Political News

6 నెలలు మాత్రమే రక్షణట

కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం తగ్గుతోంది, మళ్ళీ మళ్ళీ పెరుగుతోంది. ఈ దశలో కరోనా వైరస్ బారి నుండి మనల్ని మనం కాపాడుకోవటానికి రెండు డోసుల కోవిడ్ టీకాలు వేసుకోవటం ఒకటే మార్గమని శాస్త్రజ్ఞులు, వైద్య నిపుణులు పదే పదే చెబుతున్నారు. రెండు టీకాలు తీసుకున్నవారు కూడా హమ్మయ్య మనకేం ప్రమాదం లేదని ప్రశాంతంగా ఉన్నారు. అయితే తాజాగా వెల్లడైన అధ్యయనం ప్రకారం రెండు డోసులు తీసుకున్నంత మాత్రాన వైరస్ నుండి రక్షణ వచ్చినట్లు కాదట.

అమెరికా డాక్టర్ చిలిమూరి శ్రీధర్ అధ్యయనం ప్రకారం రెండు డోసుల రక్షణ కేవలం 6 మాసాలు మాత్రమే ఉంటుందని తేలింది. రెండు టీకాలు వేసుకున్న 6 మాసాల వరకు మాత్రమే యాంటీబాడీలు రక్షిస్తాయి అని తేలిందట. తర్వాత కంపల్సరీగా మూడో డోసు కూడా వేసుకుంటేనే మరింత రక్షణగా ఉంటుందని అర్ధమవుతోంది. మరి మూడో డోసుతో సరిపోతుందా లేకపోతే కొంతకాలం తర్వాత నాలుగో డోసు కూడా అవసరమని అంటారేమో తెలీదు. సాధారణ వ్యక్తులు మూడో డోసు తీసుకున్న 6-8 నెలల మధ్య మూడో డోసు తీసుకోవాల్సిందే అని డాక్టర్ చెప్పారు.

అలాగే రోగనిరోధక శక్తి ఉన్న మామూలు మనుషులు రెండో డోసు తీసుకున్న నాలుగు వారాలకే మూడో డోసు వేసుకోవాల్సిందే అని శ్రీధర్ చెప్పటం కాస్త ఆందోళనకరమే. ప్రస్తుత కాలంలో జీవన విధానం ప్రకారం చూస్తే చాలామందిలో రోగనిరోధక శక్తి తగ్గిపోతోందని అందరికీ తెలిసిందే. 2024 నాటికి కాని కరోనా వైరస్ ప్రభావం తగ్గదని తేలిందట. అప్పటికి కూడా పూర్తిగా మాయమైపోతుందని చెప్పటంలేదు. ప్రభావం తగ్గుతుందని మాత్రమే చెబుతున్నారంటే అప్పటికి కూడా కరోనా వైరస్ ఏదోరూపంలో ఉంటుందని స్పష్టమవుతోంది.

రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి, ముసలివాళ్ళకు కచ్చితంగా మూడో డోసు ఇస్తేనే పరిస్ధితులు అదుపులో ఉంటాయని శ్రీధర్ చెప్పారు. టీకాలు తీసుకోని 18 ఏళ్ళలోపు వారికి కరోనా వైరస్ సోకే ప్రమాధం ఎక్కువగా ఉందట. టీకాలు తీసుకోని 20-30 ఏళ్ళ మధ్య యువకులకు అమెరికాలో కరోనా వైరస్ ఎక్కువగా సోకిన విషయాన్ని డాక్టర్ గుర్తుచేశారు. మాస్కులు ధరించటం, భౌతికదూరాన్ని పాటించటం, ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు కూర్చోవటమే కరోనా వైరస్ కట్టడికి మంచి మార్గాలుగా డాక్టర్ చెప్పారు.

బయటపడుతున్న కరోనా వైరస్ కొత్త వేరియంట్లు కొన్నిదేశాల్లో టీకాల ప్రభావాన్ని కూడా తట్టుకుని విజృంభిస్తున్న విషయాన్ని డాక్టర్ తెలిపారు. అందుకనే మూడో డోసుకూడా వేసుకోవాల్సిందే అని గట్టిగా చెబుతున్నారు. అమెరికా లాంటి కొన్ని దేశాల్లో టీకాల ప్రభావం కన్నా వైరస్ ప్రభావమే ఎక్కువగా కనిపించిందని చెప్పారు. రెండు డోసుల టీకాలు తీసుకున్న వారికి కూడా కరోనా వైరస్ సోకుతున్నపుడు ఇక టీకాలు తీసుకోనివారి పరిస్ధితి ఏమిటనే విషయంలో డాక్టర్ ఆందోళన వ్యక్తంచేయటం గమనార్హం. అంటే డాక్టర్ చెప్పింది చూస్తుంటే ఎన్ని డోసులు తీసుకున్నా ఉపయోగం ఉండేట్లులేదు.

This post was last modified on September 12, 2021 1:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

8 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

10 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

10 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

11 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

11 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

13 hours ago