రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 72 నియోజకవర్గాల్లో గెలుస్తుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన అందరికీ తెలిసిందే. తాను చెప్పినన్ని సీట్లు వస్తాయో రావో ఇప్పుడే చెప్పలేం కానీ రేవంత్ అయితే పార్టీకి మునుపటి జోష్ తేవడానికి చాలా కష్టపడుతున్నారు. పార్టీ నేతల్లో ముఖ్యంగా యువతలో ఉత్సాహం నింపడానికి రేవంత్ చాలా గట్టిగానే ట్రై చేస్తున్నారు. పార్టీలో గతంలో ఎప్పుడు లేనంతగా ఇపుడు యువనేతలనే రేవంత్ బాగా ప్రోత్సహిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.
దాదాపు ఏడేళ్ళుగా పార్టీ నేతలు, క్యాడర్లో కనబడని జోష్ రేవంత్ చేతికి పార్టీ పగ్గాలు వచ్చిన తర్వాతే కనబడుతోందన్నది వాస్తవం. అందుకనే పార్టీ వైపు ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఆకర్షించేందుకు రేవంత్ తన వంతుగా బాగా కష్టపడుతున్నారు. ఇందులో భాగంగానే ఇంద్రవెల్లిలో దళిత, గిరిజన దండోరా పేరుతో సభ నిర్వహించారు. తర్వాత మూడు చింతల లో వరుసగా రెండు రాత్రుళ్ళు బస చేశారు. అంటే రేవంత్ చేపడుతున్న కార్యక్రమాలన్నీ పార్టీకి దూరమైన వర్గాలను మళ్ళీ చేరువచేయటమని అర్ధమవుతోంది.
సరే ఈ విషయాలన్నింటినీ పక్కన పెట్టేస్తే రాబోయే ఎన్నికల్లో పార్టీకి 72 సీట్లు వస్తాయని రేవంత్ వేసిన అంచనాకు ఓ లెక్కుందట. అదేమిటంటే ఉమ్మడి జిల్లాలు ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్ తో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిపైనే రేవంత్ ప్రధానంగా దృష్టి పెట్టినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. పై జిల్లాల్లోని అసెంబ్లీ సీట్లలో అత్యధికం కాంగ్రెస్ స్వీప్ చేస్తుందని రేవంత్ అంచనా వేసుకున్నారట. పై జిల్లాల్లోనే పార్టీకి కనీసం 55 సీట్ల వరకు వస్తాయని రేవంత్ గట్టిగా నమ్ముతున్నారట.
పై జిల్లాలు కాకుండా గ్రేటర్ పరిధిలో కొన్ని సీట్లు వస్తాయని అంచనాలో ఉన్నారట. ఇక ఈ జిల్లాలు కాకుండా ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ లాంటి జిల్లాల్లో కూడా కొన్ని సీట్లలో గెలిచినా పార్టీ కచ్చితంగా అధికారంలోకి వచ్చేస్తుందన్నది రేవంత్ అంచనాగా తెలుస్తోంది. మరి రేవంత్ అంచనా ఏ మేరకు ఫలిస్తుందో చూడాల్సిందే. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో అధికారం తమదే అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పదే పదే చెబుతున్నారు. ఇదే సమయంలో మరో 20 ఏళ్ళు తమదే అధికారమని టీఆర్ఎస్ మంత్రులు గట్టిగా చెబుతున్నారు. మరి ఎవరి అంచనాలు ఫలిస్తాయో చూడాల్సిందే.
This post was last modified on September 7, 2021 3:38 pm
వైైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన కన్న తల్లి విజయమ్మ నుంచే భారీ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం పనిచేస్తోందని ఆరోపించిన కొన్ని గంటల వ్యవధిలోనే టీడీపీ యువనాయకుడు,…
సౌత్ దర్శకుల్లో రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ తర్వాత అంతకన్నా తక్కువో ఎక్కువో స్టార్ డం తెచ్చుకున్న వాళ్లలో లోకేష్ కనగరాజ్…
ఇటీవలే జరిగిన ఒక ఈవెంట్ లో అమీర్ ఖాన్ మాట్లాడుతూ థియేటర్ ఓటిటి మధ్య ఇప్పుడున్న గ్యాప్ సరిపోదని నాలుగు…
రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల ఇంచార్జ్లను మార్చనున్నట్లు వైసీపీ అధినేత జగన్ చెప్పారు. అయితే దీనికి కొంత సమయం పడుతుందన్నారు.…
పహల్ గాం ఉగ్రవాద దాడి తదనంతర పరిణామాల్లో భాగంగా మంగళవార తెల్లవారుజామున భారత త్రివిధ దళాలు పాకిస్తాన్ భూభాగంలోని ఆ దేశ…