Political News

జ‌గ‌న్‌ కి ఇది కత్తి మీద సామే !

ఇప్పుడు.. ఈ ప్ర‌శ్న మేధావుల‌ను కూడా తిక‌మ‌క పెడుతోంది. క‌ర‌డు గ‌ట్టిన వైసీపీ అభిమానుల‌ను కూడా క‌ల‌చి వేస్తోంది. ఎందుకంటే.. ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌గ‌న్ ఇచ్చిన అనేక హామీల్లో ఒక‌టి అత్యంత క్లిష్ట మైన హామీ. ఇప్పుడు ఈ హామీని నిల‌బెట్టుకోవ‌డం అనేది జ‌గ‌న్‌కు క‌త్తిమీద సాముగా మారింది. అయితే.. అమ‌లు చేయ‌క‌పోతే.. వ‌చ్చె ఎన్నిక‌ల్లో ఈ హామీ పెద్ద మైన‌స్‌గా మారిపోవ‌డం ఖాయం. దీంతో ఇప్పుడు జ‌గ‌న్ మ‌డ‌మ ఎటుతిరుగుతుంది ? అనే ట్యాగ్‌తో టీడీపీ ఆట ప‌ట్టిస్తోంది. ఇంత‌కీ విష‌యంలోకి వెళ్తే.. ఏపీలో అధికారం చేప‌ట్టేందుకు.. జ‌గ‌న్ పాద‌యాత్ర చేశారు.

ఈ స‌మ‌యంలో ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలుసుకున్న ఆయ‌న‌.. వెంట‌నే.. కొన్ని హామీలు ఇచ్చారు. వీటిలో అత్యంత కీల‌క‌మైన‌.. మ‌ద్య నిషేధం ఒక‌టి. దీనిని విడ‌తల వారీగా ఆయ‌న అమ‌లు చేస్తాన‌ని అన్నారు. అంతేకాదు.. ధ‌ర‌లు పెంచుతాన‌ని చెప్పారు. వీటిలో తొలి ఏడాది పాల‌న స‌మ‌యంలో.. నిజంగానే షాపుల సంఖ్య త‌గ్గించారు. దీంతో ఇంకేముంది.. జ‌గ‌న్ అన్న‌మాట నిల‌బెట్టుకుంటున్నార‌నే వ్యాఖ్య‌లు విస్తృతంగా ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. ఇక‌, వైసీపీ నాయ‌కులు జ‌గ‌న్‌కు పాలాభిషేకాలు చేశారు. కానీ, అనూహ్యంగా రెండో ఏడాది పాల‌న వ‌చ్చే స‌రికి.. క‌రోనా ఎఫెక్ట్‌తో ప్ర‌భుత్వానికి ఆదాయం త‌గ్గిపోయింది.

దీంతో మ‌ద్యం త‌ప్ప మ‌రోమార్గం ప్ర‌భుత్వానికి లేకుండా పోయింది. నిజానికి కేంద్ర ప్ర‌భుత్వం కూడా మ‌ద్యం పై వ‌చ్చే ఆదాయాన్ని నిక‌ర వ‌న‌రుగా భావిస్తుంద‌ని. ఆర్థిక వేత్త‌లు చెబుతారు. అన్ని రాష్ట్రాలూ.. ఒక్క గుజ‌రాత్ త‌ప్ప‌.. మ‌ద్యంపైనే ఆధార‌ప‌డి న‌డుస్తున్నాయి. గోవా అయితే.. ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రు మ‌ద్యం, టూరిజంపైనే ఆధార‌ప‌డింది. అలాంటిది .. ఏపీలో మ‌ద్య నిషేధం మాట‌.. నిజంగానే ఇప్పుడు ఇబ్బందిగా మారింది. ఇప్ప‌టికే ప్ర‌భుత్వం ఏర్ప‌డి రెండున్న‌రేళ్లు గ‌డిచి పోయింది. ఆర్థిక స‌మ‌స్య‌లు అల్లాడిస్తున్నాయి.

మ‌రో రెండున్న‌రేళ్ల‌లో మ‌ళ్లీ ఎన్నిక‌లు వ‌స్తాయి. ఈ నేప‌థ్యంలో కీల‌క‌మైన మ‌ద్య నిషేధం అమ‌లు చేయ‌క‌పోతే.. ఈ విష‌యాన్ని ప్ర‌తిప‌క్షాలు ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్లి జ‌గ‌న్‌ను బద్నాం చేయ‌డం ఖాయ‌మ‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. ఈ ప‌రిణామాల‌తో జ‌గ‌న్ స‌ర్కారు ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఇప్పుడు ఏం చేయాలి? అనే ఆలోచ‌న ఉన్నా.. ఇప్ప‌టికిప్పుడు వివిధ సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయాలంటే.. ఆదాయ వ‌న‌రుగా ఉన్న మ‌ద్యం త‌ప్ప‌.. మ‌రో మార్గం లేదు. సో.. ఈ విష‌యంలో పాదం ఎటు తిప్పాలి? అనేది వైసీపీలో త‌ర్జ‌న భ‌ర్జ‌న‌కు గురి చేస్తున్న ప్ర‌ధాన అంశంగా మార‌డం విశేషం.

This post was last modified on September 2, 2021 12:19 pm

Share

Recent Posts

సుమంత్ కోరుకున్న ఫలితం దక్కిందా

ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…

31 minutes ago

దేవిశ్రీ మళ్లీ విజృంభించబోతున్నాడా?

సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…

2 hours ago

పట్టు విడువని విక్రమార్కుడిలా…

ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…

2 hours ago

కొవిడ్ మత్తులో మెగా హీరో చేసిన తప్పులు

ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…

3 hours ago

సహజీవనంలోనూ గృహ హింస కేసుకు ఛాన్స్!

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…

4 hours ago

ఇండియన్ స్టార్ హీరోల సరసన టామ్ హాలండ్

అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…

4 hours ago