Political News

తెలంగాణ వాకౌట్

కృష్ణా జలాల వినియోగంపై ఇంతకాలం తెలంగాణా ప్రభుత్వం చేస్తున్న వాదనల్లోని పసలేదని బయటపడింది. తన వాదనలో లాజిక్ లేదని తేలిపోయాక, అడ్డుగోలు వాదన సాధ్యం కాదని అర్ధమైపోయాక సింపుల్ గా సమావేశం నుంచి తెలంగాణ వాకౌట్ చేసేసింది. రెండు రాష్ట్రాల మధ్య మొదలైన జలవివాదాలపై చర్చించేందుకు కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబి) సమావేశం జరిగింది. హైదరాబాద్ లో జరిగిన ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల్లోని జలవనరుల శాఖల్లోని ఉన్నతాధికారులు హాజరయ్యారు.

కృష్ణా జలాల వినియోగం ఎప్పటినుండో అమల్లో ఉన్న బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం కాదని తెలంగాణా ప్రభుత్వం వితండ వాదన మొదలు పెట్టింది. ట్రైబ్యునల్ ప్రకారం ఏపికి 66 శాతం, తెలంగాణాకు 34 శాతం నీటి వినియోగంలో హక్కుంది. అయితే ట్రైబ్యునల్ తీర్పును కాదని చెరిసగం వాడుకోవాల్సిందే అనే వితండ వాదన తెలంగాణ మొదలుపెట్టింది.

ఒకవైపు నీటి నిల్వ సామర్ధ్యంతో సబంధం లేకుండానే శ్రీశైలం డ్యాం నీటితో విద్యుత్ ఉత్పత్తి చేస్తూనే మరోవైపు నీటి వాటాను చెరిసగం కావాల్సిందే అంటు కావాలనే వాదన పెట్టుకుంది. ఎందుకంటే జల విద్యుత్ ఉత్పత్తి విషయంలో తన నిర్ణయాన్ని సమర్దించుకునే అవకాశం లేదని తెలిసిన తర్వాత జలవివాదాలకు కావాలనే ఆజ్యంపోసింది. తెలంగాణా ఉద్దేశ్యం ఏమిటో అర్ధమైపోయిన తర్వాత ఇక లాభం లేదని ఏపి… ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ, భద్రతపై కేంద్రం జోక్యం కావాలంటు లేఖ రాసింది.

ఎప్పుడైతే కృష్ణా, గోదావరి రివర్ యాజమాన్య బోర్డులను కేంద్రం తన చేతిలోకి తీసేసుకుందో వెంటనే తెలంగాణాకు ఏమిచేయాలో అర్ధంకాలేదు. ఒకసారి రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తే తన బండారం బయటపడిపోతుంది. అందుకనే పదే పదే సమావేశాలు గైర్హాజరవుతోంది. అయితే బుధవారం జరిగిన సమావేశానికి హాజరు కాక తప్పలేదు. దాంతో ఇష్టం లేకుండానే తెలంగాణా జలవనరుల శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

అందరూ అనుకున్నట్లే ఐదు గంటలపాటు జరిగిన సమావేశం, వాదనల్లో తెలంగాణ ప్రభుత్వం వాదన తేలిపోయింది. నీటి వాటాలో మార్పుండదని కేంద్రం స్పష్టంగా తేల్చిచెప్పింది. పైగా జలవిద్యుత్ ను వెంటనే ఆపాలని కూడా గట్టిగా హెచ్చరించింది. శ్రీశైలం జలవిద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు అని తెలంగాణా వాదించింది. కాదని ఏపీ వాదించింది. తెలంగాణా వాదన ఏ విధంగా తప్పోకూడా నిరూపించింది. దాంతో తన వాదనను సమర్ధించుకునే అవకాశం తెలంగాణాకు లేకుండాపోయింది. దాంతో ఏపి తాగు, సాగునీటి అవసరాలు తీరిన తర్వాతే శ్రీశైలంలో ప్రాజెక్టులో జలవిద్యుత్ చేయాలంటు చెప్పింది. దాంతో తెలంగాణా ప్రభుత్వం సమావేశం నుండి వాకౌట్ చేసి వళ్ళిపోయింది.

This post was last modified on September 2, 2021 3:49 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

6 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

7 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

8 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

9 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

9 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

10 hours ago