టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీకి రాజీనామా చేయబోతున్నారంటూ కొద్దిరోజుల క్రితం ప్రచారం సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్సీ లోకేష్ లు తన ఫోన్ లు కూడా లిఫ్ట్ చేయడం లేదని బుచ్చయ్య చౌదరి అసంతృప్తి వ్యక్తం చేశారని ప్రచారం జరిగింది. అయితే, గోరంట్లతో టీడీపీ ముఖ్యనేతలు సంప్రదింపులు జరపడంతో బుచ్చయ్య చౌదరి తన రాజీనామా గురించి అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.
ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబుతో గోరంట్ల భేటీ అయ్యారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ లో చంద్రబాబుతో భేటీ కావాలంటూ బుచ్చయ్య చౌదరికి పిలుపు వచ్చింది. ఈ క్రమంలోనే పార్టీ అదినేతతో సమావేశమైన బుచ్చయ్య చౌదరి…పలు విషయాలపై చర్చించారని తెలుస్తోంది. తన అసంతృప్తికి గల కారణాలను చంద్రబాబుకు గోరంట్ల వివరించారు. ఈ భేటీలో గోరంట్లతోపాటు పార్టీ సీనియర్ నేతలు చినరాజప్ప, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, గద్దె రామ్మోహన్ కూడా వచ్చారు.
పార్టీలో కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు తనను కలిచివేశాయని, తన మాటకు విలువ ఇవ్వకుండా అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు, వాటి పర్యవసానాలపై చంద్రబాబుతో గోరంట్ల చర్చించినట్లు తెలుస్తోంది. తనకు ఇష్టం లేకపోయినా…పార్టీ నిర్ణయం ప్రకారం రాజమండ్రి రూరల్ కు వెళ్లానని గోరంట్ల చెప్పిన విషయాలని చంద్రబాబు సావధానంగా విన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత రాజీనామాపై గోరంట్ల వెనక్కు తగ్గారని ప్రచారం జరుగుతోంది.
అయితే, గోరంట్ల అలక మాన్పించేందుకు చంద్రబాబు ఏం హామీలు ఇవ్వబోతున్నారన్నది హాట్ టాపిక్ గా మారింది. పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ పదవీకాలం త్వరలో ముగియనున్న నేపథ్యంలో ఆ పదవిపై గోరంట్ల ఆశపడుతున్నారని, అధినేత దృష్టికి ఈ విషయాన్ని తెచ్చారని తెలుస్తోంది. త్వరలో జరగబోయే రాజమండ్రి కార్పోరేషన్ ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక, కొన్ని పదవులు, ఇతర వ్యవహారాల్లో తన మాట చెల్లేలా చూడాలని కూడా గోరంట్ల కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ అంశాలపై చంద్రబాబు ఆయనకు హామీ ఇస్తారా లేదా అన్నది త్వరలో తేలిపోనుంది.
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…
నరాల్లో హార్పిక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీరు విన్నది నిజమే. బర్తను అకారణంగా చంపేస్తున్న భార్యల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.…
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. ఉరఫ్ PK .. ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రత్యక్ష…
తమిళంలో చాలా ఏళ్ల నుంచి మంచి మంచి సినిమాలు చేస్తున్నప్పటికీ.. తెలుగమ్మాయి గుత్తా జ్వాలను పెళ్లి చేసుకోవడం ద్వారానే ఎక్కువగా తెలుగు వాళ్ల దృష్టిని ఆకర్షించాడు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై…