Political News

దేవుళ్ల‌కు రాజ‌కీయ రంగు

రాజ‌కీయ నాయ‌కుల‌కు ప‌రిమితులంటూ ఏమీ ఉండ‌వు. ఏ విష‌యాన్ని అయినా అనుకున్న‌దే ఆల్యంగా రాజ‌కీయాలు చేసేస్తారు. త‌మ పార్టీ ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌జ‌ల పేరుతో ప్ర‌తి విష‌యానికి రాజ‌కీయ రంగు పులుముతుంటారు. అందుకు దేవుళ్లు కూడా మిన‌హాయింపేమీ మాదు. ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని రాజ‌కీయాలు చూస్తుంటే అదే నిజ‌మ‌ని అనిపించ‌క మాన‌దు. ఇప్పుడ‌క్క‌డ దేవుళ్లు.. మ‌తం అధికార వైసీపీ ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు ఆయుధంగా మారాయి.

కేంద్రం విడుద‌ల చేసిన క‌రోనా మార్గ‌ద‌ర్శ‌నాల దృష్ట్యా రాష్ట్రంలో ఇక వైర‌స్ అదుపులోకి రాలేదు కాబ‌ట్టి బ‌హిరంగంగా వినాయ‌క చ‌వితి ఉత్స‌వాల‌పై ఏపీ ప్ర‌భుత్వం నిషేధం విధించింది. ఇళ్ల‌ల్లోనే పండ‌గ చేసుకోవాల‌ని సూచిస్తూ బ‌య‌ట మండ‌పాల ఏర్పాటు ఊరేగింపులు నిమ‌జ్జ‌నాల‌ను నిషేధిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై ఇప్పుడు ప్ర‌త్య‌ర్థి పార్టీల నుంచే కాకుండా ప్ర‌జ‌ల నుంచి కూడా వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్న‌ద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ సందర్భాన్ని అవ‌కాశంగా తీసుకుని పార్టీలు మ‌త రాజ‌కీయాల‌కు తెర‌దీశాయ‌ని అది ప్ర‌జ‌స్వామ్యానికి చేట‌ని ఓ వ‌ర్గం ప్ర‌జ‌స్వామ్య వాదులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

వినాయ‌క చ‌వితి ఉత్స‌వాల‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వం ర‌ద్దు చేయ‌డంతో దొరికిందో ఛాన్స్‌గా రాష్ట్ర బీజేపీ నేత‌లు నిర‌స‌న‌ల‌న‌కు దిగారు. జ‌గ‌న్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఆయ‌న హిందూ వ్య‌తిరేకి కావ‌డం కార‌ణంగానే వినాయ‌క చ‌వితి వేడుక‌ల‌కు అడ్డుప‌డుతున్నార‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఈ ఆంక్ష‌ల‌ను ఎత్తివేయాల‌ని ఇప్ప‌టికే బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళ‌న‌ల‌కు దిగింది. ఈ వేడుక‌ల‌ను ర‌ద్దు చేయ‌డం వెన‌క కుట్ర ఉంద‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు ఆరోపించ‌డం రాజ‌కీయ వేడిని మ‌రింత పెంచింది. అయితే కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అనుగుణంగానే న‌డుచుకుంటున్నామ‌ని రాష్ట్రంలోని ఆ పార్టీ నేత‌లు రెచ్చ‌గొడితే ఊరుకునేది లేద‌ని వైసీపీ నేత‌లు ఎదురు దాడికి దిగ‌డంతో ఇప్పుడు రాజ‌కీయాల‌న్నీ వినాయ‌కుడి చుట్టూనే అల్లుకుని సాగుతున్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

ఇక వైసీపీ పాల‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తున్న ఆ పార్టీ రెబ‌ల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఈ వివాదంపై మ‌రో అడుగు ముందుకేశార‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏసుకు లేని క‌రోనా గ‌ణేశ్‌కు ఎందుక‌ని ఆయ‌న ప్ర‌శ్నించ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏపీ చ‌ర్చిల్లో ప్రార్థ‌న‌ల‌కు అనుమ‌తించాడ‌న్ని గుర్తు చేసిన ఆయ‌న‌.. అక్క‌డ క‌రోనా రాదా? అని ప్ర‌శ్నించారు. హిందువులంద‌రూ ఆరాధించే వినాయ‌కుడి పూజ‌ల‌కు ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నార‌ని విగ్ర‌హాలు ధ్వంసం చేసిన వాళ్ల‌ను ప‌ట్టుకోలేద‌ని ఇప్పుడేమో విగ్ర‌హాలు అమ్మ‌నీయ‌కుండా చేస్తున్నార‌ని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. దీంతో మొత్తానికి రాష్ట్రంలో రాజ‌కీయాల‌న్నీ దేవుళ్లు చుట్టు తిరుగుతున్నాయ‌ని ప్ర‌జ‌లు అనుకుంటున్నారు.

This post was last modified on September 7, 2021 3:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

3 hours ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

6 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

7 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

8 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

9 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

10 hours ago