అన్ని రంగాల్లో మన దేశం ముందుకు దూసుకుపోతోంది. ఇలాంటి రోజుల్లోనూ ఇంకా మూఢ నమ్మకాలు పట్టుకొని వేలాడేవారు చాలా మందే ఉన్నారు. అందుకు తాజా సంఘటనే ఉదాహరణ. తమ గ్రామంలో వర్షాలు పడాలని.. మైనర్ బాలికలను నగ్నంగా ఊరేగించారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
దమోహ్ జిల్లాలోని బనియా గ్రామంలో చాలా ఏళ్లుగా వర్షాలు పడక కరువు తాండవిస్తోంది. బాలికలతో నగ్నంగా ఊరేగింపు జరిపిస్తే వరుణ దేవుడు కరుణించి, వర్షాలు కురిపిస్తాడన్న అంధ విశ్వాసంతో గ్రామ పెద్దలు సభ్య సమాజం తలదించుకొనే దురాగతానికి ఒడిగట్టారు.
దీనికి సంబంధించిన రెండు వీడియోలు తెరపైకి వచ్చాయి. జిల్లా కేంద్రానికి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ దారుణంపై తమకు సమాచారం అందిందని పోలీసులు చెప్పారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించామని, బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నగ్న ప్రదర్శనకు బాధిత బాలికల తల్లిదండ్రులు సైతం అంగీకరించినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు.
వర్షాల కోసం కప్పను ఒక దుంగకు కట్టి, గ్రామంలో ఊరేగించడం చాలామందికి తెలిసిందే. బనియా గ్రామంలో బాలికలను నగ్నంగా మార్చి, వారితో కప్ప ఊరేగింపు నిర్వహించారని దమోహ్ జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ ఉదంతంపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై నివేదిక ఇవ్వాలని దమోహ్ జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది.
This post was last modified on September 7, 2021 9:20 am
సినీ రంగంలో కొందరికి కొందరితో చిత్రమైన బంధం మొదలవుతుంది. థ్రిల్లర్ సినిమాల స్పెషలిస్టుగా ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించిన అడివి…
ఒక నెల ముందు వరకు మెగా అభిమానులకు దర్శకుడు బుచ్చిబాబు సానా ఎంతో ఇష్టుడిగా ఉండేవాడు. ఆచార్య, గేమ్ చేంజర్…
‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్నాడు ప్రభాస్. అలాంటి హీరోతో సినిమా తీసే…
వాయిదాల మీద వాయిదాలతో అభిమానుల సహనంతో ఆడుకున్న పెద్ది విడుదల తేదీ వ్యవహారం కొలిక్కి వచ్చేసింది. ధనుష్ కర ప్రీ…
తెలంగాణ రాష్ట్ర సేన.. అంటూ టీఆర్ ఎస్ పార్టీని స్థాపించిన కవిత వ్యవహారంపై బీఆర్ ఎస్ నాయకులు మౌనంగా ఉన్నారు.…
మోహన్ లాల్ దృశ్యం 3 మరోసారి రిలీజ్ డేట్ ప్రకటించింది. మే 21 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు అధికారికంగా…