రాజన్న రాజ్యం తేవడమే లక్ష్యమని తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి పేరుతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించిన వైఎస్ షర్మిలకు ఆరంభం నుంచి ఆటుపోట్లు తప్పట్లేదు. తెలంగాణలో తన తండ్రి పేరుతో పార్టీ పెడితే వైఎస్కు విధేయులుగా కొనసాగిన నేతలు అభిమానులుగా ఉన్న కార్యకర్తలు తన పార్టీలోకి పెద్ద సంఖ్యలో వస్తారని ఆశించిన ఆమె ఆశలు తీరలేదు. పార్టీలోకి ఎలాంటి వలసలు చేరికలు లేవు. కీలక నేతలు ఆ పార్టీ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. పైగా ఆ పార్టీలో మొదటి నుంచి కీలకంగా వ్యవహరించిన ఇందిరా శోభన్ లాంటి ప్రధాన నేతలే షర్మిలకు గుడ్బై చెప్పి వెళ్లిపోయారు.
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను నెత్తినెత్తుకొని వారానికో చోట నిరసన దీక్ష చేస్తున్న ఆమెకు అనుకున్న స్థాయిలో పొలిటికల్ మైలేజీ రావడం లేదు. అధికార టీఆర్ఎస్ సహా కాంగ్రెస్ బీజేపీ పార్టీలో ఆమెను రాజకీయ ప్రత్యర్థిగా పరిగణించడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు తన కూతురి రాజకీయ కెరీర్కు వేగాన్ని ఇచ్చే దిశగా వైఎస్ సంస్మరణ సభ పేరుతో విజయమ్మ నిర్వహించిన కార్యక్రమం వల్ల షర్మిలకు ఎలాంటి మేలు జరగలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఇక ఈ నెలలో పాదయాత్ర మొదలెట్టనున్నారనే సమాచారం ఉంది. ఆమెకు మిగిలిన మార్గం అదొక్కటేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
మరోవైపు తన పార్టీని అంతర్గతంగా బలోపేతం చేయడంపై షర్మిల దృష్టి సారించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలో నుంచి నేతలు బయటకు వెళ్లకుండా ఆమె జాగ్రత్త పడుతున్నారని ఆ దిశగా వ్యూహాలు రచిస్తున్నారని తెలిసింది. తాజాగా తుంగతుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా తమ పార్టీ నేత ఏపూరి సోమన్న పేరును ఆమె ప్రకటించడం ఈ వ్యూహంలో భాగమేనని రాజకీయ నిపుణులు అనుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఆదివారం నిర్వహించిన దళితభేరి బహిరంగ సభలో ఆమె తుంగతుర్తి వైతేపా అభ్యర్థిగా ఏపూరి సోమన్న పేరును ప్రకటించారు.
తెలంగాణలో బలమైన కేసీఆర్తో సహా పటిష్ఠంగా ఉన్న కాంగ్రెస్ బీజేపీలతో ఢీకొట్టి అధికారం దక్కించుకోవాలనే ఉద్దేశంతో అడుగులు వేస్తున్న షర్మిల వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచి సన్నద్ధమవుతున్నాననే సంకేతాలను ఇప్పుడు పంపించిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పార్టీలో ఉన్న నేతలను కాపాడుకుంటూనే ప్రత్యర్ఙి పార్టీలకు సవాలు విసిరేందుకు ఆమె సిద్ధమైందని నిపుణులు చెబుతున్నారు.
This post was last modified on September 13, 2021 11:41 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…