళ్లి.. ధ‌ర్నా చేప‌ట్టారు. అయితే.. ఈ విష‌యం తెలిసి.. టీడీపీ నాయ‌కులు బుద్ధా వెంక‌న్న ఆధ్వ‌ర్యంలో అక్క‌డ‌కు వెళ్లి అడ్డుకున్నారు.

ఈ క్ర‌మంలో ఇరు వ‌ర్గాల మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇది తోపులాట‌కు కూడా దారి తీసింది. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు బాబు ఇంటికి వద్దకు చేరుకుంటున్నారు. బాబు ఇంటిపై దాడికి యత్నించడంతో టీడీపీ నేతలు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ క్ర‌మంలో టీడీపీ నేత బుద్దా వెంకన్న స్పృహ తప్పి పడిపోయారు. వైసీపీ నేతలు దాదాపు పది కార్లతో రాళ్లు, కర్రలతో దాడికి తెగబడ్డారని టీడీపీ నేతలు వాపోయారు.

చంద్రబాబు ఇంటి వద్ద జోగి రమేష్, టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. వైసీపీ నాయకులకు డీజీపీ కూడా సహకరిస్తున్నారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడంలేద నన్నారు. పట్టాభి మాట్లాడుతూ ఫ్యాక్టనిస్టు సీఎం అయితే ఇలానే ఉంటుందని మండిపడ్డారు. వైసీపీ నాయకులు ముందుగానే ప్రకటించి దాడికి పాల్పడుతుంటే.. పోలీసులు ఏం చేస్తున్నారని టీడీపీ శ్రేణులు ప్రశ్నించాయి. సీఎం ప్రోద్భలంతోనే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. మొత్తానికి ఈ వివాదం తీవ్ర రూపం దాల్చడం గ‌మ‌నార్హం.

This post was last modified on September 17, 2021 3:51 pm

Share
Show comments
Published by
Satya
Tags: Chandrababu

Recent Posts

`చ‌లానా` పడిందా… బ్యాంక్ నుండి మనీ కట్

వాహ‌న‌దారుల‌కు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ర‌హ‌దారుల‌పై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహ‌నాలు న‌డుపుతూ..…

19 minutes ago

బాబు, లోకేష్… సొంతూరికి వెళ్తూ స‌మ‌స్య‌ల‌పై దృష్టి!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు.. మూడు రోజుల‌ సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…

6 hours ago

జిల్లాల విషయంలో తగ్గేదేలే అంటున్న రేవంత్

రాష్ట్రంలో అభివృద్ది చేసే విష‌యంలో ఎవ‌రు ఎన్ని విధాల అడ్డు ప‌డినా.. తాము ముందుకు సాగుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్…

8 hours ago

బడ్జెట్ 2026: అప్పులు తగ్గేలా నిర్మలమ్మ ప్లాన్

2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన…

9 hours ago

టీమ్ ఇండియాలోకి కొత్త కుర్రాడు

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…

9 hours ago

ఒక్క సెలవు కూడా తీసుకొని సీఎం

ప్ర‌జ‌ల కోసం తాను ఒక్క‌రోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా ప‌నిచేస్తున్న‌ట్టు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ…

11 hours ago