రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 72 నియోజకవర్గాల్లో గెలుస్తుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన అందరికీ తెలిసిందే. తాను చెప్పినన్ని సీట్లు వస్తాయో రావో ఇప్పుడే చెప్పలేం కానీ రేవంత్ అయితే పార్టీకి మునుపటి జోష్ తేవడానికి చాలా కష్టపడుతున్నారు. పార్టీ నేతల్లో ముఖ్యంగా యువతలో ఉత్సాహం నింపడానికి రేవంత్ చాలా గట్టిగానే ట్రై చేస్తున్నారు. పార్టీలో గతంలో ఎప్పుడు లేనంతగా ఇపుడు యువనేతలనే రేవంత్ బాగా ప్రోత్సహిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.
దాదాపు ఏడేళ్ళుగా పార్టీ నేతలు, క్యాడర్లో కనబడని జోష్ రేవంత్ చేతికి పార్టీ పగ్గాలు వచ్చిన తర్వాతే కనబడుతోందన్నది వాస్తవం. అందుకనే పార్టీ వైపు ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఆకర్షించేందుకు రేవంత్ తన వంతుగా బాగా కష్టపడుతున్నారు. ఇందులో భాగంగానే ఇంద్రవెల్లిలో దళిత, గిరిజన దండోరా పేరుతో సభ నిర్వహించారు. తర్వాత మూడు చింతల లో వరుసగా రెండు రాత్రుళ్ళు బస చేశారు. అంటే రేవంత్ చేపడుతున్న కార్యక్రమాలన్నీ పార్టీకి దూరమైన వర్గాలను మళ్ళీ చేరువచేయటమని అర్ధమవుతోంది.
సరే ఈ విషయాలన్నింటినీ పక్కన పెట్టేస్తే రాబోయే ఎన్నికల్లో పార్టీకి 72 సీట్లు వస్తాయని రేవంత్ వేసిన అంచనాకు ఓ లెక్కుందట. అదేమిటంటే ఉమ్మడి జిల్లాలు ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్ తో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిపైనే రేవంత్ ప్రధానంగా దృష్టి పెట్టినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. పై జిల్లాల్లోని అసెంబ్లీ సీట్లలో అత్యధికం కాంగ్రెస్ స్వీప్ చేస్తుందని రేవంత్ అంచనా వేసుకున్నారట. పై జిల్లాల్లోనే పార్టీకి కనీసం 55 సీట్ల వరకు వస్తాయని రేవంత్ గట్టిగా నమ్ముతున్నారట.
పై జిల్లాలు కాకుండా గ్రేటర్ పరిధిలో కొన్ని సీట్లు వస్తాయని అంచనాలో ఉన్నారట. ఇక ఈ జిల్లాలు కాకుండా ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ లాంటి జిల్లాల్లో కూడా కొన్ని సీట్లలో గెలిచినా పార్టీ కచ్చితంగా అధికారంలోకి వచ్చేస్తుందన్నది రేవంత్ అంచనాగా తెలుస్తోంది. మరి రేవంత్ అంచనా ఏ మేరకు ఫలిస్తుందో చూడాల్సిందే. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో అధికారం తమదే అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పదే పదే చెబుతున్నారు. ఇదే సమయంలో మరో 20 ఏళ్ళు తమదే అధికారమని టీఆర్ఎస్ మంత్రులు గట్టిగా చెబుతున్నారు. మరి ఎవరి అంచనాలు ఫలిస్తాయో చూడాల్సిందే.
This post was last modified on September 7, 2021 3:38 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…