Political News

ఏపీలో ముందస్తు ఎన్నికలా ?

ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికల జరగబోతున్నాయా ? మంత్రివర్గ సమావేశం తర్వాత మంత్రులతో జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా అవుతున్న ప్రచారంచూస్తే అందరిలో ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. క్యాబినెట్ సమావేశం నుండి ఉన్నతాధికారులు వెళిపోయిన తర్వాత జగన్ సహచర మంత్రులతో పిచ్చాపాటి మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతు ఎన్నికల మూడ్ లోకి ఇప్పటినుండే షిఫ్ట్ అయిపోవాలని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.

నిజానికి షెడ్యూల్ ఎన్నికలు 2024లో జరగాలి. అంటే షెడ్యూల్ ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ సమయం ఉంది. మరలాంటపుడు ఇప్పటినుండే ఎన్నికల మూడ్ లోకి పార్టీ నేతలు ఎందుకు షిఫ్టవ్వాలో అర్ధంకావటంలేదు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటు అందరు ముందుకు సాగాలని చెప్పటం మామూలే. వచ్చే ఏడాదే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) బృందం రంగంలోకి దిగుతుందని చెప్పారట.

ఎన్నికలు ఎప్పుడో మూడేళ్ళ తర్వాత జరుగుతుంటే వచ్చే ఏడాదిలోనే పీకే టీం రంగంలోకి దిగి ఏమి చేస్తుందో అర్ధంకావటంలేదు. ఎన్నికల ప్రణాళికలో భాగంగా అందరు ఇప్పటి నుండే క్షేత్రస్ధాయిలో పర్యటనలు చేయాలని జగన్ చెప్పారట. ఏ సీఎం అయినా మంత్రులు, ఎంఎల్ఏలతో పాటు ప్రజా ప్రతినిధులందరినీ క్షేత్రస్ధాయిలోతిరుగుతు జనాలకు అందుబాటులోనే ఉండాలని చెప్పటం సహజమే కదా.

క్యాబినెట్ లో మంత్రులకు జగన్ చేసిన సూచనలు నిజమే అయితే ముందస్తు ఎన్నికలకు జగన్ రెడీ అవుతున్నట్లే అనుమానించాలి. ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచన ఉంటే మంత్రులకు, ప్రజాప్రతినిధులకు జగన్ ఇలాంటి సూచనలు ఇచ్చే అవకాశాలు లేవు. నిజానికి మొన్నటి ఎన్నికల్లో గెలిచిన ఎంఎల్ఏల్లో అత్యధికులు జగన్ బొమ్మ కారణంగానే గెలిచారన్నది వాస్తవం. ఎవరు పోటీచేస్తున్నారన్న విషయంతో సంబంధం లేకుండానే వైసీపీ తరపున పోటీచేస్తున్నారన్న ఒకే కారణంతో చాలా చోట్ల అభ్యర్ధులకు జనాలు ఓట్లేసేశారు.

కాబట్టి వచ్చే ఎన్నికల్లో అయినా సేమ్ సీన్ రిపీటవుతుందనటంలో సందేహమే లేదు. కాకపోతే క్షేత్రస్ధాయిలో కొందరు ఎంఎల్ఏలపై ఇప్పుడిప్పుడే వ్యతిరేకత మొదలవుతోందంటున్నారు. కాబట్టి వ్యతిరేకత ఎదుర్కొంటున్న వాళ్ళల్లో కొందరిని మార్చే అవకాశం ఉంది. ఇలాంటి నియోజకవర్గాల్లో జగన్ పీకే టీం సేవలను తీసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ నేతలంటున్నారు. సో జగన్ మాటలను బట్టి చూస్తే ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశాలే ఎక్కువున్నట్లు అనుమానంగా ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో.

This post was last modified on September 17, 2021 11:07 am

Share
Show comments
Published by
satya

Recent Posts

జ‌గ‌న్‌లో ఓట‌మి భ‌యానికిది సంకేత‌మా?

ఆంధ్ర‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకో వార‌మే స‌మ‌యం ఉంది. ఈ ఎన్నిక‌లు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌కు, అటు ప్ర‌తిప‌క్ష…

4 hours ago

ఫ్యామిలీ మ్యాన్ ఫ్యాన్స్‌కు స్వీట్ న్యూస్

‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…

5 hours ago

ప‌థ‌కాల మాట ఎత్తొద్దు: జ‌గ‌న్‌కు ఈసీ షాక్‌!

ఏపీ ప్ర‌భుత్వానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జ‌గ‌న్ ప్ర‌బుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను ఎన్నిక‌ల…

9 hours ago

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

12 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

13 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

14 hours ago