Political News

ఆఫ్ఘన్లో పెరిగిపోతున్న ఆకలి కేకలు

ఆప్ఘన్లో ఆకలి కేకలు పెరిగిపోతున్నాయి. లక్షలాది మంది జనాలు కడుపునిండా తిండితిని రోజులైపోయాయట. ఐక్యారాజ్య సమితి అంచనా ప్రకారం దేశంలోని మొత్తం జనాభాలో సుమారు 30 శాతంకి ఒకపూట భోజనం దొరకటం కూడా చాలా కష్టమైపోతోందట. వీరిల్లో ముసలివాళ్ళు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఒకవైపు తాలిబన్ల అరాచకం, మరోవైపు ఆకలి బాధలతో జనాలు అల్లాడిపోతున్నారు. ఆగష్టు 15వ తేదీన దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకున్న రెండు రోజులకు సమస్యలు మొదలైనట్లు అంచనా.

అంతర్జాతీయ తీవ్రవాద సంస్ధల జాబితాలో తాలిబన్లు కూడా ఉండటంతో ప్రపంచదేశాలు ఆప్ఘన్తో వ్యాపార లావాదేవీలు నిర్వహించటానికి ఇష్టపడటంలేదు. దీనికి అదనంగా తాలిబన్లు కూడా దేశాల సరిహద్దులను మూసేయటం, అంతర్జాతీయంగా విమానర్వీసులను నిలిపేయటంతో ప్రపంచదేశాలకు-ఆప్ఘన్ కు రాకపోకలు నిలిచిపోయాయి. తాలిబన్లు చేస్తున్న అరాచకాలను చూసిన తర్వాత ఏ దేశం కూడా వీళ్ళతో సంబంధాలు పెట్టుకోవటానికి ఇష్టపడటం లేదు. దీని ప్రభావం దేశంలోని జనాల రోజువారి జీవితం మీద పడింది.

మామూలుగానే ఆప్ఘన్ నుండి ఎగుమతులు చాలా తక్కువే. దేశంలో నుండి ఎగుమతవుతున్న వస్తువుల్లో చెప్పుకోవాల్సింది ఏమిటంటే మత్తుమందు ఓపియం. ప్రపంచ మత్తుమందుల వాడకంలో ఓపియం ఎగుమతుల్లో ఆప్ఘనే 95 శాతం ఎగుమతి చేస్తోంది. ఇది కాకుండా డ్రైఫూట్స్ ఎగుమతవుతుంటాయి. ఇక మామూలు ఆహార ధాన్యాలు, ఉప్పులు, నూనెలు సమస్తం ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సిందే. తాలిబన్ల అరాచకాల కారణంగా దిగుమతులు, ఎగుమతులు కూడా నిలిచిపోయాయి.

ప్రస్తుతం దేశంలో ఏ నగరానికి వెళ్ళినా బ్రెడ్డు ఖరీదు సుమారు రు. 7500. కిలో బంగాళదుంపల ఖరీదు 8 వేల రూపాయలట. అంటే తాలిబన్ల కదలికలను గమనించిన వ్యాపారస్తులు ముందుజాగ్రత్తగా తమ దగ్గరున్న నిత్యావసరాలను, బ్రెడ్డు లాంటి బేకరీ ఐటములను జనాలకు అమ్మటం మానేశారు. వాళ్ళు ఊహించినట్లే తాలిబన్ల అరాచకాలు పెరిపోవటంతో నిత్యావసరాలు, బేకరీ ఐటములు మార్కెట్లో దొరకటంలేదు. దీంతో ధరలు ఆకాశానికి ఎగబాకటంతో ధనవంతులు కూడా కొనలేకపోతున్నారు. ఫలితంగా ఆకలి కేకలు పెరిగిపోతున్నాయి.

This post was last modified on September 3, 2021 12:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రియురాలి మాయలో మాస్ ‘మహాశయుడు’

గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…

14 minutes ago

అభిమానులూ… లీకుల ఉచ్చులో పడకండి

కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…

39 minutes ago

ఇంటిని తాక‌ట్టు పెట్టిన హ‌రీష్ రావు… దేనికో తెలుసా?

బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్‌రావు.. త‌న ఇంటిని తాక‌ట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వ‌ద్దుకు…

41 minutes ago

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

1 hour ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

3 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago