Political News

విజయమ్మ చెపిందేమిటి ? చేసిందేమిటి ?

పైకి చెప్పిందేమో రాజకీయాలకు అతీతమైన సమావేశమని. అందుకే తాము నిర్వహించిన సమావేశానికి ఆత్మయ సమావేశమని చెప్పుకున్నారు. కానీ సమావేశంలో జరిగింది మొత్తం రాజకీయమే. మరి ఇంతోటిదానికి విజయమ్మ వివిధ పార్టీల్లోని ఒకప్పటి వైఎస్సార్ అభిమానులు, మద్దతుదారులను ఎందుకు పిలిచారో అర్ధం కావటంలేదు. దివంగత సీఎం వైఎస్సార్ 12వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు విజయమ్మ పేరుతో సుమారు 350 మందికి ఆహ్వానాలు పంపారు.

తాము నిర్వహించబోయే సమావేశానికి ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యాలు లేవని చెప్పుకున్నారు. సరే ఆహ్వానాలు అందుకున్న వారిలో ఎంతమంది హాజరయ్యారనేది వేరేసంగతి. కానీ సమావేశంలో జరిగిందంతా కేవలం రాజకీయమే. తమ బిడ్డ వైఎస్ షర్మిలను ఆశీర్వదించమని విజయమ్మ అడగటం రాజకీయం కాక మరేమిటి. తెలంగాణాలో మళ్ళీ రాజన్న పాలనను తీసుకొస్తానని షర్మిల చెప్పటం రాజకీయం కాదా ? తన బిడ్డకు మద్దతుగా నిలవాలని, తెలంగాణాలో మళ్ళీ వైఎస్ పాలన తెస్తానని షర్మిల శపథం చేయటాన్ని ఏమంటారో విజయమ్మే చెప్పాలి.

సమావేశంలో చాలా మాట్లాడిన షర్మిల చివరగా తెలంగాణా ప్రజలంతా తన కుటుంబమని ఈ విధంగా తన తండ్రి తన గుండెలపై విల్లు రాశారని చెప్పటమేంటో షర్మిలకే తెలియాలి. గుండెలపై విల్లు రాయటం ఏమిటో ఎవరికీ అర్ధం కావటంలేదు. మొత్తంమీద ఆత్మీయ సమావేశం ఫక్తు రాజకీయంగానే సాగింది. ఈ విషయాన్ని ముందుగా ఊహించే చాలామంది నేతలు హాజరుకాలేదు. హాజరైన నేతల్లో మాట్లాడిన వారుకూడా వైఎస్ తో తనకున్న సన్నిహితాన్ని గుర్తుచేసుకున్నారే కానీ విజయమ్మ, షర్మిల గురించి పెద్దగా ప్రస్తావించలేదు.

షర్మిల పార్టీకి మద్దతుగా నిలుస్తామని సమావేశానికి హాజరైన నేతల్లో ఒక్కరుగా కూడా బమిరంగంగా చెప్పలేదు. నిజానికి ఒకప్పటి వైఎస్ సన్నిహితులంతా ఇఫుడు చాలా పార్టీల్లో చేరిపోయున్నారు. తమ పార్టీ లైనును కాదని ఎవరు షర్మిలకు సాయం చేసే పరిస్దితుల్లో లేరనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు షర్మిల పార్టీకి జనాల యాక్సప్టెన్స్ ఉందో లేదో కూడా తెలీదు. పైగా పార్టీలో షర్మిల తప్ప జనాలందరు గుర్తుపట్టే రెండోనేతే ఎవరు లేరు.

ఈ నేపధ్యంలో షర్మిల పార్టీలో చేరితే ఏమాత్రం ఉపయోగమని నేతలు ఎవరికి వారు ఆలోచించుకుంటారు. ప్రస్తుత రాజకీయ పార్టీల్లో సిద్ధాంతాలు ఎప్పుడో గాలికి కొట్టుకుపోయాయి. ఉన్నదంతా సొంత లాభం ఏమిటని ఆలోచించుకునే వాళ్ళే ఎక్కువమంది. ఇలాంటి పరిస్ధితుల్లో షర్మిల పార్టీలో ఎవరైనా ఎందుకు చేరుతారు ? ఈ ఏడాది చివరలో షర్మిల పాదయాత్ర చేస్తారని అంటున్నారు. ఆ పాదయాత్రలో జనాలు స్పందించే విధానాన్ని బట్టి నేతల ఆలోచానల్లో ఏమైనా మార్పొస్తుందేమో తెలీదు. కాబట్టి ఇఫ్పటికిప్పుడు నేతల నుండి షర్మిలకు దొరికే మద్దతు శూన్యమే.

This post was last modified on September 4, 2021 12:01 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

థియేట్రికల్ రిలీజ్‌లు లైట్.. ఓటీటీ సినిమాలే హైలైట్

ఏప్రిల్ చివరి వారం అంటే పీక్ సమ్మర్.. ఈ టైంలో పెద్ద పెద్ద సినిమాలతో థియేటర్లు కళకళలాడుతుండాలి. రెండు గంటలు…

34 mins ago

పింఛ‌న్ల‌పై పిడుగు.. వైసీపీకి క‌ష్ట‌మేనా?

సామాజిక పింఛ‌న్ల పై పిడుగు ప‌డిన‌ట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంట‌రి మ‌హిళ లు.. వంటి సామాజిక పింఛ‌నుపై…

6 hours ago

వైసీపీ మేనిఫెస్టోపై చంద్ర‌బాబు ఫ‌స్ట్‌ రియాక్ష‌న్

ఏపీలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించి అధికార పార్టీ వైసీపీ తాజాగా ఎన్నిక‌ల మేనిఫెస్టోను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. 2019…

6 hours ago

జై హనుమాన్ రూటు మారుతోంది

స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…

7 hours ago

ఆ విషయంలో ఎవరైనా సుకుమార్ తర్వాతే..

టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…

8 hours ago

బాబు సూప‌ర్ సిక్స్‌- జ‌గ‌న్ నైన్ గ్యారెంటీస్‌ ఎవ‌రిది ముందంజ‌!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎన్నిక‌ల ప్ర‌చారంలో సూప‌ర్ సిక్స్‌ను ఎక్కువ‌గా ప్ర‌చారం చేస్తున్నారు. తాను అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. వీటిని…

8 hours ago