Political News

జ‌గ‌న్‌ కి ఇది కత్తి మీద సామే !

ఇప్పుడు.. ఈ ప్ర‌శ్న మేధావుల‌ను కూడా తిక‌మ‌క పెడుతోంది. క‌ర‌డు గ‌ట్టిన వైసీపీ అభిమానుల‌ను కూడా క‌ల‌చి వేస్తోంది. ఎందుకంటే.. ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌గ‌న్ ఇచ్చిన అనేక హామీల్లో ఒక‌టి అత్యంత క్లిష్ట మైన హామీ. ఇప్పుడు ఈ హామీని నిల‌బెట్టుకోవ‌డం అనేది జ‌గ‌న్‌కు క‌త్తిమీద సాముగా మారింది. అయితే.. అమ‌లు చేయ‌క‌పోతే.. వ‌చ్చె ఎన్నిక‌ల్లో ఈ హామీ పెద్ద మైన‌స్‌గా మారిపోవ‌డం ఖాయం. దీంతో ఇప్పుడు జ‌గ‌న్ మ‌డ‌మ ఎటుతిరుగుతుంది ? అనే ట్యాగ్‌తో టీడీపీ ఆట ప‌ట్టిస్తోంది. ఇంత‌కీ విష‌యంలోకి వెళ్తే.. ఏపీలో అధికారం చేప‌ట్టేందుకు.. జ‌గ‌న్ పాద‌యాత్ర చేశారు.

ఈ స‌మ‌యంలో ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలుసుకున్న ఆయ‌న‌.. వెంట‌నే.. కొన్ని హామీలు ఇచ్చారు. వీటిలో అత్యంత కీల‌క‌మైన‌.. మ‌ద్య నిషేధం ఒక‌టి. దీనిని విడ‌తల వారీగా ఆయ‌న అమ‌లు చేస్తాన‌ని అన్నారు. అంతేకాదు.. ధ‌ర‌లు పెంచుతాన‌ని చెప్పారు. వీటిలో తొలి ఏడాది పాల‌న స‌మ‌యంలో.. నిజంగానే షాపుల సంఖ్య త‌గ్గించారు. దీంతో ఇంకేముంది.. జ‌గ‌న్ అన్న‌మాట నిల‌బెట్టుకుంటున్నార‌నే వ్యాఖ్య‌లు విస్తృతంగా ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. ఇక‌, వైసీపీ నాయ‌కులు జ‌గ‌న్‌కు పాలాభిషేకాలు చేశారు. కానీ, అనూహ్యంగా రెండో ఏడాది పాల‌న వ‌చ్చే స‌రికి.. క‌రోనా ఎఫెక్ట్‌తో ప్ర‌భుత్వానికి ఆదాయం త‌గ్గిపోయింది.

దీంతో మ‌ద్యం త‌ప్ప మ‌రోమార్గం ప్ర‌భుత్వానికి లేకుండా పోయింది. నిజానికి కేంద్ర ప్ర‌భుత్వం కూడా మ‌ద్యం పై వ‌చ్చే ఆదాయాన్ని నిక‌ర వ‌న‌రుగా భావిస్తుంద‌ని. ఆర్థిక వేత్త‌లు చెబుతారు. అన్ని రాష్ట్రాలూ.. ఒక్క గుజ‌రాత్ త‌ప్ప‌.. మ‌ద్యంపైనే ఆధార‌ప‌డి న‌డుస్తున్నాయి. గోవా అయితే.. ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రు మ‌ద్యం, టూరిజంపైనే ఆధార‌ప‌డింది. అలాంటిది .. ఏపీలో మ‌ద్య నిషేధం మాట‌.. నిజంగానే ఇప్పుడు ఇబ్బందిగా మారింది. ఇప్ప‌టికే ప్ర‌భుత్వం ఏర్ప‌డి రెండున్న‌రేళ్లు గ‌డిచి పోయింది. ఆర్థిక స‌మ‌స్య‌లు అల్లాడిస్తున్నాయి.

మ‌రో రెండున్న‌రేళ్ల‌లో మ‌ళ్లీ ఎన్నిక‌లు వ‌స్తాయి. ఈ నేప‌థ్యంలో కీల‌క‌మైన మ‌ద్య నిషేధం అమ‌లు చేయ‌క‌పోతే.. ఈ విష‌యాన్ని ప్ర‌తిప‌క్షాలు ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్లి జ‌గ‌న్‌ను బద్నాం చేయ‌డం ఖాయ‌మ‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. ఈ ప‌రిణామాల‌తో జ‌గ‌న్ స‌ర్కారు ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఇప్పుడు ఏం చేయాలి? అనే ఆలోచ‌న ఉన్నా.. ఇప్ప‌టికిప్పుడు వివిధ సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయాలంటే.. ఆదాయ వ‌న‌రుగా ఉన్న మ‌ద్యం త‌ప్ప‌.. మ‌రో మార్గం లేదు. సో.. ఈ విష‌యంలో పాదం ఎటు తిప్పాలి? అనేది వైసీపీలో త‌ర్జ‌న భ‌ర్జ‌న‌కు గురి చేస్తున్న ప్ర‌ధాన అంశంగా మార‌డం విశేషం.

This post was last modified on September 2, 2021 12:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సింగల్ స్క్రీన్ VS మల్టీప్లెక్స్… ఏది రైటు?

ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…

31 minutes ago

దురంధర్ పోటీ సినిమాకు ఘోర అవమానం

గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…

2 hours ago

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

3 hours ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

4 hours ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

5 hours ago

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

6 hours ago