Political News

జ‌మ్మ‌ల‌మ‌డుగులో టీడీపీకి ఆయ‌నే దిక్కు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం ఇప్ప‌టి నుంచే క‌స‌ర‌త్తులు మొదలెట్టిన మాజీ ముఖ్య‌మంత్రి తెలుగు దేశం పార్టీ అధినాయ‌కుడు చంద్ర‌బాబు నాయుడు ఆ దిశ‌గా వేగంగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలోని నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ శ్రేణుల‌ను తిరిగి ఆక్టివ్ చేసే ప‌నిలో ప‌డ్డ ఆయ‌న‌.. ఆ మేర‌కు ఇంఛార్జ్‌ల‌ను నియ‌మిస్తున్నారు. అందులో భాగంగానే క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జ్‌గా దేవ‌గుడి భూషేష్‌రెడ్డిని బాబు నియ‌మించారు. క‌డ‌ప టీడీపీ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ స‌మీక్ష స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

జ‌మ్మ‌ల‌మ‌డుగులో రాజ‌కీయ ప‌రిస్థితులు విచిత్రంగా ఉన్నాయి. టీడీపీ నుంచి మాజీ మంత్రులు ఆదినారాయ‌ణ రెడ్డి బీజేపీలో, పి.రామ‌సుబ్బారెడ్డి వైసీపీలో చేర‌డంతో అక్క‌డ పార్టీని న‌డిపించే నాయ‌కుడు లేకుండా పోయారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆ పార్టీకి జ‌మ్మ‌ల‌మ‌డుగులో దిక్కెవ‌రూ అనుకుంటున్న త‌రుణంలో ఈ ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి బీజేపీలో చేరిన‌ప్ప‌టికీ ఆయ‌న అన్న నారాయ‌ణ‌రెడ్డి మాత్రం టీడీపీలోనే కొన‌సాగారు. దీంతో ఇప్పుడు నారాయ‌ణ‌రెడ్డి కొడుకు భూపేస్‌రెడ్డికి నియోజ‌వ‌క‌ర్గ ఇంఛార్జ్ బాధ్య‌త‌ల‌ను బాబు అప్ప‌జెప్పారు.

జ‌మ్మ‌ల‌మ‌డుగులో తాము పోటీ చేస్తామ‌ని కొంత‌కాలంగా నారాయ‌ణ‌రెడ్డి చెప్తూనే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న కొడుక్కు బాబు బాధ్య‌త‌లు క‌ట్ట‌బెట్ట‌డం వ్యూహాత్మ‌క‌మేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రోవైపు త‌మ వ‌ర్గం చెల్లాచెదురు కాకుండా ఉండేందుకు టీడీపీలో అన్న కుటుంబం కొన‌సాగేందుకు ఆదినారాయ‌ణ రెడ్డి తెర‌వెన‌క ఉండి చ‌క్రం తిప్పార‌నే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.

2014 ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలో చేరి మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్న ఆదినారాయ‌ణ రెడ్డి ప్రస్తుతం బీజేపీలో కొన‌సాగుతున్నారు. అయితే ఎన్నిక‌ల నాటిని జ‌మ్మ‌ల‌మ‌డుగులో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకుంటాయ‌నే అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఆదినారాయాణ లేదంటే భూపేష్‌లో ఎవ‌రో ఒక‌రు మాత్ర‌మే అప్పటికి పోటీలో ఉంటార‌ని ఆ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు గుస‌గుస‌లాడుతున్నారు. మ‌రి ఈ రాజ‌కీయ ప‌రిణామాలు ఏ విధ‌మైన మ‌లుపు తీసుకుంటాయో తేలాలంటే 2023 వ‌ర‌కూ ఆగాల్సిందే.

This post was last modified on September 4, 2021 4:45 pm

Share

Recent Posts

సినీ పరిశ్రమ ఒక మంచి నటుడిని కోల్పోయింది

తెలుగు ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకున్న బాలీవుడ్ న‌టుడు ప్ర‌దీప్ రావ‌త్ హ‌ఠాత్తుగా క‌న్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండ‌రీ…

2 hours ago

రిస్కుకు రెడీ అవుతున్న కనకరాజు

ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…

3 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న బిక్షు యాదవ్

రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…

4 hours ago

ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చిన చంద్ర‌బాబు

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వ రెండేళ్ల పాల‌న‌పై సీఎం చంద్ర‌బాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక ప‌రిస్థితిని ఆయ‌న వివ‌రించారు.…

4 hours ago

దేవిలో ఇది గొప్ప లక్షణం

టీనేజీలోనే తన ప్రతిభను చాటుకుని చాలా వేగంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎదిగాడు దేవిశ్రీ ప్రసాద్. ఎంత ఎదిగినా ఒదిగి…

6 hours ago

రోమియో ఫిక్సయ్యాడు… ఓజి లేటవుతాడు

నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…

7 hours ago