Political News

జ‌మ్మ‌ల‌మ‌డుగులో టీడీపీకి ఆయ‌నే దిక్కు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం ఇప్ప‌టి నుంచే క‌స‌ర‌త్తులు మొదలెట్టిన మాజీ ముఖ్య‌మంత్రి తెలుగు దేశం పార్టీ అధినాయ‌కుడు చంద్ర‌బాబు నాయుడు ఆ దిశ‌గా వేగంగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలోని నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ శ్రేణుల‌ను తిరిగి ఆక్టివ్ చేసే ప‌నిలో ప‌డ్డ ఆయ‌న‌.. ఆ మేర‌కు ఇంఛార్జ్‌ల‌ను నియ‌మిస్తున్నారు. అందులో భాగంగానే క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జ్‌గా దేవ‌గుడి భూషేష్‌రెడ్డిని బాబు నియ‌మించారు. క‌డ‌ప టీడీపీ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ స‌మీక్ష స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

జ‌మ్మ‌ల‌మ‌డుగులో రాజ‌కీయ ప‌రిస్థితులు విచిత్రంగా ఉన్నాయి. టీడీపీ నుంచి మాజీ మంత్రులు ఆదినారాయ‌ణ రెడ్డి బీజేపీలో, పి.రామ‌సుబ్బారెడ్డి వైసీపీలో చేర‌డంతో అక్క‌డ పార్టీని న‌డిపించే నాయ‌కుడు లేకుండా పోయారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆ పార్టీకి జ‌మ్మ‌ల‌మ‌డుగులో దిక్కెవ‌రూ అనుకుంటున్న త‌రుణంలో ఈ ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి బీజేపీలో చేరిన‌ప్ప‌టికీ ఆయ‌న అన్న నారాయ‌ణ‌రెడ్డి మాత్రం టీడీపీలోనే కొన‌సాగారు. దీంతో ఇప్పుడు నారాయ‌ణ‌రెడ్డి కొడుకు భూపేస్‌రెడ్డికి నియోజ‌వ‌క‌ర్గ ఇంఛార్జ్ బాధ్య‌త‌ల‌ను బాబు అప్ప‌జెప్పారు.

జ‌మ్మ‌ల‌మ‌డుగులో తాము పోటీ చేస్తామ‌ని కొంత‌కాలంగా నారాయ‌ణ‌రెడ్డి చెప్తూనే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న కొడుక్కు బాబు బాధ్య‌త‌లు క‌ట్ట‌బెట్ట‌డం వ్యూహాత్మ‌క‌మేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రోవైపు త‌మ వ‌ర్గం చెల్లాచెదురు కాకుండా ఉండేందుకు టీడీపీలో అన్న కుటుంబం కొన‌సాగేందుకు ఆదినారాయ‌ణ రెడ్డి తెర‌వెన‌క ఉండి చ‌క్రం తిప్పార‌నే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.

2014 ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలో చేరి మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్న ఆదినారాయ‌ణ రెడ్డి ప్రస్తుతం బీజేపీలో కొన‌సాగుతున్నారు. అయితే ఎన్నిక‌ల నాటిని జ‌మ్మ‌ల‌మ‌డుగులో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకుంటాయ‌నే అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఆదినారాయాణ లేదంటే భూపేష్‌లో ఎవ‌రో ఒక‌రు మాత్ర‌మే అప్పటికి పోటీలో ఉంటార‌ని ఆ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు గుస‌గుస‌లాడుతున్నారు. మ‌రి ఈ రాజ‌కీయ ప‌రిణామాలు ఏ విధ‌మైన మ‌లుపు తీసుకుంటాయో తేలాలంటే 2023 వ‌ర‌కూ ఆగాల్సిందే.

Satya

Recent Posts

నైజామ్ టికెట్ రేట్లు… ఎడతెగని టెన్షన్లు

పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…

2 hours ago

బడ్జెట్ బయటికి చెప్పడం రిస్కంటారా

మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…

3 hours ago

మాటల్లో రాజీ లేదు.. చేతల్లో ఆలస్యం కాదు..

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…

4 hours ago

బాడీగార్డ్ గురించి ఓపెన్ అయిన చ‌ర‌ణ్‌

త‌న కొత్త సినిమా పెద్ది ప్ర‌మోష‌న్లలో భాగంగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఎక్క‌డికి వెళ్లినా… ఆయ‌న వెంట…

6 hours ago

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…

12 hours ago

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

13 hours ago