ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై మరో 24 గంటల్లో హైదరాబాద్లోని సీబీఐ ప్రత్యేక కోర్టు.. తీర్పు వెలువరించనున్న విషయం తెలిసిందే. ఈ తీర్పు ఎలా ఉంటుంది? జగన్ బెయిల్ రద్దవుతుందా? లేదా? ఒకవేళ రద్దయితే.. ఏపీలో పాలన పరిస్థితి ఏంటి? ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? జగన్ జైలుకు వెళ్తారా? ఇలా.. అనేక ప్రశ్నలు.. ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే.. ఇంతలోనే ఈ బెయిల్ రద్దు కోరుతూ.. పిటిషన్ దాఖలు చేసిన వైసీపీ ఎంపీ.. రఘురామ కృష్ణరాజు ఉరఫ్ ఆర్ఆర్ఆర్.. సంచలన నిర్ణయం తీసుకున్నారు.
వాస్తవానికి గత కొన్నాళ్ల కిందట.. ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దుచేయాలని.. కోరుతూ.. ఆర్ఆర్ఆర్ నాంపల్లి లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న జగన్.. తన కేసులకు సంబంధించి.. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని.. అందుకే ఆయన బెయిల్ రద్దు చేయాలని రఘురామ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణలో సీబీఐ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదులు.. జగన్ బెయిల్ రద్దుపై కోర్టు విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థించారు. దీంతో.. జగన్ బెయిల్ రద్దుపై ఉత్కంఠ ఏర్పడింది.
ఇక, దీనిపై మరో 24 గంటల్లో తీర్పు వెలువడుతుందనగా.. ఆర్ఆర్ఆర్.. తాజాగా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. సీఎం జగన్, విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్ను మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ.. తెలంగాణ హైకోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ వేశారు. సీబీఐ కోర్టు రేపు ఉత్తర్వులు ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పిటిషన్పై అత్యవసర విచారణ జరపాలని రఘురామ కోరటంతో.. ఈ రోజు విచారణ జరుపుతామని ధర్మాసనం తెలిపింది. అయితే.. అనూహ్యంగా ఆర్ఆర్ఆర్ యూటర్న్ తీసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on September 14, 2021 3:44 pm
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…